OTT: ఓటీటీ ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న ధురంధ‌ర్‌- ఇది చెడు సినిమా- విద్వేషం, హింస డీఎన్ఏలోనే ఉంద‌ని లేడీ డైరెక్టర్ ఫైర్

బాలీవుడ్ స్పై థ్రిల్లర్ ధురంధర్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఇప్పుడు ఓటీటీలోనూ ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతోంది. కానీ ఇది చెడు సినిమా అని.. విద్వేషం, హింస దీని డీఎన్ఏలోనే ఉందని లేడీ డైరెక్టర్ షాజియా ఇక్బాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

Published on: Feb 01, 2026 2:10 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ధురంధర్.. 2025 డిసెంబర్ 5న రిలీజైన ఈ మూవీ సెన్సేషనల్ గా మారింది. బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కలెక్షన్ల రికార్డులు బ్రేక్ చేసింది. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ లోనూ అదరగొడుతోంది. ఇండియా నంబర్ వన్ మూవీగా ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ధురంధర్ పై లేడీ డైరెక్టర్ షాజియా ఇక్బాల్ ఫైర్ అవడం హాట్ టాపిక్ గా మారింది.

ధురంధర్ పై లేడీ డైరెక్టర్ ఫైర్
ధురంధర్ పై లేడీ డైరెక్టర్ ఫైర్

ధురంధర్ పై ఫైర్

ధడక్ 2 మూవీ డైరెక్టర్ షాజియా ఇక్బాల్ ధురంధర్ మూవీపై ఫైర్ అయ్యారు. తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆదివారం (ఫిబ్రవరి 1) తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీల్లో ఈ చిత్రాన్ని విమర్శించారు.

ధురంధర్ టైటిల్ ట్రాక్ ను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గా సెట్ చేసిన షాజియా.. "ఎంత చెడు సినిమా! ఈ మూవీ దాక్కోలేదు. అలాగే ఇది అనుకోకుండా తీసింది కాదు. విద్వేషాన్ని ప్రేరేపించడం, హింస ఈ సినిమా డీఎన్ఏలోనే ఉంది’’ అని షాజియా ఫైర్ అయ్యారు.

షాజియా ఇన్ స్టాగ్రామ్ స్టోరీ
షాజియా ఇన్ స్టాగ్రామ్ స్టోరీ

మైనారిటీల పట్ల

మైనారిటీ వర్గాలపై ధురంధర్ లాంటి సినిమాల ప్రభావం పట్ల ఇండస్ట్రీలో ఉదాసీనత ఉందని ముస్లిం డైరెక్టర్ అయిన షాజియా ఇక్బాల్ ఆరోపించారు. "కానీ ఇది చాలా బాగా తీర్చిదిద్దిన సినిమా. బీజీఎం కూల్ గా ఉంది. ఇండస్ట్రీ డ్యూడ్ బ్రోస్ వెల్ డన్. మీలో చాలా మంది మైనారిటీల గురించి పట్టించుకోకపోవడం అనే ఉదాసీనతను దాచినందుకు సంతోషంగా ఉంది "అని ఆమె వెటకారంగా మరో స్టోరీలో పోస్టు చేశారు.

షాజియా స్టోరీ
షాజియా స్టోరీ

ధురంధర్ ఓటీటీ

బాక్సాషీస్ దగ్గర సంచలన ప్రదర్శన తర్వాత రణ్ వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ధురంధర్ ఓటీటీలోకి వచ్చింది. జనవరి 30 నుంచి ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియాలోనే నంబర్ వన్ ఓటీటీ మూవీగా ధురంధర్ ట్రెండింగ్ లో ఉందని నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. ఇది ఓటీటీలో తెలుగులోనూ అందుబాటులో ఉంది. దీనికి ఆదిత్య ధర్ డైరెక్టర్.

ధురంధర్ గురించి

ధురంధర్ మూవీ ఒక స్పై థ్రిల్లర్. ఇందులో రణ్ వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, సంజయ్ దత్ తదితరులు నటించారు. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.1,300 కోట్లకు పైగా వసూలు చేసింది. దీని సీక్వెల్ ధురంధర్ 2 మూవీ మార్చి 19న థియేటర్లలో రిలీజ్ కానుంది.