ఒక్క రోజులోనే ఓటీటీ ట్రెండింగ్ నంబర్వన్గా తమిళ థ్రిల్లర్- అదిరే ట్విస్ట్- తెలుగులోనూ స్ట్రీమింగ్- ఓ లుక్కేయండి
ఓటీటీలోకి వచ్చిన ఒక్క రోజులోనే తమిళ థ్రిల్లర్ మూవీ ట్రెండింగ్ నంబర్ వన్ ప్లేస్ లోకి దూసుకొచ్చింది. ఓటీటీలో ఈ మూవీకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను మీరు చూశారా?
తమిళ థ్రిల్లర్ మూవీ ‘డీజిల్’ ఓటీటీలో అదరగొడుతోంది. డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన ఒక్క రోజులోనే ఈ సినిమా ఇండియాలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. డీజిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోంది. ఈ చిత్రం తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
ఓటీటీ ట్రెండింగ్ లో తమిళ థ్రిల్లర్
డీజిల్ ఓటీటీ
తమిళ యాక్షన్ థ్రిల్లర్ డీజిల్ మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. థియేటర్లలో మంచి రెస్పాన్స్ దక్కించుకున్న ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ సత్తాచాటుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 21న అడుగుపెట్టింది ఈ మూవీ. ఒక్క రోజులోనే ఇండియాలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది డీజిల్ చిత్రం.
తెలుగులోనూ
తమిళ మూవీ డీజిల్ తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. అంతే కాకుండా ఈ మూవీ ఒకే రోజు నాలుగు ఓటీటీల్లో రిలీజ్ కావడం విశేషం. అమెజాన్ ప్రైమ్ వీడియోతో పాటు సన్ నెక్ట్స్, సింప్లీ సౌత్, ఆహా తమిళ్ ఓటీటీల్లో ఈ మూవీ అందుబాటులో ఉంది. ఇప్పుడు ప్రైమ్ వీడియోలో డీజిల్ సినిమా ఇండియాలో నంబర్ వన్ గా ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో హరీష్ కల్యాణ్, అతుల్యా రవి, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించారు.
డీజిల్ కథ ఏమిటంటే?
చేపలు పట్టే తమ పనికి అడ్డంకిగా మారిన చమురు పైప్ లైన్ నే ఉపాధిగా మార్చుకునే గ్రామాల్లోని ప్రజల కథ డీజిల్. చెన్నై సముద్ర తీరంలో డీజిల్ మూవీ స్టోరీ స్టార్ట్ అవుతుంది. 1979లో సముద్ర తీరంలో 17 కిలోమీటర్ల మేర ప్రభుత్వం ఒక పైప్ లైన్ ఏర్పాటు చేస్తుంది. సముద్రంలోని క్రూడ్ ఆయిల్ ను సరఫరా చేసే పైప్ లైన్ ఇది. అయితే ఈ పైప్ లైన్ కారణంగా జాలరులు చేపలు పట్టేందుకు సముద్రంలోకి వెళ్లలేని పరిస్థితి తలెత్తుతుంది.
క్రూడ్ ఆయిల్ దొంగతనం
క్రూడ్ ఆయిల్ పైప్ లైన్ కారణంగా చేపలు పట్టడానికి ఛాన్స్ లేకుండా పోయిందని ప్రజలు పోరాడతాడు. ఈ పోరాటంలోనే ఢిల్లీ బాబు ప్రాణాలు కోల్పోతాడు. అతని కొడుకు వాసుదేవ (హరీష్ కల్యాణ్) అనాథ అవుతాడు. అతణ్ని మనోహర్ (సాయి కుమార్) చేరదీస్తాడు. క్రూడ్ ఆయిల్ ను దొంగతనం చేసి, ముంబయిలోని గ్యాంగ్ కు అమ్మాలని మనోహర్ నిర్ణయం తీసుకుంటాడు.
ఈ ఆయిల్ దొంగతనంతో గ్రామాలను ఆదుకుంటాడు మనోహర్. వాసుదేవ కూడా ఇదే పని చేస్తూ డీజిల్ వాసుగా పేరు తెచ్చుకుంటాడు. కానీ ఆ తర్వాతే ఓ ట్విస్ట్ కథను మలుపు తిప్పుతుంది. విలన్ అత్యాశను హీరో ఎలా తిప్పికొట్టాడు? తన ప్రజలను ఎలా ఎదుర్కొన్నాడన్నది మిగతా కథ.