...
...
Next Story

వెనక్కి తగ్గేదే లేదు.. ధురంధర్ 2ని చూసి భయపడటం లేదు.. కానీ వాళ్లు ఒక్క ఫోన్ అయినా చేసి ఉండాల్సింది: యష్ కామెంట్స్

మార్చి నెలలో బాక్సాఫీస్ వద్ద ఒక భారీ క్లాష్‌ జరగబోతోంది. కన్నడ సూపర్ స్టార్ యష్ నటించిన 'టాక్సిక్', బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్: ది రివెంజ్' సినిమాలు ఒకే రోజున విడుదలవుతున్నాయి. అయితే ఈ విషయంలో యష్ చాలా అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Published on: Feb 16, 2026, 19:08:00 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

మార్చి నెలలో సినీ ప్రేమికులకు పండగే అని చెప్పాలి. ఎందుకంటే రెండు భారీ సినిమాలు ఒకే రోజున థియేటర్లలో తలపడబోతున్నాయి. యష్ (Yash) నటించిన 'టాక్సిక్: ఏ ఫెయిరీటెల్ ఫర్ గ్రోన్ అప్స్', రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్: ది రివెంజ్' సినిమాలు మార్చి 19న విడుదల కానున్నాయి. అయితే ఈ క్లాష్ విషయంలో యష్ సంతోషంగా లేడని, బాలీవుడ్ మేకర్స్ తీరుపై అతడు గుర్రుగా ఉన్నాడని 'వెరైటీ ఇండియా' రిపోర్టు వెల్లడించింది.

యష్ ఎందుకు సీరియస్ అయ్యాడంటే?

వెనక్కి తగ్గేదే లేదు.. ధురంధర్ 2ని చూసి భయపడటం లేదు.. కానీ వాళ్లు ఒక్క ఫోన్ అయినా చేసి ఉండాల్సింది: యష్ కామెంట్స్
వెనక్కి తగ్గేదే లేదు.. ధురంధర్ 2ని చూసి భయపడటం లేదు.. కానీ వాళ్లు ఒక్క ఫోన్ అయినా చేసి ఉండాల్సింది: యష్ కామెంట్స్

సినీ వర్గాల సమాచారం ప్రకారం.. యష్ తన సినిమా కంటెంట్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాడు. 'ధురంధర్ 2' పోటీకి వచ్చినా అతడు భయపడటం లేదు, అందుకే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. కానీ అతని అసహనానికి అసలు కారణం వేరే ఉంది.

'టాక్సిక్' సినిమా విడుదల తేదీని మూడు సంవత్సరాల కిందటే (డిసెంబర్ 2023లో) ప్రకటించారు. కానీ 'ధురంధర్' మేకర్స్ ఇప్పుడు అదే తేదీని ఎంచుకున్నారు. కనీసం మర్యాదపూర్వకంగానైనా యష్ టీమ్‌కు ఫోన్ చేసి చెప్పలేదని సమాచారం.

దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో ఒకే తేదీన సినిమాలు విడుదల చేయాల్సి వస్తే, నిర్మాతలు ఒకరితో ఒకరు మాట్లాడుకుని సర్దుబాటు చేసుకుంటారు. కానీ బాలీవుడ్‌లో అలాంటి సంస్కృతి లేదని, కమ్యూనికేషన్ లోపించిందని యష్ టీమ్ భావిస్తోంది. తన ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారని, వారిని నిరాశపరచకూడదనే యష్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

'టాక్సిక్' విశేషాలు..

గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో భారీ తారాగణమే ఉంది. యష్‌తో పాటు కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.

2025లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ 'ధురంధర్'కు ఇది సీక్వెల్. ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రణవీర్ సింగ్ హమ్‌జా అనే పాత్రలో కనిపిస్తాడు. పాకిస్థాన్‌లోని ఒక క్రిమినల్ సిండికేట్‌ను టేకోవర్ చేయడం, అర్జలన్ రాంపాల్ పాత్రతో తలపడటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

ఇందులో రణవీర్ సింగ్‌తో పాటు అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, రాకేష్ బేడి, సారా అర్జున్ తమ పాత్రలను తిరిగి పోషిస్తున్నారు. యామీ గౌతమ్ అతిథి పాత్రలో మెరవనుంది. మరి ఈ రెండు సినిమాల పోటీలో ఎవరు పైచేయి సాధిస్తారు? యష్ టాక్సిక్ విజేతగా నిలుస్తుందా లేక ధురంధర్ కు వచ్చిన క్రేజ్ తో సీక్వెల్ అంచనాలను అందుకొని మరోసారి బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తుందా అనేది చూడాలి.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe