మాళవికా మోహనన్.. ఈ మధ్యే ది రాజా సాబ్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ బ్యూటీ. ఒకప్పుడు ఓ తమిళ సినిమాలో ఆమె ఎమోషన్స్ సరిగా చూపించలేక ట్రోలింగ్ కు గురైంది. అలాంటి నటి ఇప్పుడు తెలుగు, తమిళ హీరోయిన్లకు అసలు డైలాగులు చెప్పడం రాదంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
వన్, టు, త్రీ లేదంటే ఏబీసీడీ

ది రాజా సాబ్ హీరోయిన్ మాళవికా మోహనన్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలుగు హీరోయిన్లపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇందులో బాలీవుడ్ నటులు మనోజ్ బాజ్పాయీ, ఇషాన్ ఖట్టర్ కూడా ఉన్నారు. వాళ్లతో మాట్లాడుతూ తెలుగు, తమిళ హీరోయిన్లకు డైలాగులు చెప్పడం రాదని మాళవిక చెప్పింది.
“తెలుగు, తమిళంలలో చాలా కాలంగా కొంతమంది హీరోయిన్లు అసలు డైలాగులను చూడనే చూడరు. ఓ సీన్ లో బాధగా కనిపించాలంటే ముఖం బాధగా పెట్టి 1, 2, 3, 4.. 1, 2, 3,4 అనేవాళ్లు. అంతే.. ఎందుకంటే ఏదో సమయంలో డైలాగులు లిప్ మూమెంట్ కు సరిపోయేవి. కొన్నిసార్లు ఏబీసీడీ, ఏబీసీడీ అనేవాళ్లు. ఇదేదో ఎప్పుడో ఒకసారి చేసింది కాదు. కెరీర్ మొత్తం ఇలాగే చేశారు” అని మాళవిక చెప్పడంతో మనోజ్, ఇషాన్ గట్టిగా నవ్వారు.
మాళవికా మోహనన్ గురించి..
మాళవికా మోహనన్ ఓ మలయాళ నటి. ఈమె ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేయూ మోహనన్ కూతురు. ఆమె తన మాతృభాష మలయాళంతోపాటు తమిళం, హిందీ, తాజాగా తెలుగులోనూ నటించింది. ది రాజా సాబ్ సినిమాలో భైరవి పాత్రలో కనిపించింది. త్వరలోనే తమిళ మూవీ సర్దార్ 2తో ప్రేక్షకుల ముందుకు రానుంది. గతేడాది మోహన్ లాల్ తో కలిసి హృదయపూర్వం మూవీతో హిట్ అందుకుంది. అంతకుముందు విక్రమ్ తో కలిసి తంగలాన్ సినిమాలోనూ నటించింది.
అయితే తాజాగా మాళవిక చేసిన కామెంట్స్ పై మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. కొందరు ఆమె కామెంట్స్ ను సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. ఓ మలయాళ నటిగా తెలుగు సినిమాలో డైలాగులు నువ్వు మాత్రం సరిగ్గా చెప్పగలవా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక మరికొందరు ఆమె చెప్పిన ఆ హీరోయిన్లు ఎవరు అని చర్చించుకుంటున్నారు.
{{/usCountry}}అయితే తాజాగా మాళవిక చేసిన కామెంట్స్ పై మిక్స్డ్ రియాక్షన్స్ వస్తున్నాయి. కొందరు ఆమె కామెంట్స్ ను సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. ఓ మలయాళ నటిగా తెలుగు సినిమాలో డైలాగులు నువ్వు మాత్రం సరిగ్గా చెప్పగలవా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక మరికొందరు ఆమె చెప్పిన ఆ హీరోయిన్లు ఎవరు అని చర్చించుకుంటున్నారు.
{{/usCountry}}