ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో 'ధురంధర్' నామస్మరణ మారుమోగిపోతోంది. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా సాధించిన అసాధారణ విజయంపై టాలీవుడ్ ప్రముఖ రచయిత, దర్శకుడు, ప్రొడ్యూసర్, నటుడు బీవీఎస్ రవి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
బీవీఎస్ రవి కామెంట్లు

ధురంధర్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టాయి. ధురంధర్ 1, ధురంధర్ 2 కలెక్షన్ల రికార్డులు బ్రేక్ చేశాయి. ఈ మూవీస్ సక్సెస్ పై బీవీఎస్ రవి స్పందించాడు. ధురంధర్ మేకింగ్ స్టైల్ చూస్తుంటే, పాతకాలపు పద్ధతుల్లో సినిమాలు తీసే తెలుగు నిర్మాతలకు ఇది ముగింపునకు ఆరంభం అని రవి పేర్కొన్నాడు.
ఆదిత్య ధర్ విజన్ కు హ్యాట్సాఫ్
ఒక ఇంటర్వ్యూలో బీవీఎస్ రవి మాట్లాడుతూ, ధురంధర్ దర్శకుడు ఆదిత్య ధర్ తన విజన్ తో అందరినీ ఎలా ఒప్పించగలిగారనే అంశంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. "ధురంధర్ సినిమాలను చూడండి.. ఆదిత్య దాదాపు 8 గంటల నిడివి గల కథను (రెండు భాగాలుగా) అద్భుతంగా తెరకెక్కించారు. దీని కోసం ఆయన ఎంతటి పరిశోధన చేసి ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ప్రతి సన్నివేశాన్ని లాజికల్గా మలిచారు.
అంతమంది నటీనటులు, సాంకేతిక నిపుణులు ఆయన విజన్ను నమ్మడం, అంత భారీ బడ్జెట్ పెట్టేలా నిర్మాతలను ఒప్పించడం సామాన్యమైన విషయం కాదు" అని రవి కొనియాడాడు.
రూ.260 కోట్లతోనే
తెలుగు చిత్ర పరిశ్రమలో బడ్జెట్ ఖర్చు చేసే విధానంపై బీవీఎస్ రవి ఘాటైన విమర్శలు చేశాడు. "సృజనాత్మకతను పక్కన పెడితే, రెగ్యులర్ నిర్మాతలకు ధురంధర్ సినిమాలు ఒక హెచ్చరిక. రణ్వీర్ సింగ్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా వంటి భారీ తారాగణం.. విదేశాల్లో భారీ సెట్లు, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నప్పటికీ, ఈ రెండు భాగాలను కలిపి కేవలం రూ. 260 కోట్ల బడ్జెట్తోనే పూర్తి చేశారు’’ అని రవి అన్నాడు.
టాలీవుడ్ బడ్జెట్
టాలీవుడ్ సినిమాల బడ్జెట్ పైనా బీవీఎస్ రవి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘మన దగ్గర చిన్న సినిమాలకే బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. మనం కనీసం రూ. 500 కోట్ల బడ్జెట్ లేనిదే సినిమా మొదలుపెట్టలేని స్థితిలో ఉన్నాం" అని రవి పేర్కొన్నాడు.
{{/usCountry}}టాలీవుడ్ సినిమాల బడ్జెట్ పైనా బీవీఎస్ రవి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘మన దగ్గర చిన్న సినిమాలకే బడ్జెట్లు పెరిగిపోతున్నాయి. మనం కనీసం రూ. 500 కోట్ల బడ్జెట్ లేనిదే సినిమా మొదలుపెట్టలేని స్థితిలో ఉన్నాం" అని రవి పేర్కొన్నాడు.
{{/usCountry}}సినిమా ఖర్చులు పెరగడానికి హీరోల రెమ్యునరేషన్లే కారణమా? అని ప్రశ్నించగా.. రవి దాన్ని తోసిపుచ్చారు. అసలు లోపం నిర్మాత ప్రణాళికలో ఉందన్నారు. షూటింగ్ మొదలవ్వక ముందే పక్కా ప్లానింగ్ లేకపోవడం వల్లే తెలుగు సినిమాల వ్యయం అనవసరంగా పెరుగుతోందని ఆయన విశ్లేషించాడు.