మళ్లీ పడిపోయిన తేరే ఇష్క్ మే కలెక్షన్స్- అతి తక్కువగా- ధనుష్, కృతి సనన్ల అమర కావ్యం 8 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్ ఇదే!
తేరే ఇష్క్ మే బాక్సాఫీస్ కలెక్షన్స్ డే 8: ధనుష్, కృతి సనన్ నటించిన లేటేస్ట్ రొమాంటిక్ ఎమోషనల్ థ్రిల్లర్ చిత్రం తేరే ఇష్క్ మే బాక్సాఫీస్ వద్ద జోరు చూపిస్తోంది. తెలుగులో అమర కావ్యం అనే టైటిల్తో విడుదలైన ఆ సినిమా కలెక్షన్స్ మరోసారి పడిపోయాయి. ఈ క్రమంలో తేరే ఇష్క్ మే 8 రోజుల కలెక్షన్స్ ఎంతో చూద్దాం.
తమిళ అగ్ర హీరో ధనుష్, బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ తొలిసారి జోడీ కట్టి నటించిన లేటెస్ట్ రొమాంటిక్ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ తేరే ఇష్క్ మే. నవంబర్ 28న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను తెలుగులో అమర కావ్యం అనే టైటిల్తో రిలీజ్ చేశారు.
మళ్లీ పడిపోయిన తేరే ఇష్క్ మే కలెక్షన్స్- అతి తక్కువగా- ధనుష్, కృతి సనన్ల అమర కావ్యం 8 రోజుల బాక్సాఫీస్ రిపోర్ట్ ఇదే!
తగ్గిపోయిన కలెక్షన్స్
విడుదలైన తొలి రోజు నుంచి కలెక్షన్స్లలో జోరు చూపించిన తేరే ఇష్క్ మే సినిమా మరోసారి వెనుకంజ వేసింది. అంటే మళ్లీ బాక్సాఫీస్ వద్ద తేరే ఇష్క్ మే కలెక్షన్స్ తగ్గిపోయాయి. విడుదలైన తొలి 7 రోజుల్లో భారతదేశంలో తేరే ఇష్క్ మే రూ. 83.65 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టింది ఈ సినిమా.
హిందీ నుంచే ఎక్కువగా
ఈ వారం రోజుల తేరే ఇష్క్ మే కలెక్షన్స్లలో హిందీ నుంచి రూ. 79.75 కోట్ల కలెక్షన్స్ ఉంటే తమిళం ద్వారా మాత్రం రూ. 3.9 కోట్ల వసూళ్లు ఉన్నాయి. అంటే ధనుష్ సొంత సినీ ఇండస్ట్రీ తమిళం నుంచి కంటే హిందీ బెల్డ్ ద్వారానే అధిక కలెక్షన్స్ వసూలు అయ్యాయి.
ఏడో రోజుతో పోలిస్తే
ఇదిలా ఉంటే, తేరే ఇష్క్ మే సినిమాకు 8వ రోజు (డిసెంబర్ 5) శుక్రవారం నాడు కాస్తా కలెక్షన్స్ తగ్గాయి. 8వ రోజున అమర కావ్యం సినిమాకు ఇండియాలో రూ. 3.7 కోట్ల నెట్ కలెక్షన్స్ మాత్రమే వసూలు అయ్యాయి. అంటే, ఏడో రోజుతో పోలిస్తే 8వ రోజున సుమారుగా 36.21 శాతం వసూళ్లు పడిపోయాయి.
తమిళంలో 2 లక్షలు మాత్రమే
అలాగే, విడుదలైన 8 రోజుల్లో అధికంగా వసూళ్లు పడిపోయి అతి తక్కువగా కలెక్షన్స్ నమోదు అయ్యాయి. 8 రోజుల్లో ఈరోజే అమర కావ్యం అతి తక్కువగా కలెక్షన్స్ వసూలు చేసింది. ఇక ఈ కలెక్షన్స్లో హిందీ నుంచి 3.5 కోట్ల నెట్ రాగా తమిళం ద్వారా 2 లక్షల కలెక్షన్స్ మాత్రమే వసూలు అయ్యాయి.
తేరే ఇష్క్ మే థియేటర్ ఆక్యుపెన్సీ
ఇక 8 రోజుల్లో ఇండియాలో ఓవరాల్గా తేరే ఇష్క్ మే సినిమాకు రూ. 87.35 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే, డిసెంబర్ 5న హిందీలో తేరే ఇష్క్ మే సినిమాకు ఓవరాల్గా 18.44 శాతం థియేటర్ ఆక్యుపెన్సీ నమోదు అయింది.
ఇద్దరి కాంబినేషన్లో
ఇదిలా ఉంటే, తేరే ఇష్క్ మే సినిమాకు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహించారు. ధనుష్-ఆనంద్ ఎల్ రాయ్ కాంబినేషన్లో ఇప్పటికీ రాంఝనా, ఆత్రంగి రే సినిమాలు వచ్చాయి. ఈ రెండు కూడా మంచి రొమాంటిక్ మ్యూజికల్ హిట్ ఫిల్మ్స్గా పేరు తెచ్చుకున్నాయి. ఇప్పుడు వచ్చిన తేరే ఇష్క్ మే కూడా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటోంది.