Vijay Rashmika: చుట్టుముట్టిన అభిమానులు.. రష్మికను గట్టిగా పట్టుకొని బాడీగార్డ్లా కాపాడిన విజయ్.. వీడియోలు వైరల్
Vijay Rashmika: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి చేసుకొని నెల రోజులు పూర్తయిన సందర్భంగా అనంతపురంలోని ఓ ఆలయానికి వెళ్లారు. అక్కడ అభిమానులు పెద్ద ఎత్తున చుట్టుముట్టడంతో భార్యను జాగ్రత్తగా కాపాడుకుంటూ విజయ్ ముందుకు తీసుకెళ్లాడు.
స్టార్ కపుల్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ తమ వన్ మంత్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ను మార్చి 26న ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేసుకున్నారు. వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్న కొత్త సినిమా 'రణబాలి' సెట్స్లో ఈ జంటకు హారతి ఇచ్చి చాలా గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు. అంతకంటే ముందే వీళ్లిద్దరూ ఆశీర్వాదం కోసం ఒక గుడికి వెళ్లారు. అక్కడ టెంపుల్ దగ్గర ఫ్యాన్స్ ఒక్కసారిగా మీద పడబోతుంటే.. విజయ్ చాలా జాగ్రత్తగా రష్మికను దగ్గరగా పట్టుకుని కాపాడుకుంటూ రావడం అందరినీ ఆకర్షించింది.

రష్మికకు రక్షణ కవచంలా విజయ్ దేవరకొండ..
అనంతపురానికి చెందిన ఒక ఇన్స్టాగ్రామ్ పేజీ పోస్ట్ చేసిన వీడియోలో.. విజయ్ ఒక సింపుల్ క్రీమ్ కలర్ కుర్తాలో, రష్మిక సింపుల్ బ్లూ సూట్ సెట్లో కనిపించారు. ఫ్యాన్స్కు అభివాదం చేస్తూ, వాళ్లు ఇచ్చిన పూలు తీసుకుంటూ ఈ జంట ఫుల్ నవ్వులు చిందిస్తూ కనిపించింది.
ఆ తర్వాత జనం బాగా పెరిగిపోవడంతో, రష్మిక తన చేత్తో విజయ్ నడుమును గట్టిగా పట్టుకోగా.. విజయ్ ఆమెను చాలా దగ్గరగా హత్తుకుని ఆ గుంపులో కాపాడుకుంటూ రావడం ఆ వీడియోలో కనిపించింది. పూజారులు ఈ జంటను ఆశీర్వదిస్తున్న టైమ్లో వాళ్ల సెక్యూరిటీ సిబ్బంది జనాలను కంట్రోల్ చేస్తూ వెనక్కి నెట్టడం కూడా మనం చూడొచ్చు.
హనుమాన్ ఆలయంలో ఆశీర్వాదం తీసుకుని బయటకు వస్తున్నప్పుడు కూడా విజయ్.. రష్మిక వెనకాలే ఉంటూ ఆమెను చాలా కేరింగ్గా పట్టుకున్నాడు. ఒక వీడియోలో అయితే.. ఆ కపుల్ దగ్గరికి వెళ్లడానికి పెద్ద ఎత్తున జనం తోసుకుంటూ వస్తుంటే.. సెక్యూరిటీ వాళ్లను దూరంగా ఉంచుతూ కనిపించారు. కారు దగ్గరికి వెళ్లే టైమ్లో జనం దాదాపు మీద పడిపోతుండటంతో విజయ్ ఫేస్లో ఒక క్షణం టెన్షన్ కూడా కనిపించింది. జనం వాళ్లను టచ్ చేయడానికి ట్రై చేస్తుంటే, రష్మిక సేఫ్గా కారు ఎక్కేంతవరకు విజయ్ ఆమెకు అడ్డుగా నిలబడ్డాడు.
రణబాలి సెట్స్లో గ్రాండ్ వెల్కమ్..
గుడి దర్శనం పూర్తయిన తర్వాత రష్మిక, విజయ్ ఇద్దరూ మళ్లీ షూటింగ్ కంటిన్యూ చేయడానికి రణబాలి సెట్స్కు వెళ్లారు. టెంపుల్ దగ్గర అంత రద్దీలో ఇరుక్కున్నప్పటికీ, సెట్స్కు వెళ్లేసరికి వాళ్లు చాలా కూల్గా కనిపించారు. అక్కడ వాళ్లకు మహిళలు సంప్రదాయబద్ధంగా హారతి ఇచ్చి, ఆ తర్వాత వాళ్ల నుదుటిన కుంకుమ బొట్టు పెట్టి అదిరిపోయే వెల్కమ్ చెప్పారు. ఆ టైమ్లో రష్మిక ఒక్కసారిగా పైకి చూసి విజయ్కి స్వీట్గా స్మైల్ ఇవ్వడం ఒక పాపరాజీ కెమెరాలో భలేగా రికార్డ్ అయింది.
శ్యామ్ సింగ రాయ్ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ డైరెక్ట్ చేస్తున్న రణబాలి విషయానికొస్తే.. ఇదొక హిస్టారికల్ యాక్షన్ డ్రామా. 1854 నుంచి 1878 మధ్య కాలంలో జరిగే కథ ఇది. వలస పాలనపై పోరాటం, అలాగే గ్రేట్ ఇండియన్ ఫామిన్ (కరువు) బ్యాక్డ్రాప్లో ఈ సినిమా సాగుతుంది. ఇందులో విజయ్ టైటిల్ రోల్ చేస్తుండగా, రష్మిక అతని భార్య జయమ్మ క్యారెక్టర్లో నటిస్తోంది. ద మమ్మీ సినిమాతో వరల్డ్వైడ్గా పాపులర్ అయిన ఆర్నాల్డ్ వోస్లూ ఇందులో విలన్గా చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
విజయ్, రష్మిక నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఇవే..
గీత గోవిందం (2018), డియర్ కామ్రేడ్ (2019) సినిమాల తర్వాత విజయ్, రష్మిక కలిసి నటిస్తున్న మూడో సినిమా ఈ రణబాలి. పెళ్లయిన తర్వాత వీళ్లిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న ఫస్ట్ ఫిల్మ్ కూడా ఇదే కావడం విశేషం. ఈ సినిమా సెప్టెంబర్ 11న థియేటర్లలోకి రాబోతోంది.
ఇది కాకుండా రష్మిక చేతిలో హిందీలో కాక్టెయిల్ 2, తెలుగులో మైసా లాంటి ప్రాజెక్టులు ఉండగా.. విజయ్ తెలుగులో రౌడీ జనార్దన అనే సినిమా చేస్తున్నాడు. గత ఏడాది అక్టోబర్లో ఎంగేజ్మెంట్ చేసుకున్న విజయ్, రష్మిక జంట.. ఈ ఫిబ్రవరిలో ఉదయ్పూర్లో ఎంతో గ్రాండ్గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


