Vishnu Vinyasam OTT: సర్ప్రైజ్.. ఓటీటీలోకి మూడు వారాల్లోనే శ్రీవిష్ణు కామెడీ మూవీ.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్
Vishnu Vinyasam OTT: శ్రీవిష్ణు నటించిన తెలుగు కామెడీ మూవీ విష్ణు విన్యాసం మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఏకంగ ఐదు భాషల్లో స్ట్రీమింగ్ కు వచ్చేయడం విశేషం.
Vishnu Vinyasam OTT: టాలీవుడ్ యువ హీరో శ్రీ విష్ణు నటించిన మరో కామెడీ మూవీ విష్ణు విన్యాసం. ఫిబ్రవరి 27న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. శుక్రవారం (మార్చి 20) అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి అడుగుపెట్టింది. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లోనూ ఒకేసారి స్ట్రీమింగ్ కు వచ్చింది.

విష్ణు విన్యాసం ఓటీటీ
శ్రీవిష్ణు, నయన్ సారిక లీడ్ రోల్స్ లో నటించిన మూవీ విష్ణు విన్యాసం. యదునాథ్ మారుతి రావు డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా మూడు వారాల్లోనే డిజిటల్ ప్రీమియర్ అయింది. సడెన్ గా శుక్రవారం నుంచే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ మొదలైంది. నిజానికి దీనికి సంబంధించిన ముందస్తు సమాచారం ఏమీ లేదు. థియేటర్లలో ఈ సినిమాకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు. దీంతో ఊహించినదాని కంటే ముందుగానే ఓటీటీలోకి అడుగుపెట్టింది.
విష్ణు విన్యాసం మూవీ విశేషాలు
టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని పేరు తెచ్చుకున్న యంగ్ హీరో శ్రీవిష్ణు నటించి లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ మూవీ విష్ణు విన్యాసం. ఇదొక రొమాంటిక్ కామెడీ మూవీ. శ్రీవిష్ణు మార్క్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా పెద్దగా మెప్పించలేకపోయింది. ఈ మూవీ కథ విషయానికి వస్తే.. ఇందులో జాతకాల పిచ్చి బాగా ఉన్న చిన్ను అనే జూనియర్ లెక్చరర్ పాత్రలో శ్రీవిష్ణు నటించాడు.
తన కాలేజీలోనే పని చేసే మనీషా (నయన్ సారిక)ను ప్రేమించినా.. ఆమె జాతకంలో దోషం వల్ల పెళ్లికి చిన్ను వెనుకాడతాడు. కానీ అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. మరి ఆ తర్వాత ఏమైంది? మనీషాకు ఉన్న జాతక దోషం ఏంటీ? దోషం ఉందని తెలిసి కూడా విష్ణు ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఇద్దరి జీవితంలో ఎదురైన పరిస్థితులు ఏంటీ? చివరికి ఏం జరిగింది అనే విషయాలు తెలియాలంటే? విష్ణు విన్యాసం చూడాల్సిందే.
పెద్దగా అంచనాలు లేకుండా కేవలం కాసేపు నవ్వుకోవడానికి అయితే ఈ సినిమాను చూడొచ్చు. థియేటర్లలో మిస్ అయిన వాళ్లు ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులో ఉన్న విష్ణు విన్యాసం మూవీని చూడొచ్చు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్డేట్స్ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


