OTT Thrillers: సస్పెన్స్, క్రైమ్, డ్రామా కథాంశాలను ఇష్టపడే ఓటీటీ ప్రేమికులకు ఈ వారం డబుల్ ఎంటర్టైన్మెంట్ లభించనుంది. మైండ్ బ్లోయింగ్ మిస్టరీ, ఇన్వెస్టిగేటివ్ ఎలిమెంట్స్తో రూపొందిన రెండు క్రేజీ తెలుగు వెబ్ సిరీస్లు పాపులర్ ఓటీటీ సంస్థ 'జీ5' (ZEE5) వేదికగా డిజిటల్ ప్రసారానికి సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ రెండవ వారంలో సస్పెన్స్ లవర్స్ను అలరించబోతున్న ఆ టాప్ 2 సిరీస్లు, వాటి కథాంశాల విశేషాలు ఇవే!
వీరభద్రుని రహస్యం (సీజన్ 1, పార్ట్ 2)

90ల నాటి క్లాసిక్ మిస్టరీ థ్రిల్లర్ 'మర్మదేశం' స్ఫూర్తితో తెరకెక్కిన 'వీరభద్రుని రహస్యం' మొదటి భాగం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ మిస్టరీలోని అసలు నిజాలను వెలికితీసేందుకు 'సీజన్ 1, పార్ట్ 2' సెప్టెంబర్ 9 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
స్టోరీ ఏంటంటే?
వీరభద్రాపురం అనే గ్రామంలోని ఆలయం దగ్గర వరుసగా జరిగే వింత మరణాలను ఊరి జనం 'వీరభద్ర స్వామి' దైవాగ్రహంగా నమ్ముతుంటారు. అయితే నగరానికి చెందిన డాక్టర్ వెన్నెల (యాక్టర్ ఆనీ) ఈ మూఢనమ్మకాన్ని ప్రశ్నిస్తుంది. దైవకార్యంగా ప్రచారంలో ఉన్న ఆ మరణాల వెనుక మానవ కుట్ర ఉందనే అనుమానంతో ఆమె సొంతంగా విచారణ ప్రారంభిస్తుంది.
స్థానిక పోలీసుల నిర్లక్ష్యం, ఊరి పెద్ద యోగానందం (రఘు కుంచె) నుంచి ఎదురయ్యే బెదిరింపులను అధిగమించి వెన్నెల నిజాలను ఎలా బయటకు తీసిందనేది పార్ట్ 2లో అత్యంత ఉత్కంఠభరితంగా చూపించనున్నారు. భీమగాని శ్రీవర్ధన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సిరీస్లో ఆనీ, రఘు కుంచె, రఘు, అభినవ్, కమల్ తుము కీలక పాత్రలు పోషించారు.
పంచనామా
మెడికల్ మాఫియా, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో రూపొందిన సరికొత్త థ్రిల్లర్ 'పంచనామా'. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సీట్-ఎడ్జ్ ఇన్వెస్టిగేటివ్ డ్రామా సెప్టెంబర్ 11 నుంచి జీ5 ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
స్టోరీ ఇదే
{{/usCountry}}మెడికల్ మాఫియా, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో రూపొందిన సరికొత్త థ్రిల్లర్ 'పంచనామా'. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సీట్-ఎడ్జ్ ఇన్వెస్టిగేటివ్ డ్రామా సెప్టెంబర్ 11 నుంచి జీ5 ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
స్టోరీ ఇదే
{{/usCountry}}పోలీస్ ఇన్ స్పెక్టర్ జై రామ్ (ప్రేమిస్తే భరత్) తమ్ముడు అనుమానాస్పద రీతిలో మరణిస్తాడు. దీని వెనుక ఉణ్న నిజానిజాలను తెలుసుకునేందుకు జై విచారణ ప్రారంభిస్తాడు. ఈ పరిశోధనలో ఆయనకు సమాజంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులు నడుపుతున్న ఒక ప్రమాదకరమైన మెడికల్ సిండికేట్ గురించిన షాకింగ్ విషయాలు తెలుస్తాయి.
తన సోదరుడి హత్య వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ను పట్టుకోవడానికి జై చేసే పోరాటం, ఆయనకు ఎదురయ్యే ప్రాణసంకటమైన పరిస్థితులే ఈ సిరీస్ ప్రధాన కథాంశం. ఈ సినిమాలో భారత్ శ్రీనివాసన్, శివాజీ రాజా, మేధా రెడ్డి, చరణ్ బాబు, రూపా లక్ష్మి ప్రధాన పాత్రలు పోషించారు.