ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మర్డర్ మిస్టరీ- రియల్ ఇన్సిడెంట్స్‌తో అర్జున్, ఐశ్వర్య రాజేష్ థ్రిల్లర్- 8 రేటింగ్- ఇక్కడ చూడండి!

ఓటీటీలోకి ఇవాళ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ తీయావర్ కులైగల్ నడుంగ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించారు. తీయావర్ కులైగల్ నడుంగ ఓటీటీ రిలీజ్ ఎక్కడో చూద్దాం.

Published on: Dec 12, 2025 8:30 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చే మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాలపై సినీ లవర్స్ అమితమైన ఆసక్తి చూపిస్తుంటారు. వారి అభిరుచికి తగినట్లుగానే ఓటీటీ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ ప్రతి వారం రిలీజ్ అవుతుంటాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఓటీటీలోకి సరికొత్త మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు వచ్చేసింది.

ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మర్డర్ మిస్టరీ- రియల్ ఇన్సిడెంట్స్‌తో అర్జున్, ఐశ్వర్య రాజేష్ థ్రిల్లర్- 8 రేటింగ్- ఇక్కడ చూడండి!
ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మర్డర్ మిస్టరీ- రియల్ ఇన్సిడెంట్స్‌తో అర్జున్, ఐశ్వర్య రాజేష్ థ్రిల్లర్- 8 రేటింగ్- ఇక్కడ చూడండి!

సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్

ఆ సినిమానే తీయావర్ కులైగల్ నడుంగ (Theeyavar Kulaigal Nadunga). యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, సంక్రాంతికి వస్తున్నాం హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో నటించిన తమిళ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఇది. 'తీయావర్ కులైగల్ నడుంగ' థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకుని ఓటీటీలోకి వచ్చేసింది.

ఇంటెన్స్ మర్డర్ మిస్టరీ

విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లో జరిగిన హత్య చుట్టూ తిరిగే ఈ ఇంటెన్స్ మర్డర్ మిస్టరీగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ఎంతో అనుభవం గల ఇన్‌స్పెక్టర్ మగుడపాటి పాత్రలో అర్జున్ సర్జా ఆకట్టుకున్నారు. క్రైమ్, మర్డర్, ఇన్వెస్టిగేషన్, మిస్టరీ, లవ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.

8 ఐఎమ్‌డీబీ రేటింగ్

నవంబర్ 21న థియేటర్లలో విడుదలైన తీయావర్ కులైగల్ నడుంగ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే, ఐఎమ్‌డీబీ నుంచి పదికి 8 రేటింగ్ సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాను తెలుగులో మఫ్టీ పోలీస్ టైటిల్‌తో రిలీజ్ చేశారు. కానీ, అంతగా రెస్పాన్స్ రాలేదు.

తీయావర్ కులైగల్ నడుంగ ఓటీటీ

తాజాగా ఇవాళ తమిళంలో మాత్రం తీయావర్ కులైగల్ నడుంగ ఓటీటీలోకి వచ్చేసింది. సన్ నెక్ట్స్‌లో తీయావర్ కులైగల్ నడుంగ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. సన్ నెక్ట్స్‌లో ప్రస్తుతం తమిళంలో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో తీయావర్ కులైగల్ నడుంగ ఓటీటీ రిలీజ్ అయింది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమాను తెలుగులో డిజిటల్ స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉంది.

తీయావర్ కులైగల్ నడుంగ నటీనటులు

కాగా, తీయావర్ కులైగల్ నడుంగ సినిమాకు దినేష్ లక్ష్మణన్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో అర్జున్ సర్జా, ఐశ్వర్య రాజేష్‌తోపాటు ప్రవీణ్ రాజా, అభిరామి వెంకటాచలం, అనికా రాధాకృష్ణన్, రామ్ కుమార్ గణేషన్, వేల రామమూర్తి, ప్రాంక్‌స్టార్ రాహుల్, తంగుదురై తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.

రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా

అయితే, తీయావర్ కులైగల్ నడుంగ సినిమాను రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కించారు. ఒక అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో జరిగిన హత్యా నేరం చుట్టూ కథ నడుస్తుంది. ఒక అర్థరాత్రి రచయిత జెబా దారుణంగా హత్యకు గురవుతారు.

ట్విస్టులు

ఈ కేసు విచారణ బాధ్యతలను ఇన్‌స్పెక్టర్ మాగుడపాటి (అర్జున్ సర్జా) తీసుకుంటారు. అయితే, అపార్ట్‌మెంట్‌లోని ప్రతి ఒక్కరు అనుమానితులుగా ఉంటారు. మరి ఎస్సై వారిలో అసలైన నిందితుడుని పట్టుకున్నారా? ఎవరు హత్య చేశారు? అనుమానితుల నుంచి బయటపడిన రహస్యాలు ఏంటీ? అనేది తెలియాలంటే తీయావర్ కులైగల్ నడుంగ సినిమా చూడాల్సిందే.