Gayapadda Simham: భయపడ్డ సింహాన్ని కాదు.. థాయ్లాండ్లో తరుణ్ భాస్కర్.. ప్రీ రిలీజ్ ఈవెంట్లో వీడియో కాల్
Gayapadda Simham: తరుణ్ భాస్కర్ అప్ కమింగ్ కామెడీ ఫిల్మ్ ‘గాయపడ్డ సింహం’. ఈ సినిమా మే 1న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తరుణ్ భాస్కర్ అటెండ్ కాలేదు. కానీ వీడియో కాల్ లో అందరినీ పలకరించాడు. అసలు ఏమైందో ఇక్కడ చూడండి.
Gayapadda Simham: ఓ వైపు యాక్టింగ్, మరోవైపు డైరెక్షన్ తో దూసుకెళ్తున్నాడు తరుణ్ భాస్కర్. అతను హీరోగా నటించిన అప్ కమింగ్ మూవీ ‘గాయపడ్డ సింహం’. ఈ చిత్రం మే 1న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. కానీ ఈ ఈవెంట్ కు తరుణ్ భాస్కర్ అటెండ్ కాలేదు.
గాయపడ్డ సింహం ప్రీ రిలీజ్ ఈవెంట్
గాయపడ్డ సింహం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హీరో తరుణ్ భాస్కర్ అటెండ్ కాలేకపోయాడు. అతను థాయ్లాండ్లో ఉన్నాడు. ఈ విషయాన్ని వీడియో కాల్ తో తరుణ్ భాస్కర్ స్పష్టం చేశాడు. ప్రీ రిలీజ్ ఈవెంట్లో తరుణ్ భాస్కర్ వాళ్ల అమ్మ ఫోన్ నుంచి తరుణ్ భాస్కర్ వీడియో కాల్ లో మాట్లాడాడు.
ఇండియా వీసా దొరకలేదని
గాయపడ్డ సింహం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎందుకు రాలేదని యాంకర్ సుమ అడిగితే.. ఇండియా వీసా దొరకడం లేదని తరుణ్ భాస్కర్ చెప్పాడు. మరి అమ్మ కూడా ఇక్కడే ఉంది, పప్పన్నం ఎప్పుడు పెడుతున్నావని సుమ అడిగేసింది. నాకు రోజూ పెడతారు అని తరుణ్ భాస్కర్ తప్పించుకున్నాడు. ఈవెంట్ కు మిస్ అవకుండా ఉండాల్సిందని అతను అన్నాడు.
భయపడ్డ సింహాన్ని
తరుణ్ భాస్కర్ లైవ్ లో ఉండగానే కమెడియన్ జీవన్ తో సుమ పాట పాడించింది. ‘‘నేను గాయపడ్డ సింహాన్ని.. భయపడ్డ సింహాన్ని కాదు’’ అని తరుణ్ భాస్కర్ కౌంటర్ వేస్తాడు. ‘‘నువ్వు రాకపోవడంతో మేం బాధపడ్డ సింహాలమయ్యాం’’ అని సుమ ఫన్నీగా చెప్తుంది. ఈ వీడియో వైరల్ గా మారింది.
గాయపడ్డ సింహం గురించి
{{/usCountry}}గాయపడ్డ సింహం గురించి
{{/usCountry}}తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన గాయపడ్డ సింహం మూవీ అమెరికా వెళ్లాలనుకునే ఓ కుర్రాడి కథ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా, జేడీ చక్రవర్తి, శ్రీ విష్ణు తదితరులు నటించారు. ఈ చిత్రానికి కశ్యప్ శ్రీనివాస్ డైరెక్టర్. ఫుల్ ఫన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన గాయపడ్డ సింహం సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.
షూటింగ్ లో బిజీ
{{/usCountry}}తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన గాయపడ్డ సింహం మూవీ అమెరికా వెళ్లాలనుకునే ఓ కుర్రాడి కథ చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమాలో మానస చౌదరి, ఫరియా అబ్దుల్లా, జేడీ చక్రవర్తి, శ్రీ విష్ణు తదితరులు నటించారు. ఈ చిత్రానికి కశ్యప్ శ్రీనివాస్ డైరెక్టర్. ఫుల్ ఫన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన గాయపడ్డ సింహం సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.
షూటింగ్ లో బిజీ
{{/usCountry}}తరుణ్ భాస్కర్ ప్రస్తుతం ‘ఈ నగరానికి ఏమైంది’ మూవీ సీక్వెల్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అందుకే గాయపడ్డ సింహం సినిమా ఈవెంట్లకు రాలేకపోయాడు. రీసెంట్ గా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్లోనూ అతను కనిపించలేదు. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో వీడియో కాల్ లో మాట్లాడాడు.