Suhas Mandaadi Director: తమిళ మూవీ 'మండాడి' (Mandaadi) సక్సెస్ మీట్లో డైరెక్టర్ మతి మారన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలుగు నటుడు సుహాస్ స్వరాష్ట్రంలో అతని శరీర రంగు పరంగా బాడీ షేమింగ్, కలర్ కామెంట్స్ ఎదుర్కొన్నాడని, కోలీవుడ్ మాత్రమే అతన్ని గుండెలకు హత్తుకుందని డైరెక్టర్ కామెంట్స్ చేయడంపై తెలుగు ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలు 'మండాడి' ఈవెంట్లో ఏం జరిగింది?

సూరి ప్రధాన పాత్రలో, సుహాస్ కీలక పాత్రలో నటించిన తమిళ స్పోర్ట్స్ డ్రామా 'మండాడి' బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా విజయోత్సవ సభలో మాట్లాడిన దర్శకుడు మతి మారన్.. సుహాస్ తన రంగు, సొంత రాష్ట్రంలో వచ్చిన కామెంట్స్ చూసి షూటింగ్ టైమ్లో చాలా బాధపడేవాడని చెప్పుకొచ్చారు.
"సుహాస్ తన శరీర రంగుపై వచ్చిన కామెంట్స్ కు బాధపడ్డాడు. కానీ తమిళనాడులో రంగు చూసి ఎవరినీ తక్కువ చేసి చూడరని, ప్రతి ఇంట్లో ఇప్పుడు సుహాస్ పేరు సట్టాపులి క్యారెక్టర్గా గుర్తుండిపోతుందని చెప్పాను" అని మతి మారన్ వ్యాఖ్యానించారు. డైరెక్టర్ ఈ మాటలు అంటున్న సమయంలో పక్కనే ఉన్న సుహాస్ నవ్వుతూ తల దించుకోవడం, నటుడు సూరి చప్పట్లు కొట్టడం నెటిజన్లకు అస్సలు నచ్చలేదు.
ఖండించకపోవడంపై నెటిజన్ల తీవ్ర ఆగ్రహం
డైరెక్టర్ మతి మారన్ చేసిన కామెంట్స్ వీడియో ఎక్స్ లో వైరల్ అవ్వగానే తెలుగు నెటిజన్లు, సుహాస్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడ్డారు. "షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చి హీరోగా మారిన సుహాస్ను తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆదరించారు. ఇప్పటివరకు 10కి పైగా సినిమాల్లో హీరోగా అవకాశం ఇచ్చింది టాలీవుడే. మరి తమిళ వేదికపై తనను, తెలుగు ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడుతుంటే సుహాస్ ఎందుకు ఖండించలేదు?" అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.
కొందరు ఫ్యాన్స్ అయితే "ఇకపై సుహాస్ సినిమాలు ఓటీటీలో కూడా చూడము" అని ఆగ్రహం వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం సుహాస్కి మద్దతుగా నిలిచారు. వ్యక్తిగతంగా ఎవరికైనా బాడీ షేమింగ్ ఎదురైతే దాన్ని పంచుకోవడంలో తప్పు లేదని కామెంట్స్ చేస్తున్నారు.
సుహాస్ ఎమోషనల్ నోట్.. కానీ వివాదంపై సైలెన్స్
{{/usCountry}}కొందరు ఫ్యాన్స్ అయితే "ఇకపై సుహాస్ సినిమాలు ఓటీటీలో కూడా చూడము" అని ఆగ్రహం వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం సుహాస్కి మద్దతుగా నిలిచారు. వ్యక్తిగతంగా ఎవరికైనా బాడీ షేమింగ్ ఎదురైతే దాన్ని పంచుకోవడంలో తప్పు లేదని కామెంట్స్ చేస్తున్నారు.
సుహాస్ ఎమోషనల్ నోట్.. కానీ వివాదంపై సైలెన్స్
{{/usCountry}}సోషల్ మీడియాలో ట్రోలింగ్ తీవ్రత పెరగడంతో నటుడు సుహాస్ ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వేదికగా ఒక సుదీర్ఘ లేఖను విడుదల చేశారు. యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఆ తర్వాత హీరోగా మారిన తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు.
"నన్ను ఆదరించి, ప్రోత్సహించిన ప్రేక్షకులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీరు నా పనిని చూసి నన్ను ఆదరించారు తప్ప వేరే ఏదీ చూడలేదు. నా ప్రయాణమే దానికి నిదర్శనం" అని రాసుకొచ్చారు. అయితే మతి మారన్ చేసిన కలర్ కామెంట్స్ వివాదం గురించి గానీ, టాలీవుడ్ ఆడియన్స్ గురించి గానీ ఆయన నేరుగా ఎలాంటి వివరణ ఇవ్వకపోవడం గమనార్హం.
షార్ట్ ఫిలిమ్స్ నుంచి 'కలర్ ఫోటో', 'రైటర్ పద్మభూషణ్', 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు', 'ప్రసన్నవదనం', 'జనక అయితే గనక', 'హే బలవంత్' వంటి చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న సుహాస్.. ఈ వివాదం నుంచి ఎలా బయటపడతారో వేచి చూడాల్సిందే.