...
...
Next Story

Karuppu: సూర్య, త్రిష కరుప్పు అరుదైన ఘనత.. 9 నెలల తర్వాత తమిళనాడులో తొలి రూ.100 కోట్ల మూవీ..

Karuppu: సూర్య, త్రిష లీడ్ రోల్స్ లో నటించిన కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) మూవీ బాక్సాఫీస్ దగ్గర మరో అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే రూ.200 కోట్ల క్లబ్ లో చేరిన ఈ మూవీ.. తమిళనాడులో రూ.100 కోట్ల మార్క్ దాటింది.

Published on: May 23, 2026, 11:37:40 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Karuppu: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, స్టార్ బ్యూటీ త్రిష జంటగా నటించిన సరికొత్త చిత్రం ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల వేట కొనసాగిస్తోంది. విడుదలైన వారం రోజుల్లోనే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించింది.

తమిళనాడులో సరికొత్త రికార్డు

Karuppu: సూర్య, త్రిష కరుప్పు అరుదైన ఘనత.. 9 నెలల తర్వాత తమిళనాడులో తొలి రూ.100 కోట్ల మూవీ..
Karuppu: సూర్య, త్రిష కరుప్పు అరుదైన ఘనత.. 9 నెలల తర్వాత తమిళనాడులో తొలి రూ.100 కోట్ల మూవీ..

గత తొమ్మిది నెలలుగా తమిళ చిత్రసీమలో ఏ సినిమాకూ సాధ్యం కాని అరుదైన రికార్డును 'కరుప్పు' సొంతం చేసుకుంది. కేవలం తమిళనాడులోనే ఈ సినిమా రూ. 100 కోట్ల వసూళ్ల మార్కును దాటేసింది. ఈ చిత్రాన్ని తమిళనాడులో పంపిణీ చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ శక్తివేలన్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

"నా డిస్ట్రిబ్యూషన్ ప్రయాణంలో ఇది ఒక చారిత్రాత్మక మైలురాయి. తమిళనాడు బాక్సాఫీస్ వద్ద కరుప్పు రూ. 100 కోట్ల మార్కును దాటడం నాకెంతో గర్వంగా, భావోద్వేగంగా ఉంది. ఈ విజయాన్ని మాటల్లో వర్ణించలేను" అని ఆయన ఎక్స్ లో రాసుకొచ్చారు.

గత ఏడాది ఆగస్టులో విడుదలైన రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ ల భారీ చిత్రం 'కూలీ' (తమిళనాడులో రూ. 144 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 518 కోట్లు) తర్వాత అక్కడ రూ. 100 కోట్లు సాధించిన ఏకైక తమిళ చిత్రంగా 'కరుప్పు' నిలిచింది.

'కరుప్పు' బాక్సాఫీస్ కలెక్షన్ల వివరాలు

ఈ కరుప్పు మూవీ ప్రపంచవ్యాప్తంగా సాధించిన వసూళ్ల వివరాలు చూస్తే.. ఇండియాలో తొలి వారం నెట్ వసూళ్లు రూ.113.85 కోట్లుగా ఉన్నాయి. ఇక 8 రోజులకు రూ.121.65 కోట్లకు చేరాయి. ఓవర్సీస్ వసూళ్లు చూస్తే గ్రాస్ రూ.60 కోట్లుగా ఉంది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా రూ.200.86 కోట్లు వసూలు చేసింది.

ఫిల్మ్‌మేకర్ కమ్ యాక్టర్ ఆర్జే బాలాజీ స్వయంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రత్నకుమార్, అశ్విన్ రవిచంద్రన్‌లతో కూడిన బృందం స్క్రీన్‌ప్లే అందించింది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై నిర్మితమైన ఈ సినిమాలో సూర్య, త్రిష, ఆర్జే బాలాజీలతో పాటు ఇంద్రన్స్, అనఘా మాయా రవి, నట్టి సుబ్రమణ్యం, శ్వాసిక కీలక పాత్రలు పోషించారు. సాయి అభ్యంకర్ అందించిన సంగీతం సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా నిలిచింది.

గ్రామ దేవత అయిన 'వెట్టై కరుప్పు' (వేట కరుప్పు).. కష్టాల్లో ఉన్న ఒక తండ్రి, కూతురికి న్యాయం చేయడం కోసం 'శరవణన్' అనే లాయర్ రూపంలో భూమిపైకి రావడం ఈ సినిమా ముఖ్య కథాంశం. ఆర్థిక ఇబ్బందుల వల్ల మే 15న ఒకరోజు ఆలస్యంగా విడుదలైనప్పటికీ, పవర్‌ఫుల్ ఫస్టాఫ్, నటీనటుల అద్భుతమైన నటనతో ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. 'కరుప్పు' సినిమా తెలుగు టైటిల్ ఏమిటి?

సూర్య నటించిన తమిళ చిత్రం 'కరుప్పు' తెలుగులో 'వీరభద్రుడు' అనే పేరుతో విడుదలైంది.

2. ఈ కరుప్పు మూవీ వారం రోజుల్లో ఎంత వసూలు చేసింది?

ఈ చిత్రం విడుదలైన 8 రోజుల్లో భారతదేశంలో రూ. 121.65 కోట్ల నెట్ వసూళ్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 200.86 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

3. తమిళనాడు బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించిన రికార్డు ఏమిటి?

గత 9 నెలల్లో తమిళనాడులో రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన మొదటి తమిళ చిత్రంగా 'కరుప్పు' నిలిచింది. అంతకుముందు 2025 ఆగస్టులో వచ్చిన రజనీకాంత్ 'కూలీ' ఈ ఘనత సాధించింది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe