లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ విరోష్ జంట ఫిబ్రవరి 26న ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమెంటోస్ హోటల్లో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు హైదరాబాద్ లో గ్రాండ్ గా రిసెప్షన్ నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఈ రిసెప్షన్ నేపథ్యంలో ఫ్యాన్స్ కు విజయ్, రష్మిక చేసిన రిక్వెస్ట్ వైరల్ గా మారింది.
విరోష్ రిసెప్షన్

హైదరాబాద్ లో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. మార్చి 4న సాయంత్రం సిటీలోని తాజ్ హోటల్లో ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కు రాజకీయ, సినిమా రంగాలకు చెందిన ప్రముఖులు అటెండ్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఈవెంట్ ను ‘ఇన్వైట్ ఓన్లీ’ కార్యక్రమంగా నిర్వహించనున్నారు.
విజయ్, రష్మిక రిక్వెస్ట్
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఫ్యాన్స్ కు చేసిన రిక్వెస్ట్ హాట్ టాపిక్ గా మారింది. తమ రిసెప్షన్ కు కేవలం ఆహ్వానం ఉన్నవాళ్లు మాత్రమే రావాలని ఈ జంట స్పష్టం చేసింది. ఇతరులను లోపలికి అనుమతించమని చెప్పేసింది. అభిమానులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని విజయ్, రష్మిక కోరారు.
కేవలం వాళ్లకే
విరోష్ టీమ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన నోట్ ప్రకారం.. ‘‘విరోష్ వెడ్డింగ్ రిసెప్షన్ కేవలం ఆహ్వానితులకే పరిమితం. అభిమానులు, అతిథులు ఈ మేరకు సహకరించాలని కోరుతున్నాం. భద్రతా చర్యలకు ఎలాంటి ఆటకం కలిగించొద్దని విన్నవిస్తున్నాం. మీ భద్రత, సంతోషం మాకు చాలా ముఖ్యం. మీ ఆశీర్వాదాలు, మద్దతుకు మేము ఎంతో కృతజ్ఞులం. ఈ వేడుకను సురక్షితంగా, ఆనందంగా జరుపుకోవడంలో మీ సహకారాన్ని కోరుతున్నాం’’ అని విజయ్, రష్మిక కోరారు.
సెలబ్రిటీలు
విరోష్ రిసెప్షన్ ను మొదట తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులతో గ్రాండ్ గా నిర్వహించాలని అనుకున్నారు. కానీ విరోష్ వెడ్డింగ్ జాతీయ స్థాయిలో హైలైట్ అయింది. వీళ్ల పెళ్లి ఫొటోలు లైక్స్ పరంగా కొత్త హిస్టరీ క్రియేట్ చేశాయి. అందుకే ఈ బజ్ నేపథ్యంలో లేనిపోని ఇబ్బందులు తలెత్తకుండా అతిథులను లిమిట్ గానే ఆహ్వానించారని తెలిసింది.
{{/usCountry}}విరోష్ రిసెప్షన్ ను మొదట తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన సెలబ్రిటీలతో పాటు రాజకీయ ప్రముఖులతో గ్రాండ్ గా నిర్వహించాలని అనుకున్నారు. కానీ విరోష్ వెడ్డింగ్ జాతీయ స్థాయిలో హైలైట్ అయింది. వీళ్ల పెళ్లి ఫొటోలు లైక్స్ పరంగా కొత్త హిస్టరీ క్రియేట్ చేశాయి. అందుకే ఈ బజ్ నేపథ్యంలో లేనిపోని ఇబ్బందులు తలెత్తకుండా అతిథులను లిమిట్ గానే ఆహ్వానించారని తెలిసింది.
{{/usCountry}}వెడ్డింగ్ రిసెప్షన్ జరిగే హోటల్ బయట కూడా గుమిగూడొద్దని, ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలిగించొద్దని అభిమానులను విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కోరారు. కేవలం ఆహ్వానం ఉన్నవాళ్లే లోపలికి రావాలని క్లారిటీగా చెప్పేశారు. ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కు రావాలిన ప్రధానమంత్రి మోదీని విజయ్, రష్మిక వెళ్లి స్వయంగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.