...
...
Next Story

రాత్రి 2 గంటలకు క్యాబ్ డ్రైవ‌ర్‌తో గొడ‌వ‌.. విష్వ‌క్ సేన్ వ‌చ్చి ఏం చేశాడంటే.. త‌రుణ్ భాస్క‌ర్ ఇంట్రెస్టింగ్ కామెంట్లు

హీరో కమ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్, హీరో విష్వక్ సేన్ మధ్య మంచి ఫ్రెండ్ షిప్ బాండ్ ఉంది. మిడ్ నైట్ కాల్ చేసినా విష్వక్ తన కోసం వస్తాడని రీసెంట్ గా జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి తరుణ్ చెప్పుకొచ్చాడు.

Published on: Feb 1, 2026, 18:51:29 IST
Advertisement

తెలుగు ఇండస్ట్రీలోనే బెస్ట్ ఫ్రెండ్స్ లో విష్వక్ సేన్, తరుణ్ భాస్కర్ కచ్చితంగా ఉంటారు. కెరీర్ ఆరంభంలో విష్వక్ సేక్ కు ఈ నగరానికి ఏమైంది? లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. తన దర్శకత్వ కెరీర్ పరంగానూ అది ప్లస్ అయింది. విష్వక్ సేన్ తో తన స్నేహం గురించి చెప్తూ రీసెంట్ గా జరిగిన ఓ సంఘటనను షేర్ చేసుకున్నాడు తరుణ్.

క్యాబ్ డ్రైవర్ తో గొడవ

విష్వక్ సేన్, తరుణ్ భాస్కర్
విష్వక్ సేన్, తరుణ్ భాస్కర్

తరుణ్ భాస్కర్ హీరోగా నటించిన ఓం శాంతి శాంతి శాంతి: సినిమా ప్రమోషన్లలో భాగంగా తరుణ్ భాస్కర్ ఇంట్రెస్టింగ్ విషయాన్ని చెప్పాడు.

‘‘రీసెంట్ గా రాత్రి 2 గంటలకు ఊబర్ క్యాబ్ డ్రైవర్ తో గొడవైంది. రెండు స్టాప్స్ పెడితే పెట్టొద్దంటాడు. మరి యాప్ లో ఎందుకిచ్చారు? నాకు సంబంధం లేదు కదా. వాడితో గొడవ అయితుంటే విష్వక్ కాల్ చేశాడు. ఎక్కడున్నావ్ అని అడిగాడు. క్యాబ్ డ్రైవర్ తో గొడవ అనగానే వాడి బండేసుకుని వచ్చాడు’’ అని తరుణ్ భాస్కర్ చెప్పాడు.

పోలీస్ అని

‘‘టీషర్ట్ తో ఫేస్ కవర్ చేసుకుంటూ పోలీస్ ను బండి తీయ్ అని విష్వక్ బెదిరించాడు. అరే నువ్వు పోలీసులా లేవు, అది పోలీసు బండిలా లేదు అని నేనన్నా. విష్వక్ అంటే అదే. ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేస్తాడు. రాత్రి 2 గంటలకు కాల్ చేసి లొల్లి అయితుందంటే వచ్చేస్తాడు’’ అని తరుణ్ భాస్కర్ పేర్కొన్నాడు.

విజయ్ దేవరకొండకు కాల్

విజయ్ దేవరకొండ హీరోగా తరుణ్ భాస్కర్ పెళ్లి చూపులు సినిమా తీసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం నటుడిగా సినిమాలు చేస్తున్న తరుణ్ భాస్కర్.. మరోవైపు ఈ నగరానికి ఏమైంది పార్ట్ 2తో బిజీగా ఉన్నాడు. ఇక అతను హీరోగా నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ ఓం శాంతి శాంతి శాంతి: మూవీ జనవరి 30న రిలీజైంది.

ఇక విష్వక్ సేన్ ఏమో ఫంకీ మూవీతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. విజయ్ దేవరకొండ ఏమో రణబాలి షూటింగ్ లో బిజీ అయిపోయాడు.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe