నెల రోజులుగా క్రికెట్ లవర్స్ కు అల్లిమేట్ ఎంటర్ టైన్మెంట్ అందించిన టీ20 ప్రపంచకప్ ఎండింగ్ కు వచ్చేసింది. ఇవాళ (మార్చి 8) అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కంటే ముందు టీ20 ప్రపంచకప్ క్లోజింగ్ సెర్మనీని గ్రాండ్ గా నిర్వహించారు.
టీ20 ప్రపంచకప్ క్లోజింగ్ సెర్మనీ
టీ20 ప్రపంచకప్ క్లోజింగ్ సెర్మనీని ఐసీసీ గ్రాండ్ గా నిర్వహించింది. టోర్నీ ముగింపు వేడుకలకు ఇంటర్నేషనల్ టచ్ ఇచ్చింది. మరోవైపు ఇండియన్ సెలబ్రిటీల ప్రదర్శనలు హైలైట్ గా నిలిచాయి. ఇంటర్నేషనల్ స్టార్ రికీ మార్టిన్ షో తెగ వైరల్ గా మారింది. కలర్ ఫుల్ లైట్స్, బాణాసంచా వెలుగులతో స్టేడియం మెరిసిపోయింది.
దాండియా క్వీన్
టీ20 ప్రపంచకప్ క్లోజింగ్ సెర్మనీ దాండియా క్వీన్ గా పేరు తెచ్చుకున్న ఫాల్గుణి పాఠక్ పర్ఫార్మెన్స్ తో స్టార్ట్ అయింది. 50 మంది డ్యాన్సర్లతో కలిసి ఆమె ప్రదర్శన కొనసాగింది. ఫాల్గుణి పాటలకు డ్యాన్సర్ల స్టెప్పులు స్టేడియాన్ని ఊపేశాయి. గుజరాతీ పాపులర్ దాండియా సాంగ్స్ తో ఆమె మైమరిపించింది.
సుఖ్బీర్ సింగ్
పంజాబీ సింగర్ సుఖ్బీర్ సింగ్ ఈ ఈవెంట్ కు మరింత జోష్ తెచ్చాడు. తనదైన స్టైల్లో పంజాబీ సాంగ్స్ తో స్టేడియాన్ని ఉర్రూతలూగించాడు. అతని పాటలకు కూడా పెద్ద ఎత్తున డ్యాన్సర్లు డ్యాన్స్ చేశారు. పంజాబీ సాంగ్స్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఉన్న ఆడియన్స్ పెదవి కలిపారు.
రాక్ స్టార్
చివరగా ఇంటర్నేషనల్ రాక్ స్టార్ రికీ మార్టిన్ పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవల్ గా నిలిచింది. రెండు సార్లు గ్రామీ అవార్డు సొంతం చేసుకున్న మార్టిన్ తన సాంగ్స్ తో గ్రౌండ్ లో ఫైర్ సెట్ చేశాడు. ప్రతి ఆడియన్ ను ఊగిపోయేలా చేశాడు. టీ20 ప్రపంచకప్ క్లోజింగ్ సెర్మనీని మరింత సందడిగా మార్చాడు. ‘చికి బామ్ బామ్’ అంటూ తన సాంగ్స్ తో అదరగొట్టాడు. అయితే ఫస్ట్ టెలికాస్ట్ లో అతని వాయిస్ క్లియర్ గా రాలేదు.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్
{{/usCountry}}చివరగా ఇంటర్నేషనల్ రాక్ స్టార్ రికీ మార్టిన్ పర్ఫార్మెన్స్ నెక్ట్స్ లెవల్ గా నిలిచింది. రెండు సార్లు గ్రామీ అవార్డు సొంతం చేసుకున్న మార్టిన్ తన సాంగ్స్ తో గ్రౌండ్ లో ఫైర్ సెట్ చేశాడు. ప్రతి ఆడియన్ ను ఊగిపోయేలా చేశాడు. టీ20 ప్రపంచకప్ క్లోజింగ్ సెర్మనీని మరింత సందడిగా మార్చాడు. ‘చికి బామ్ బామ్’ అంటూ తన సాంగ్స్ తో అదరగొట్టాడు. అయితే ఫస్ట్ టెలికాస్ట్ లో అతని వాయిస్ క్లియర్ గా రాలేదు.
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్
{{/usCountry}}టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ తలపడుతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగిన ఇండియాపై భారీ అంచనాలున్నాయి. సొంతగడ్డపై ఆడుతున్న భారత్ ఈ ఫైనల్లో గెలిచి, వరుసగా రెండో సారి పొట్టి కప్ దక్కించుకోవాలని కోట్లాది ఇండియన్స్ ఆశిస్తున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియమైనా అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ జరుగుతోంది. ఈ మ్యాచ్ కోసం ఒక లక్షా 20 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయని తెలిసింది. సంజు శాంసన్, బుమ్రా పై భారీ అంచనాలున్నాయి. ఈ ఇద్దరు ఫామ్ కొనసాగించాల్సిన అవసరం ఉంది.