Telugu Web Series: నాన్సెన్స్ కామెడీ.. కొడుకునే ప్రేమించమని వెంటపడే తండ్రి.. ఫన్నీగా తెలుగు కామెడీ వెబ్ సిరీస్ టీజర్

Telugu Web Series: తెలుగు కామెడీ వెబ్ సిరీస్ లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ టీజర్ రిలీజైంది. సెప్టెంబర్ 30 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఈ సిరీస్ లో హర్ష చెముడు లీడ్ రోల్లో నటిస్తున్నాడు. నాన్సెన్స్ కామెడీ అంటూ ఈ సిరీస్ టీజర్లోనే చెప్పడం విశేషం.

Published on: Sep 15, 2026, 19:02:15 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telugu Web Series: తెలుగులో మరో ఫన్నీ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది. ఈ మధ్య ఒరిజినల్ కంటెంట్ తో స్పీడు పెంచుతున్న ఈటీవీ విన్ ఓటీటీయే ఈ సరికొత్త సిరీస్ ను తీసుకురాబోతోంది. స్టార్ కమెడియన్ హర్ష చెముడుతో లీస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ అనే ఈ సిరీస్ ను నిర్మించగా.. ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు. ప్రముఖ టాలీవుడ్ నటుడు శ్రీవిష్ణు ఈ టీజర్ ను లాంచ్ చేశారు. రొమాన్స్, కామెడీ, ఎంటర్టైన్మెంట్ ను మిక్స్ చేసి ఈ టీజర్ తీసుకొచ్చారు.

Telugu Web Series: నాన్సెన్స్ కామెడీ.. కొడుకునే ప్రేమించమని వెంటపడే తండ్రి.. ఫన్నీగా తెలుగు కామెడీ వెబ్ సిరీస్ టీజర్
Telugu Web Series: నాన్సెన్స్ కామెడీ.. కొడుకునే ప్రేమించమని వెంటపడే తండ్రి.. ఫన్నీగా తెలుగు కామెడీ వెబ్ సిరీస్ టీజర్

లీస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ టీజర్

తాజాగా విడుదలైన 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' టీజర్ మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌గా అనిపిస్తోంది. బ్యాచిలర్ లైఫ్‌లో ఎదురయ్యే వింత పరిస్థితులు, ఆఫీస్ వర్క్ ప్రెజర్, సహోద్యోగుల మధ్య ఉండే చిన్న చిన్న గొడవలు, ఫన్నీ సీన్లతో ఈ టీజర్‌ను చాలా కలర్‌ఫుల్‌గా కట్ చేశారు.

"బ్యాచిలర్ లైఫ్.. ఆఫీస్ డ్రామా.. అన్‌లిమిటెడ్ మ్యాడ్‌నెస్" అనే క్యాప్షన్‌తో వచ్చిన ఈ టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. పెళ్లి కోసం తంటాలు పడే కొడుకు, ఓ అమ్మాయిని ప్రేమించమని వెంటపడే తండ్రి చుట్టూ తిరిగే సిరీస్ ఇది. నాన్సెన్స్ కామెడీ అంటూ టీజర్ లోనే మేకర్స్ అనౌన్స్ చేయడం విశేషం.

ఈ టీజర్ లో హర్ష చెముడు తన టైమింగ్ తో అదరగొట్టగా.. తన మార్క్ కామెడీతో జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది కూడా అలరించాడు. ఈ టీజర్ చూస్తుంటే అన్‌లిమిటెడ్ ఫన్ గ్యారెంటీ అని అర్థమవుతోంది.

సెప్టెంబర్ 30 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్

ఈ కామెడీ వెబ్ సిరీస్ ఎప్పుడు స్ట్రీమింగ్ కానుందో కూడా ఈటీవీ విన్ మేకర్స్ క్లారిటీ ఇచ్చేశారు. సెప్టెంబర్ 30 నుంచి 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సిరీస్ కేవలం ఈటీవీ విన్ ప్లాట్‌ఫామ్‌లోనే ఎక్స్‌క్లూజివ్‌గా అందుబాటులోకి రానుంది. నెల ఆఖరిలో ఓటీటీ ఆడియన్స్‌కు మంచి వినోదాన్ని పంచేందుకు ఈ షో సిద్ధమవుతోంది. నిజానికి సెప్టెంబర్ 18 నుంచే అని ముందు చెప్పినా ఇప్పుడు వాయిదా వేశారు.

యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తూ డిఫరెంట్ కాన్సెప్టులతో సినిమాలు, సిరీస్‌లు అందిస్తున్న ఈటీవీ విన్.. ఈ సిరీస్‌తో కూడా మంచి సక్సెస్ సాధిస్తుందని నమ్మకంగా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్, క్వాలిటీ మేకింగ్ ఈ సిరీస్‌కు ప్రధాన బలంగా నిలవనున్నాయి.

రూట్ మార్చిన ఈటీవీ విన్.. యూత్‌ను టార్గెట్ చేస్తూ వరుస సిరీస్‌లు

ఇటీవలి కాలంలో తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ మధ్య పోటీ విపరీతంగా పెరిగింది. ఈ రేసులో ఈటీవీ విన్ ప్రత్యేకమైన రూట్ ఎంచుకుంది. రొటీన్ ఫ్యామిలీ డ్రామాలకే పరిమితం కాకుండా నేటి తరం ఆలోచనలకు తగ్గట్లుగా యూత్‌ఫుల్ కామెడీ కంటెంట్ అందిస్తోంది.

గతంలో వచ్చిన '#90s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్', 'ఆల్ ఇండియా ర్యాంకర్స్' వంటి డిజిటల్ ప్రొడక్షన్స్ మంచి ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. అదే తరహాలో బ్యాచిలర్స్ కథతో రాబోతున్న ఈ 'లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' కూడా డిజిటల్ ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో అలరిస్తుందో చూడాలి.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More