...
...
Next Story

Venky Atluri: మా ఇండస్ట్రీలో మా పద్ధతులు పాటించాల్సిందే: బాలీవుడ్ వాళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ వెంకీ అట్లూరి

Venky Atluri: బాలీవుడ్ వాళ్లకు డైరెక్టర్ వెంకీ అట్లూరి గట్టి కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ రెండు భారీ ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడంపై స్పందిస్తూ.. ఇక్కడి వర్క్ కల్చర్ కు అలవాటు పడాల్సిందేనని తేల్చి చెప్పారు.

Published on: Jul 30, 2026, 17:52:25 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Venky Atluri: పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ 'కల్కి 2898 AD' సీక్వెల్ 'కల్కి 2' తో పాటు ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రాబోతున్న 'స్పిరిట్' ప్రాజెక్ట్ నుంచి బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకోన్ తప్పుకోవడం ట్రేడ్ వర్గాల్లో పెద్ద దుమారమే రేపింది. సౌత్ ఇండియన్ సినిమా వర్కింగ్ కండిషన్స్, సుదీర్ఘమైన షూటింగ్ అవర్స్‌కు అడ్జస్ట్ కాలేకపోవడం వల్లే ఆమె ఈ ప్రాజెక్ట్‌ల నుంచి బయటకు వచ్చిందనే వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Venky Atluri: మా ఇండస్ట్రీలో మా పద్ధతులు పాటించాల్సిందే: బాలీవుడ్ వాళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ వెంకీ అట్లూరి (Hollywood Reporter)
Venky Atluri: మా ఇండస్ట్రీలో మా పద్ధతులు పాటించాల్సిందే: బాలీవుడ్ వాళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ వెంకీ అట్లూరి (Hollywood Reporter)

ఈ వివాదంపై తాజాగా సూర్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్ర దర్శకుడు వెంకీ అట్లూరి స్పందించారు. బాలీవుడ్ నటీనటులు సౌత్ కల్చర్‌కు, వర్కింగ్ స్టాండర్డ్స్‌కు అలవాటు పడాల్సిందేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

"సౌత్‌కి వస్తే ఇక్కడి రూల్స్ పాటించాల్సిందే".. డైరెక్టర్ వెంకీ

తన కొత్త సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్ ప్రమోషన్స్ సమయంలో ఈ విషయంపై మాట్లాడిన వెంకీ అట్లూరి చాలా స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. "నేను ఏదైనా హిందీ సినిమా చేయాల్సి వస్తే, ముందుగా అక్కడ ఉండే సంస్కృతి, వర్కింగ్ స్టాండర్డ్స్ పూర్తిగా నేర్చుకున్నాకే ప్రాజెక్ట్ మొదలుపెడతాను. అదే రీతిలో బాలీవుడ్ నుంచి ఏ నటుడు సౌత్‌కి వచ్చినా, ఇక్కడి పని వాతావరణానికి తగినట్లు తమను తాము మలుచుకోవాలి" అని ఆయన తెగేసి చెప్పారు.

సౌత్ ఇండస్ట్రీలో షూటింగ్స్ ఎంత కష్టంగా సాగుతాయో వివరిస్తూ.. "మేం సెట్స్‌పై రోజుకి 11 నుంచి 12 గంటలు నిరంతరాయంగా కష్టపడతాం. తమిళం, మలయాళం, లేదా హిందీ.. ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చినా ఇక్కడి వర్కింగ్ కండిషన్స్‌కి అనుగుణంగా మారడమే అసలైన ప్రొఫెషనిజం" అని వెంకీ అట్లూరి వివరించారు.

మారకపోతే ఇండస్ట్రీలో మనుగడ కష్టం

గతంలో 'సార్', రీసెంట్‌గా దుల్కర్ సల్మాన్‌తో 'లక్కీ భాస్కర్' లాంటి వరుస సూపర్ హిట్లతో ఫామ్‌లో ఉన్న వెంకీ అట్లూరి వ్యాఖ్యలకు సౌత్ సినీ వర్గాల నుంచి భారీ మద్దతు లభిస్తోంది.

సూర్య కాంబోలో 'విశ్వనాథ్ అండ్ సన్స్'.. ఆగస్టు 14న రిలీజ్

ఇక వెంకీ అట్లూరి ప్రస్తుతం వర్క్ చేస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తమిళ స్టార్ హీరో సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజూ కథానాయికగా అలరించనుంది. యువ సంగీత తరంగం జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు.

తమిళంలో నేరుగా చిత్రీకరించిన ఈ ఎమోషనల్ డ్రామాను తెలుగులోకి భారీ స్థాయిలో డబ్ చేస్తున్నారు. వచ్చే నెల ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe