Trisha Krishnan: స్టార్ హీరోయిన్ త్రిష క్రిష్ణన్ తమిళ రాజకీయాల్లో తన పేరు చుట్టూ రేగిన పొలిటికల్ తుఫాన్పై ఎట్టకేలకు స్పందించారు. తమిళనాడు డిప్యూటీ సీఎం, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన డబుల్ మీనింగ్ కామెంట్స్ తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. వారం రోజుల సైలెన్స్ తర్వాత త్రిష తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పరోక్షంగా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ పెట్టిన క్రిప్టిక్ పోస్ట్లు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఏ ఒక్కరి పేరు ఎత్తకుండానే త్రిష షేర్ చేసిన ఆ పోస్ట్ ఇప్పుడు తమిళనాడు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. పొలిటికల్ లీడర్లకు పరోక్షంగా క్లాస్ పీకుతూ త్రిష ఇన్స్టా స్టోరీలో రాసుకొచ్చిన వ్యాఖ్యలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
డబ్బు సంపాదించి ప్రశాంతంగా ఉండండి..
వివాదం ముదిరినప్పటి నుంచి సైలెంట్గా ఉన్న త్రిష.. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక కోట్ను షేర్ చేశారు. "ఈ వయసులో ఇలాంటి డ్రామాలు చేయడం చాలా సిగ్గుచేటు.. పోయి కాస్త డబ్బు సంపాదించుకుని ప్రశాంతంగా జీవించండి" అని ఉన్న పోస్ట్కు ఓ నవ్వుతున్న ఎమోజీని జత చేశారు. ఎలాంటి పేర్లు ప్రస్తావించకపోయినా, తనను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు, దాని చుట్టూ జరుగుతున్న రాజకీయాలకు త్రిష ఇచ్చిన పర్ఫెక్ట్ కౌంటర్ ఇదేనని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
దీంతో పాటు "ఒకప్పుడు నువ్వు దేవుడిని కోరుకున్న జీవితం లభించినప్పుడు ఆనందంలో మునిగిపోవడం ఒక గొప్ప వరం" అనే మరో పోస్ట్కు ఈవిల్ ఐ ఎమోజీని జత చేస్తూ షేర్ చేశారు. త్రిష తల్లి ఉమా క్రిష్ణన్ కూడా సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. "మీ పని మీరు చూసుకోండి, వర్కవుట్స్ చేయండి, మంచిగా ఉండండి, డబ్బు సంపాదించండి" అంటూ పెట్టిన పోస్ట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.
అమ్మమ్మ 98వ బర్త్డే వేడుకలు.. పిక్స్ వైరల్
సోషల్ మీడియాలోకి త్రిష రీ-ఎంట్రీ ఇవ్వడానికి ప్రధాన కారణం ఆమె అమ్మమ్మ 98వ పుట్టినరోజు వేడుకలే. కుటుంబ సభ్యులు, తన పెంపుడు కుక్క 'ఇజ్జీ'తో కలిసి ఆమె ఈ బర్త్డే వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. పర్పుల్ కలర్ శారీలో మెరిసిపోతున్న అమ్మమ్మ ఫోటోలను షేర్ చేస్తూ త్రిష తన ఆనందాన్ని పంచుకున్నారు.
{{/usCountry}}సోషల్ మీడియాలోకి త్రిష రీ-ఎంట్రీ ఇవ్వడానికి ప్రధాన కారణం ఆమె అమ్మమ్మ 98వ పుట్టినరోజు వేడుకలే. కుటుంబ సభ్యులు, తన పెంపుడు కుక్క 'ఇజ్జీ'తో కలిసి ఆమె ఈ బర్త్డే వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. పర్పుల్ కలర్ శారీలో మెరిసిపోతున్న అమ్మమ్మ ఫోటోలను షేర్ చేస్తూ త్రిష తన ఆనందాన్ని పంచుకున్నారు.
{{/usCountry}}గోల్డెన్ క్యాండిల్స్, ఆల్మండ్ కేక్తో కుటుంబంతో కలిసి గడిపిన ఈ స్పెషల్ మూమెంట్స్ పిక్స్ ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వివాదాలు ఎంత నడుస్తున్నా తన పర్సనల్ లైఫ్ను ఎంతో ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తున్నానని ఈ పిక్స్ ద్వారా త్రిష నిరూపించారు.
అసలు వివాదం ఏంటి? ఉదయనిధి స్టాలిన్పై టీవీకే ఫిర్యాదు
కావేరీ నీటి సమస్యపై డీఎంకే నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తుండగా, జనం నుంచి కొందరు త్రిష పేరును గట్టిగా అరిచారు. దానిపై ఉదయనిధి స్పందిస్తూ డబుల్ మీనింగ్ వచ్చేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు వచ్చాయి. తాను కావేరి నీటి గురించి మాట్లాడానని ఉదయనిధి సమర్థించుకున్నప్పటికీ, ఆ వీడియో నెట్టింట వైరల్ అయింది.
దీనిపై తమిళ నటుడు విజయ్ స్థాపించిన 'తమిళగ వెట్రి కళగం' (TVK) పార్టీకి చెందిన మహిళా విభాగం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఉదయనిధిని తంజావూర్ పోలీసులు కొద్దిసేపు అదుపులోకి తీసుకుని విచారించి, ఆ తర్వాత బెయిల్పై విడుదల చేశారు. డీఎంకే మాత్రం ఈ వ్యాఖ్యలను కావాలనే వక్రీకరించారని క్లారిటీ ఇచ్చింది.
‘విశ్వంభర’తో బిజీగా ఉన్న త్రిష
'పొన్నియిన్ సెల్వన్', 'లియో', 'గోట్', థగ్ లైఫ్ లాంటి వరుస భారీ పాన్ ఇండియా హిట్స్తో సెకండ్ ఇన్నింగ్స్లోనూ తిరుగులేని క్రేజ్తో దూసుకెళ్తున్నారు త్రిష. వయసు పెరుగుతున్న కొద్దీ మరింత గ్లామర్తో, నటనతో మెప్పిస్తూ స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్గా మారారు. ప్రస్తుతం టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి సోషియో ఫాంటసీ ఎపిక్ 'విశ్వంభర' సినిమాలో నటిస్తున్నారు.