...
...
Next Story

Varun Tej Son: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ కొడుకు వాయు ఫస్ట్ బర్త్‌డే.. ఫేస్ రివీల్.. ఎంత క్యూట్‌గా ఉన్నాడో చూశారా?

Varun Tej Son: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు తమ తనయుడు వాయువ్ ముఖాన్ని అభిమానులకు చూపించారు. వాయువ్ తొలి బర్త్ డే సందర్భంగా వాళ్లు ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు.

Published on: Sep 10, 2026, 21:59:59 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Varun Tej Son: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు తమ ముద్దుల కుమారుడు వాయువ్ మొదటి పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్‌కి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఇప్పటివరకు దాచి ఉంచిన తమ చిన్నారి ముఖాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా రివీల్ చేశారు. ఈ క్యూట్ స్నాప్స్ నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

"నువ్వు రాకముందే నిన్ను ప్రేమించా!".. వరుణ్ తేజ్ ఎమోషనల్ పోస్ట్

Varun Tej Son: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ కొడుకు వాయు ఫస్ట్ బర్త్‌డే.. ఫేస్ రివీల్.. ఎంత క్యూట్‌గా ఉన్నాడో చూశారా?
Varun Tej Son: వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ కొడుకు వాయు ఫస్ట్ బర్త్‌డే.. ఫేస్ రివీల్.. ఎంత క్యూట్‌గా ఉన్నాడో చూశారా?

తమ కొడుకు ఫస్ట్ బర్త్‌డే సందర్భంగా వరుణ్ తేజ్ ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ ఖాతాల్లో ఓ స్పెషల్ ఎమోషనల్ నోట్ షేర్ చేశారు. "మై డియర్ బాయ్.. నువ్వు నా ప్రపంచాన్ని ఎంతో అందంగా మార్చేశావు. నిన్ను మొదటిసారి కళ్లతో చూడకముందే నీ ప్రేమలో పడిపోయాను. నీకు తండ్రిగా మారడమే నా లైఫ్‌లో బెస్ట్ పార్ట్. హ్యాపీ ఫస్ట్ బర్త్‌డే వాయువ్.. ఎప్పటికీ ఐ లవ్ యు" అంటూ కొడుకుపై ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు.

పోస్ట్‌లో షేర్ చేసిన పిక్చర్స్ చూసి నెటిజన్లు వాయువ్ క్యూట్‌నెస్‌కి ఫిదా అయిపోతున్నారు. తండ్రి ఒడిలో చిన్నారి హాయిగా ఉన్న క్షణాలు, తల్లి ప్రేమను ఆస్వాదిస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

లావణ్య త్రిపాఠీ కూడా హార్ట్‌టచింగ్ మెసేజ్

మరోవైపు లావణ్య త్రిపాఠి కూడా కొడుకు కోసం ఎంతో భావోద్వేగమైన సుదీర్ఘ సందేశాన్ని పోస్ట్ చేశారు. "నన్ను నీ తల్లిగా ఎంచుకున్నందుకు థ్యాంక్స్ రా చిన్నోడా. నువ్వు నా జీవితంలోకి రాకముందు ప్రేమ అంటే ఏంటో నాకు తెలుసనుకున్నాను. కానీ నువ్వు వచ్చాక నా హృదయానికి ఓ కొత్త అర్థం దొరికింది. నా వెలుపల జీవిస్తున్న నా సొంత హృదయం నువ్వు" అని మురిసిపోయారు.

ఈ క్యూట్ పిక్స్ చూసి మెగా సిస్టర్ నిహారిక కొణిదెల చాలా ఉత్సాహంతో కామెంట్ చేశారు. "ఇదిగోండి.. నేను చూసిన అత్యంత హ్యాండ్సమ్, బ్యూటిఫుల్ బాయ్ ఇతనే!" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ చేయడం విశేషం. రామ్ చరణ్ భార్య ఉపాసన కొణిదెల "హ్యాపీ హ్యాపీ బర్త్‌డే డార్లింగ్ వాయువ్" అని స్పెషల్ విషెస్ చెప్పారు.

బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు, హీరోయిన్లు రీతూ వర్మ, అనుపమ పరమేశ్వరన్, రుహానీ శర్మ సహా టాలీవుడ్ ప్రముఖులు చిన్నారికి బర్త్‌డే విషెస్ తెలుపుతూ కామెంట్స్ వర్షం కురిపించారు.

'మిస్టర్' సెట్స్ నుంచి పేరెంట్‌హుడ్ వరకు..

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కాంబినేషన్‌లో 2017లో వచ్చిన 'మిస్టర్' సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 2018లో 'అంతరిక్షం 9000 KMPH' సినిమాలో కలసి నటించారు. కొన్నేళ్ల పాటు తమ ప్రేమ విషయాన్ని సీక్రెట్‌గా ఉంచిన ఈ కపుల్, 2023లో హైదరాబాద్‌లో నిశ్చితార్థం చేసుకుని, అదే ఏడాది ఇటలీలోని టుస్కానీలో గ్రాండ్ డ్రీమ్ వెడ్డింగ్ చేసుకున్నారు.

2025 సెప్టెంబర్ 9న లావణ్య పండంటి బాబుకి జన్మనిచ్చారు. కెరీర్ విషయానికొస్తే, వరుణ్ తేజ్ ఇటీవలే 'కొరియన్ కనకరాజు' మూవీతో అలరించగా, లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి' మూవీతో వచ్చినా నిరాశపరిచారు.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks