హైదరాబాద్కు దీటుగా అమరావతిలో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి చేస్తాం : మంత్రి దుర్గేష్
ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేయడానికి ఏప్రిల్ నుండి ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రారంభిస్తామని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఏప్రిల్ నుండి ఇందుకోసం అవసరమైన కార్యాచరణను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్-2026 పోటీల్లో గెలుపొందిన విజేతలను సత్కరించారు మంత్రి. అవార్డు గ్రహీతలకు జ్ఞాపికలు అందజేశారు. సామాజిక స్పృహతో లఘ చిత్రాలు రూపొందించిన యువదర్శకులు, సాంకేతిక నిపుణులు, నటీనటులను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు.

ఏపీ చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధిలో భాగంగా జనవరి 11న రాష్ట్రస్థాయిలో ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా ప్రతిష్టాత్మకంగా తెనాలిలో ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ - 2026 ను విజయవంతంగా నిర్వహించినందుకు ఆంధ్ర ప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీల నిర్వాహకుడు, మా-ఏపీ వ్యవస్థాపకులు, సినీదర్శకులు దిలీప్ రాజా కృషిని కొనియాడారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో చర్చించి త్వరలోనే నంది అవార్డులు, నంది నాటకోత్సవాల నిర్వహణపై ప్రకటన చేస్తామన్నారు.
'హైదరాబాద్కు దీటుగా అమరావతిని సినిమా రంగానికి కేంద్రబిందువుగా మార్చాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉంది. సామాజిక చైతన్యంతో కూడినటువంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకులు దిలీప్ రాజా ఏపీలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి చేయాలని నిరంతరం తపిస్తున్నారు. సినిమా రంగం అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది.' అని మంత్రి దుర్గేష్ అన్నారు.
కేవలం ఆంధ్రప్రదేశ్లోని ఔత్సాహిక కళాకారులను మాత్రమే ప్రోత్సహించేందుకు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 203 షార్ట్ ఫిల్మ్ ఎంట్రీలురాగా 2 వేల మంది నటీనటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నానికి చెందిన చంద్రశేఖర్ శకునాల తీసిన మహావృక్షం ప్రథమ బహుమతిని పొందగా శ్రీకాకుళానికి చెందిన శ్రీనివాసరావు సింహాద్రి అప్పన్న ద్వితీయ బహుతిని, పాలకొల్లుకు చెందిన నవీన్ కుమార్ ' అబద్దం వర్సెస్ నిజం' తృతీయ బహుమతిని పొందింది. ఈ సందర్భంగా మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు లక్ష రూపాయల నగదును అందించారు.
ఈ సందర్భంగా దర్శకులు దిలీప్ రాజా మాట్లాడుతూ ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే ఏపీ యువత అద్భుతాలు సృష్టించగలరని, ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ వారిలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని అన్నారు. మరింత ప్రోత్సాహం అందిస్తే ఎవరెస్ట్ నైనా ఎక్కగలమనే దృఢ సంకల్పాన్ని విజేతల్లో నింపామని దిలీప్ రాజా పేర్కొన్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్సైట్స్ లాంచ్ టీమ్లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


