Jovika: తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి మరో వారసురాలు అడుగుపెట్టింది. మూడో తరం అమ్మాయి హీరోయిన్ గా డెబ్యూ చేస్తోంది. ఆ భామ పేరే.. జోవికా విజయ్ కుమార్. ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ థ్రిల్లర్ ‘అగధ’ మూవీతో జోవికా ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రెడీ అవుతోంది. ఆమె బ్యాక్ గ్రౌండ్ పై ఓ లుక్కేయండి.
మంజుల మనవరాలు

తెలుగులో అత్యంత ఆదరణ పొందిన సీనియర్ హీరోయిన్లలో మంజుల ఒకరు. ఎన్టీఆర్, ఏఎన్నార్, సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు లాంటి దిగ్గజాలతో మంజుల ఎన్నో సినిమాలు చేశారు. మగాడు, మనుషులంతా ఒక్కటే, నేరం నాది కాది ఆకలిది, దొరబాబు, బంగారు బొమ్మలు, మాయదారి మల్లిగాడు, మంచి మనుషులు తదితర సినిమాల్లో మంజుల నటించారు. ఆ మంజుల మనవరాలే ఈ జోవికా.
అమ్మ కూడా హీరోయిన్
జోవికా తల్లి వనిత విజయ్ కుమార్ కూడా ఒకప్పుడు హీరోయిన్. మంజుల కూతురైన వనిత విజయ్ కుమార్ ను ‘దేవి’ మూవీతో ఎంఎస్ రాజే పరిచయం చేశారు. ఆ సినిమాకు ఆయనే ప్రొడ్యూసర్. ఇప్పుడు ఆమె కూతురు జోవికా విజయ్ కుమార్ డెబ్యూ మూవీకి ఎంఎస్ రాజు డైరెక్టర్ కావడం విశేషం.
అమ్మమ్మలా ఉన్నానని
తాజాగా ‘అగధ’ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. హారర్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ టీజర్ అదిరిపోయింది. ఈ లాంఛింగ్ ఈవెంట్లో జోవికా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె మాట్లాడుతూ.. ‘‘ఇది నా ఫస్ట్ ఫిల్మ్. తెలుగులో చేస్తున్నా. అందరూ పోస్టర్లు చూసి మంజుల మనవరాలు వచ్చిందని చెప్పారు. చాలా బాగున్నానని అన్నారు. మంజులలాగే ఉందని అన్నారు’’ అని జోవికా తెలిపింది.
‘‘ఈ రోజు మా అమ్మమ్మ ఇక్కడ ఉంటే ఎంతో గర్వంగా ఫీల్ అయింది. సంతోషపడేది. ఆమె ఎక్కడో ఉండి నన్ను చూస్తూనే ఉంటుందని అనుకుంటున్నా’’ అని జోవికా చెప్పింది. నటి మంజుల 59 ఏళ్ల వయసులో 2013లో కన్నుమూశారు.
{{/usCountry}}‘‘ఈ రోజు మా అమ్మమ్మ ఇక్కడ ఉంటే ఎంతో గర్వంగా ఫీల్ అయింది. సంతోషపడేది. ఆమె ఎక్కడో ఉండి నన్ను చూస్తూనే ఉంటుందని అనుకుంటున్నా’’ అని జోవికా చెప్పింది. నటి మంజుల 59 ఏళ్ల వయసులో 2013లో కన్నుమూశారు.
{{/usCountry}}అగధ గురించి
ఒకప్పుడు ప్రొడ్యూసర్ గా బ్లాక్ బస్టర్ సినిమాలు అందించిన ఎంఎస్ రాజు ఆ తర్వాత డైరెక్టర్ గా మారారు. ‘వాన’ మూవీతో తొలిసారి మెగా ఫోన్ పట్టిన ఆయన.. ఆ తర్వాత ‘తూనీగ తూనీగ’, ‘డర్టీ హరి’, ‘7 డేస్ 6 నైట్స్’ అంటూ యూత్ ఫుల్ రొమాంటిక్ మూవీస్ తీశారు. ‘మళ్లీ పెళ్లి’తో ఓ ప్రయోగం చేశారు. ఇప్పుడు అగధ అంటూ ఫస్ట్ హారర్ థ్రిల్లర్ తీస్తున్నారు.