Transfer Trimurthulu OTT: ఓటీటీలోకి వడ్డే నవీన్ కమ్‌బ్యాక్ మూవీ.. నెల రోజుల్లోపే స్ట్రీమింగ్.. ఎప్పటి నుంచంటే?

Transfer Trimurthulu OTT: టాలీవుడ్ సీనియర్ నటుడు వడ్డే నవీన్ కమ్‌బ్యాక్ మూవీ ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు నెల రోజుల్లోపే ఓటీటీలోకి వస్తోంది. ఈ సినిమాను జులై 17 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ5 ఓటీటీ వెల్లడించింది.

Published on: Jul 3, 2026, 22:15:46 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Transfer Trimurthulu OTT: టాలీవుడ్ వింటేజ్ లవర్ బాయ్ వడ్డే నవీన్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్. డిజిటల్ ప్లాట్‌ఫామ్ పై ఆయన గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చిన లేటెస్ట్ ప్రాజెక్ట్ 'ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు' ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియల్ గా లాక్ అయింది. ఈ క్రేజీ కామెడీ ఎంటర్టైనర్ జులై 17 నుంచి జీ5 (ZEE5) యాప్ లో స్ట్రీమింగ్ కాబోతోందని మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. పదేళ్ల తర్వాత ఈ సినిమాతో వచ్చిన నవీన్ కు థియేటర్లో పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా.. ఓటీటీలో మాత్రం హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.

Transfer Trimurthulu OTT: ఓటీటీలోకి వడ్డే నవీన్ కమ్‌బ్యాక్ మూవీ.. నెల రోజుల్లోపే స్ట్రీమింగ్.. ఎప్పటి నుంచంటే?
Transfer Trimurthulu OTT: ఓటీటీలోకి వడ్డే నవీన్ కమ్‌బ్యాక్ మూవీ.. నెల రోజుల్లోపే స్ట్రీమింగ్.. ఎప్పటి నుంచంటే?

నాటి గోల్డెన్ డేస్.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్

ఒకప్పుడు 'పెళ్లి', 'చాలా బాగుంది', 'స్నేహితులు' లాంటి సూపర్ హిట్ సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యాడు వడ్డే నవీన్. తన క్యూట్ స్మైల్, నాచురల్ యాక్టింగ్ తో 90ల నాటి కుర్రకారును ఉర్రూతలూగించాడు. కమర్షియల్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా తన ఫ్యామిలీ డ్రామాలతో ఇండస్ట్రీలో ఒక మార్క్ సెట్ చేశాడు.

ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్లో, సరైన కథలు సెట్ కాకనో ఇండస్ట్రీకి చాలా పెద్ద గ్యాప్ ఇచ్చాడు. గత నెల 19న ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమాతో మళ్లీ సిల్వన్ స్క్రీన్ కు తిరిగొచ్చాడు. ఆ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ సినిమాకు థియేటర్లలో మిక్స్‌డ్ రివ్యూలు వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర మా ఇంటి బంగారం రూపంలో గట్టి పోటీ ఎదురవడంతో పెద్దగా వసూళ్లు సాధించలేకపోయింది.

రాశీ సింగ్ గ్లామర్.. జీ5 పర్ఫెక్ట్ స్ట్రాటజీ

ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులో వడ్డే నవీన్ కు జోడీగా యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ రాశీ సింగ్ నటించింది. రీసెంట్ గా 'భూతద్ధం భాస్కర్ నారాయణ', 'పాపం పసివాడు' లాంటి ప్రాజెక్ట్స్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ భామ. ఇప్పుడు ఏకంగా ఓ సీనియర్ స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసింది.

“ఎదురు చూపులు ముగిశాయి.. ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. వడ్డే నవీన్, రాశీ సింగ్ నటించిన ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు జీ5 తెలుగులో జులై 17 నుంచి స్ట్రీమింగ్ కానుంది. జులై 17న ప్రీమియర్.. కేవలం జీ5లో తెలుగులో” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More