తమిళ సూపర్ స్టార్, రాజకీయ నాయకుడు విజయ్ దళపతి తన చివరి సినిమాగా ప్రచారంలో ఉన్న 'జన నాయగన్' (Jana Nayagan) ఆడియో లాంచ్లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. మలేషియా వేదికగా జరిగిన ఈ ఈవెంట్లో లక్ష మంది అభిమానుల మధ్య మాట్లాడుతూ.. "నాకు కోట (అధికారం) ఇచ్చిన అభిమానుల కోసం సినిమాను వదిలేస్తున్నా" అని ఎమోషనల్ అయ్యాడు.
దళపతి విజయ్ స్పీచ్ వైరల్

శనివారం (డిసెంబర్ 27) మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగిన 'జన నాయగన్' ఆడియో లాంచ్ ఒక చరిత్ర సృష్టించింది. బుకిత్ జలీల్ స్టేడియంలో జరిగిన ఈ వేడుకకు ఏకంగా ఒక లక్ష మంది హాజరయ్యారు. ఇది 'మలేషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో కూడా ఎక్కింది. రాజకీయాల్లోకి వెళ్తున్న విజయ్, తన ఫ్యాన్స్ నుద్దేశించి మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
"నేను సినిమాలోకి వచ్చినప్పుడు ఇక్కడొక చిన్న ఇసుక గూడు కట్టుకుంటున్నా అనుకున్నా. కానీ మీరందరూ కలిసి నాకోసం ఒక రాజభవనాన్ని కట్టారు. అభిమానులు నాకోసం ఒక 'కోట'ను (Kottai) నిర్మించారు. నాకోసం సర్వస్వం ఇచ్చిన అభిమానుల కోసం నేను నిలబడాలని నిర్ణయించుకున్నా. అందుకే మీకోసం నేను సినిమాను వదిలేస్తున్నా" అని విజయ్ అన్నాడు. తమిళనాడులో 'కొట్టై' అంటే అసెంబ్లీ/సెక్రటేరియట్ అని అర్థం.
"బలమైన శత్రువు ఉండాలి.."
రాజకీయ ప్రత్యర్థులకు పరోక్షంగా వార్నింగ్ ఇస్తూ విజయ్ ఇలా అన్నాడు. "జీవితంలో గెలవాలంటే స్నేహితులు అవసరం లేదేమో కానీ.. ఒక బలమైన శత్రువు కచ్చితంగా ఉండాలి. అప్పుడే మనం ఇంకా బలంగా మారుతాం. కాబట్టి, 2026లో చరిత్ర పునరావృతం అవుతుంది. ప్రజల కోసం మనం సిద్ధంగా ఉందాం" అని విజయ్ అన్నాడు.
కన్నీళ్లు పెట్టుకున్న నాజర్
సీనియర్ నటుడు నాజర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. విజయ్ సూపర్ హిట్ డైలాగ్ “ఒక్కసారి డిసైడ్ అయితే..”ని గుర్తు చేస్తూ.. "నువ్వు అనుకున్న మాటకు కట్టుబడి ఉంటావని తెలుసు.. కానీ ఈ ఒక్కసారి మాత్రం నీ నిర్ణయాన్ని మార్చుకో. రిటైర్మెంట్ గురించి మళ్ళీ ఆలోచించు" అని నాజర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
సంక్రాంతికి అసలైన యుద్ధం
{{/usCountry}}సీనియర్ నటుడు నాజర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. విజయ్ సూపర్ హిట్ డైలాగ్ “ఒక్కసారి డిసైడ్ అయితే..”ని గుర్తు చేస్తూ.. "నువ్వు అనుకున్న మాటకు కట్టుబడి ఉంటావని తెలుసు.. కానీ ఈ ఒక్కసారి మాత్రం నీ నిర్ణయాన్ని మార్చుకో. రిటైర్మెంట్ గురించి మళ్ళీ ఆలోచించు" అని నాజర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
సంక్రాంతికి అసలైన యుద్ధం
{{/usCountry}}విజయ్ నటించిన జన నాయగన్ మూవీ జనవరి 9న సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. దీనికి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఉండబోతోంది. ప్రభాస్ సినిమా 'ది రాజా సాబ్' (The Raja Saab), శివకార్తికేయన్ సినిమా 'పరాశక్తి' కూడా అదే సమయంలో రిలీజ్ అవుతున్నాయి.
ఈ ఆడియో లాంచ్ ఈవెంట్ జనవరి 4, 2026న జీ తమిళ్లో ప్రసారం కానుంది. హీరోయిన్ పూజా హెగ్డే, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, డైరెక్టర్లు అట్లీ, నెల్సన్, లోకేష్ కనగరాజ్ ఈ ఈవెంట్లో సందడి చేశారు.