...
...
Next Story

వెడ్డింగ్ వైబ్.. కొత్త కోడలు రష్మిక రాక కోసం ముస్తాబవుతున్న విజయ్ దేవరకొండ ఇల్లు.. లైట్స్ తో మెరిసిసోతూ.. వీడియో చూశారా?

కొత్త కోడలిని ఆహ్వానించేందుకు విజయ్ దేవరకొండ ఇల్లు ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 26న రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి జరగబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని విజయ్ దేవరకొండ ఇంటిని లైట్స్ తో మెరిసేలా డెకరేషన్ చేశారు. ఈ ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

Published on: Feb 19, 2026, 10:20:56 IST
Advertisement

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి పనుల్లో బిజీగా మారిపోయారు. వెడ్డింగ్ వైబ్స్ తో గ్రాండ్ మ్యారేజీకి రెడీ అవుతున్నారు. ఈ జంట ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లోని ఓ ప్యాలెస్ లో వివాహం చేసుకోనున్నారు. తమ వెడ్డింగ్ పై ఈ జంట సైలెంట్ గానే ఉన్నా సోషల్ మీడియాలో లీక్ అయిన పెళ్లి పత్రిక ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

విజయ్ దేవరకొండ ఇల్లు

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి

రష్మిక మందన్నతో పెళ్లి నేపథ్యంలో హైదరాబాద్ లోని విజయ్ దేవరకొండ ఇంటిని గోల్డెన్ కలర్ లైట్స్ తో మెరిసేలా డెకరేషన్ చేశారు. పెళ్లి అయ్యాక కొత్త కోడలు రష్మిక మందన్నకు వెల్ కమ్ చెప్పేందుకు ఇంటిని ముస్తాబు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లో ఉన్న విజయ్ దేవరకొండ ఇంటి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. విజయ్ దేవరకొండ ఇంటి బయట నుంచి తీసిన ఒక వీడియోను ఓ ఫోటోగ్రాఫర్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

ఫ్యాన్స్ రియాక్షన్

రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ పెళ్లి కార్డు రీసెంట్ గా సోషల్ మీడియాలో లీక్ అయింది. ఇందులో ఫిబ్రవరి 26న అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరుగుతుందని ఉంది. మార్చి 4న హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహిస్తున్నట్లు పెళ్లి పత్రికలో పేర్కొన్నారు. ఈ వెడ్డింగ్ కార్డుతో పాటు స్పెషల్ గిఫ్ట్ బాక్స్ ను కూడా అతిథులకు రష్మిక, విజయ్ పంపిస్తున్నారు.

పెళ్లి పత్రికతో పాటు అతిథులకు ఓ ప్రత్యేక గిఫ్ట్ బాక్స్ ను రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ అందిస్తున్నారు. ఈ బాక్స్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇందులో విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ కు చెందిన ఓ టీషర్ట్ ఉంది. రష్మిక మందన్న కంపెనీకి చెందిన నేషనల్ క్రష్ పర్ఫ్యూమ్ బాటిల్ ఉంది. చేతులకు, కాళ్లకు రాసుకునే ఓ ఆయుర్వేదిక్ క్రీమ్, ఓ జీడిపప్పు ప్యాకెట్, స్వీట్ బాక్స్ కూడా ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
Chandu Shanigarapu

చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks