టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 370కి పైగా సినిమాలు చేసిన న‌టుడి మృతి.. నెల‌ కింద‌టే కుమారుడి మ‌ర‌ణం

టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. 370కు పైగా సినిమాలు చేసిన తెలుగు సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి కన్నుమూశారు. నెలల కిందటే ఆయన కుమారుడు మరణిించారు. అదే బెంగతో రఘునాథ్ రెడ్డికి గుండెపోటు వచ్చినట్లు తెలిసింది. 

Published on: Feb 01, 2026 4:24 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సీనియర్ నటుడు రాఘునాథ్ రెడ్డి మరణంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. 370కి పైగా సినిమాల్లో నటించిన ఆయన తుదిశ్వాస విడిచారు. గుండె పోటుతో మరణించారు. నెల క్రితమే ఆయన కుమారుడు కన్నుమూశారు. ఆ బెంగతోనే కుమిలిపోతున్న రఘునాథ్ రెడ్డి ఈ రోజు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

కన్నుమూసిన రఘునాథ్ రెడ్డి
కన్నుమూసిన రఘునాథ్ రెడ్డి

రఘనాథ్ రెడ్డి మరణం

ఎన్నో సినిమాల్లో తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నారు రఘునాథ్ రెడ్డి. సూపర్ హిట్ మూవీస్ లో నటించారు. విలన్ గానూ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేశారు. సీరియల్స్ లోనూ నటుడిగా తనదైన ముద్ర వేశారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, భోజ్ పురి భాషల సినిమాల్లోనూ ఆయన నటించారు. అలాంటి సీనియర్ నటుడు రఘునాథ్ రెడ్డి సడెన్ గా మరణించడంతో టాలీవుడ్ షాక్ అవుతోంది.

శోభన్ బాబు సినిమాతో

శోభన్ బాబు హీరోగా నటించిన సర్పయాగం సినిమాతో నటుడిగా రఘునాథ్ రెడ్డి అడుగు పడింది. ఈ చిత్రానికి పరిచూరి బ్రదర్స్ డైరెక్టర్స్. ఇది 1991లో రిలీజైంది. ఆ తర్వాత రఘునాథ్ రెడ్డి వెనుదిరిగి చూసుకోలేదు. వరుసగా సినిమాలు చేస్తూ సాగిపోయారు.

శీను, పెళ్లి పందిరి, స్వయంవరం, రాజకుమారుడు, దేవిపుత్రుడు, కలెక్టర్ గారు, ఒసేయ్ రాములమ్మ, కలిసుందాం రా, ఒరేయ్ రిక్షా, ఇంద్ర, డాన్, తమ్ముడు, మల్లీశ్వరి, శ్రీరామ రాజ్యం లాంటి అనేక సినిమాల్లో నటించారు రఘునాథ్ రెడ్డి. నాన్న, గోమాత లాంటి సీరియల్స్ లో కనిపించారు.

తండ్రి క్యారెక్టర్లు

రఘునాథ్ రెడ్డి టాలీవుడ్ లో తండ్రి క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచారు. హీరోలకు, హీరోయిన్లకు తండ్రి పాత్రల్లో అద్భుతమైన నటన ప్రదర్శించారు. ఇక విలన్ గానూ తన నట విశ్వరూపాన్ని చూపించారు. ఆయన చివరగా 2018లో వచ్చిన సుబ్రహ్మణ్యపురం అనే సినిమాలో కనిపించారు. అనారోగ్యం కారణంగా అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉన్నారు.

కన్న కొడుకు

రఘునాథ్ రెడ్డి కుమారుడు నెల రోజుల క్రితం మరణించారు. అప్పటి నుంచి కొడుకునే తలుచుకుంటూ రఘునాథ్ రెడ్డి కుమిలిపోయారు. ఇప్పుడు అదే ఆవేదనతో గుండెపోటు వచ్చి మరణించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లోని కుషాయిగూడలో ఉన్న తన సొంత ఇంట్లో రఘునాథ్ రెడ్డి కన్నుమూసినట్లు సమాచారం.

ప్రస్తుతం కుషాయిగూడలో రఘునాథ రెడ్డి పార్థివ దేహం ఉంది. సినిమా, సీరియల్ నటులు వచ్చి ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పిస్తున్నారు. రఘునాథ రెడ్డి మరణం టాలీవుడ్ కు తీరని లోటు అని తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.