Trisha Vijay: కరుప్పు సక్సెస్పై త్రిష పోస్ట్ వైరల్.. విజయ్తో లింకు పెట్టేస్తున్న ఫ్యాన్స్.. ‘మే’ బాగానే కలిసొచ్చింది
Trisha Vijay: సౌత్ స్టార్ బ్యూటీ త్రిష కృష్ణన్ నటించిన తాజా మూవీ 'కరుప్పు' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ఘన విజయం సాధించిన తరుణంలో.. త్రిష సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్, దానికి పెట్టిన క్యాప్షన్ ఇప్పుడు కోలీవుడ్లో సరికొత్త చర్చకు దారితీసింది.
Trisha Vijay: స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ప్రస్తుతం తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలతో నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం 'కరుప్పు' (Karuppu) థియేటర్లలో అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతూ బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది.

ఈ భారీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ త్రిష సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. అయితే ఆ పోస్ట్లో ఆమె రాసిన క్యాప్షన్ వెనుక తమిళనాడు సీఎం, నటుడు జోసెఫ్ విజయ్ ఉన్నారంటూ ఫ్యాన్స్ డీకోడ్ చేయడం ఆసక్తికరంగా మారింది.
త్రిష ఇన్స్టాగ్రామ్ పోస్ట్.. ఫ్యాన్స్ డీకోడింగ్
త్రిష తన అధికారిక ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో 'కరుప్పు' సినిమా షూటింగ్ సెట్స్కు సంబంధించిన కొన్ని బిహైండ్ ది సీన్స్ (BTS) ఫొటోలను పంచుకుంది. అందులో ఆమెతో పాటు హీరో సూర్య, ఆర్జే బాలాజీ ఉన్నారు.
ఈ ఫొటోలకు ఆమె పెట్టిన క్యాప్షన్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. "నాకు బాగా కలిసి వచ్చిన మే నెల చెబుతోంది.. మరో విజయం ఇది అని. అంతా దేవుడి దయ" అని త్రిష క్యాప్షన్ ఉంచింది.
ఈ క్యాప్షన్ చూసిన వెంటనే విజయ్, త్రిష అభిమానులు అలర్ట్ అయ్యారు. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ సాధించిన భారీ విజయాన్ని ఉద్దేశించే త్రిష ఈ వ్యాఖ్యలు చేసిందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఒక అభిమాని స్పందిస్తూ.. "ఈ క్యాప్షనే అంతా చెబుతోంది" అని రాయగా, మరొకరు "కోడ్ వర్డ్ యాక్సెప్టెడ్.. వన్ మోర్ ఫర్ ది విన్" అని పేర్కొన్నారు. ఇంకొక నెటిజన్ ఆ క్యాప్షన్ను విశ్లేషిస్తూ.. "వన్ మోర్ ఫర్ ది విన్ అంటే: 1- తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలుపు, 2- కరుప్పు సినిమా సక్సెస్" అని రాసుకొచ్చారు.
మే నెలతో ఉన్న ప్రత్యేక బంధం
నిజానికి 2026 మే నెల త్రిష, విజయ్ ఇద్దరికీ ఎంతో ప్రత్యేకం.
మే 4, 2026: తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. విశేషం ఏమిటంటే అదే రోజు త్రిష 43వ పుట్టినరోజు కూడా కావడం గమనార్హం.
మే 10, 2026: మిత్రపక్షాల మద్దతుతో జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు త్రిష ప్రత్యేకంగా హాజరై, విజయ్ తల్లిదండ్రులను కలిసి శుభాకాంక్షలు తెలిపారు.
మే 11, 2026: ప్రమాణ స్వీకార వేడుకకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ త్రిష.. "ది లవ్ ఈజ్ ఆల్వేస్ లౌడర్" అని క్యాప్షన్ ఇచ్చింది.
కోలీవుడ్లో విజయ్-త్రిష జోడీకి ఉన్న క్రేజ్ ప్రత్యేకమైనది. వీరిద్దరూ కలిసి నటించిన 'గిల్లి', 'తిరుపాచి', 'ఆది', 'కురువి' వంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది.
ఈ ఏడాది ఆరంభంలో విజయ్ తన భార్య సంగీత నుంచి విడిపోతున్నారనే వార్తలు రావడంతో ఈ పుకార్లు మరింత ఎక్కువయ్యాయి. అయితే ఈ రూమర్లపై ఇటు విజయ్ గానీ, అటు త్రిష గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
బాక్సాఫీస్ వద్ద 'కరుప్పు' ప్రభంజనం
మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'కరుప్పు' చిత్రానికి ప్రేక్షకులు, విమర్శకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. విడుదలైన కేవలం 3 రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.120 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అంతేకాకుండా దేశీయ బాక్సాఫీస్ వద్ద కూడా శరవేగంగా రూ.100 కోట్ల మార్కును దాటి, 2026లో తమిళ పరిశ్రమలో అతిపెద్ద హిట్లలో ఒకటిగా నిలిచింది.
ఈ సినిమా రూ.100 కోట్ల క్లబ్లో చేరిన తరుణంలో, తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. సీఎం విజయ్ నుంచి ప్రశంసలు అందుకోవడంపై చిత్ర నిర్మాణ సంస్థ హర్షం వ్యక్తం చేస్తూ.. తాము ఎంతో ఆనందంగా ఉన్నామని, ప్రొడ్యూసర్ ప్రభు ఎస్ఆర్, హీరో సూర్యకు సీఎం పంపిన శుభాకాంక్షలు తమ టీమ్లో మరింత ఉత్సాహాన్ని నింపాయని అధికారిక ప్రకటన విడుదల చేశారు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


