Trisha Vijay: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ (Trisha), తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ (Thalapathy Vijay) ల మధ్య ఉన్న బాండింగ్ గురించి సౌత్ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఏటా విజయ్ బర్త్డే వస్తే.. త్రిష ఎలాంటి క్రేజీ పోస్ట్ పెడుతుందా అని ఇటు మెగా ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు.

అయితే జూన్ 22న విజయ్ పుట్టినరోజు ముగిసినా సమయానికి త్రిష నుంచి ఎలాంటి పోస్ట్ రాకపోవడంతో సోషల్ మీడియాలో రకరకాల రూమర్స్ షురూ అయ్యాయి. వీరిద్దరి మధ్య గొడవలు జరిగాయంటూ నెటిజన్లు రకరకాల పుకార్లు తెర పైకి తెచ్చారు. కట్ చేస్తే.. తాజాగా ఒకే ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్ట్తో త్రిష ఆ రూమర్స్ అన్నింటికీ పర్ఫెక్ట్ ఎండ్ కార్డ్ వేశారు.
ఒక రోజు ఆలస్యంగా.. ఊహించని సర్ప్రైజ్
జూన్ 22న విజయ్ బర్త్డే సందర్భంగా ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది సెలబ్రిటీలు విషెస్ చెప్పారు. కానీ త్రిష సైలెంట్ గా ఉండటం పెద్ద హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని నెలలుగా వీరిద్దరి రిలేషన్ షిప్ పై వస్తున్న గాసిప్స్ కు ఈ సైలెన్స్ మరింత బూస్టప్ ఇచ్చినట్లయింది. వీరిద్దరి మధ్య బంధం ముగిసిపోయిందంటూ కొందరు కామెంట్స్ కూడా చేశారు.
అయితే వీటన్నింటికీ సమాధానం ఇస్తూ.. జూన్ 23న (ఈరోజు) త్రిష తన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక బ్యూటిఫుల్ ఫోటోను షేర్ చేశారు. అందులో త్రిష, విజయ్ ఇద్దరూ పక్కపక్కనే నిలబడి ఎంతో హ్యాపీగా ఒక బర్త్డే కేక్ కట్ చేస్తూ కనిపించారు. ఈ ఊహించని ఫొటో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ తో పాటు ఫుల్ ఖుషీ అవుతున్నారు. సోషల్ మీడియాలో త్రిష బర్త్డే విష్ పోస్ట్ లేట్ గా వచ్చినా.. లేటెస్ట్ గా వచ్చి నెట్టింట పూనకాలు తెప్పిస్తోందంటూ విజయ్ ఫ్యాన్స్ రచ్చ మొదలుపెట్టారు.
రెడ్ హార్ట్ ఎమోజీతో..
విజయ్కి బర్త్ డే విషెస్ చెబుతూ త్రిష ఇచ్చిన క్యాప్షన్ కూడా ఆకట్టుకుంటోంది. “నా జీవితంలో ప్రతి దానికి ఒక అర్థాన్ని ఇచ్చే ఆ ప్రత్యేకమైన వ్యక్తికి.. పుట్టినరోజు శుభాకాంక్షలు” అని అంటూ రెడ్ హార్ట్ ఎమోజీని క్యాప్షన్ లో ఉంచింది. ఈ పోస్టు ఇన్స్టాంట్ వైరల్ అయింది. కీర్తి సురేష్ తోపాటు కొన్ని లక్షల మంది లైక్ చేశారు.
{{/usCountry}}విజయ్కి బర్త్ డే విషెస్ చెబుతూ త్రిష ఇచ్చిన క్యాప్షన్ కూడా ఆకట్టుకుంటోంది. “నా జీవితంలో ప్రతి దానికి ఒక అర్థాన్ని ఇచ్చే ఆ ప్రత్యేకమైన వ్యక్తికి.. పుట్టినరోజు శుభాకాంక్షలు” అని అంటూ రెడ్ హార్ట్ ఎమోజీని క్యాప్షన్ లో ఉంచింది. ఈ పోస్టు ఇన్స్టాంట్ వైరల్ అయింది. కీర్తి సురేష్ తోపాటు కొన్ని లక్షల మంది లైక్ చేశారు.
{{/usCountry}}గతంలో విజయ్, త్రిష కాంబినేషన్ లో 'గిల్లి', 'తిరుపాచి', 'ఆరు', 'కురువి' లాంటి బ్లాక్బస్టర్ హిట్స్ వచ్చాయి. చాలా గ్యాప్ తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వచ్చిన 'లియో' (Leo) సినిమాలో ఈ వింటేజ్ కాంబో మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకుని థియేటర్లను షేక్ చేసింది. రీసెంట్ గా విజయ్ తన చివరి సినిమా 'జననాయగన్' (Jana Nayagan) షూటింగ్ ముగించుకుని పూర్తిగా ప్రజల సేవలో బిజీ అయ్యారు.
త్రిష చేసిన ఈ క్రేజీ అప్డేట్ తో గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో నడుస్తున్న నెగటివ్ ప్రచారాలన్నింటికీ ఒకేసారి ముగింపు పలికినట్లయింది.