...
...
Next Story

నా కొడుకు ఎంజీఆర్ లాగా- సినిమాలు చేసి చాలా డబ్బు సంపాాదించగలడు-కానీ ప్రజల కోసమే ఈ నిర్ణయం: దళపతి విజయ్ తండ్రి వ్యాఖ్యలు

ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో దళపతి విజయ్ తండ్రి, సినీ నిర్మాత ఎస్.ఏ. చంద్రశేఖర్ తన తనయుడి నటన, రాజకీయ ప్రస్థానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏమన్నారంటే...

Published on: Dec 16, 2025, 05:55:25 IST
Advertisement

నటుడు, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత దళపతి విజయ్ గురించి అతని తండ్రి, సినీ నిర్మాత ఎస్.ఏ. చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తనయుడి సినీ, రాజకీయ జీవితంపై మాట్లాడారు. సామాజిక స్పృహతో కూడిన చిత్రాల్లో నటించడం కొడుకు కెరీర్ మార్పునకు కారణమని ఆయన పేర్కొన్నారు.

విజయ్ తండ్రి కామెంట్లు

విజయ్ తో తండ్రి చంద్రశేఖర్
విజయ్ తో తండ్రి చంద్రశేఖర్

చెన్నైలో బిహైండ్‌వుడ్స్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో చంద్రశేఖర్ మాట్లాడుతూ, నటనకే పరిమితమై ఉంటే తన కుమారుడు ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించగలిగేవాడని అన్నారు. చంద్రశేఖర్ తన కుమారుడు దళపతి విజయ్ గురించి మాట్లాడటం ప్రారంభించగానే, ప్రేక్షకుల కేరింతలు ఎంతగా పెరిగాయంటే వారిని శాంతపరచడానికి కొంత సమయం ఇవ్వాల్సి వచ్చింది.

ప్రజలకు సేవ

‘‘మా అబ్బాయి విజయ్ - సాధారణంగా జీవితంలో డబ్బు మాత్రమే ఉందని నమ్మేవాడు కాదు. అలా అనుకుంటే అతను సులభంగా నటించి, చాలా డబ్బు సంపాదించగలడు. నేను మీ టీవీకే నాయకుడి గురించి మాట్లాడుతున్నాను. కానీ, బదులుగా తమిళనాడు ప్రజలకు సేవ చేయాలనేది అతని ఏకైక కోరిక. అతని మనసులో ఈ ఆలోచనకు అనేక కారణాలు ఉండవచ్చు’’ అని చంద్రశేఖర్ అన్నాడు.

ఎంజీఆర్ తో పోల్చుతూ

తన కొడుకు దళపతి విజయ్ ను దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి మరుదూరు గోపాలన్ రామచంద్రన్ (MGR) తో పోల్చారు చంద్రశేఖర్. వారు ఇద్దరూ తాము నటించిన సినిమాల వల్ల ప్రభావితమై ఉండవచ్చని పేర్కొన్నారు. 'అతను (విజయ్) నటించిన కొన్ని సినిమాలు కూడా కారణం కావచ్చు. అవి నటుడి హృదయంలో విత్తనాలు నాటాయి. ఎంజీఆర్ అలాంటి సినిమాల్లో నటించి నాయకుడయ్యాడు. అదేవిధంగా ఈ తరంలో విజయ్ తనలో సామాజిక స్పృహను నింపిన అనేక చిత్రాలు చేశాడు’’ అని చంద్రశేఖర్ తెలిపారు.

మురుగుదాస్ కు క్రెడిట్

వెంకట్ ప్రభు దర్శకత్వంలో 2024లో వచ్చిన 'ది GOAT' చిత్రంలో చివరిసారిగా కనిపించాడు విజయ్. తమిళనాడు ఎన్నికలలో పోటీ చేయడానికి సినిమాలకు గుడ్ బై చెబుతున్నాడు. అతని చివరి చిత్రం.. హెచ్. వినోత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘జన నాయగన్’. జనవరి 9, 2026న పొంగల్ సందర్భంగా థియేటర్లలో విడుదల కానుంది.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe