మార్చి నెలలో సినీ ప్రేమికులకు పండగే అని చెప్పాలి. ఎందుకంటే రెండు భారీ సినిమాలు ఒకే రోజున థియేటర్లలో తలపడబోతున్నాయి. యష్ (Yash) నటించిన 'టాక్సిక్: ఏ ఫెయిరీటెల్ ఫర్ గ్రోన్ అప్స్', రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్: ది రివెంజ్' సినిమాలు మార్చి 19న విడుదల కానున్నాయి. అయితే ఈ క్లాష్ విషయంలో యష్ సంతోషంగా లేడని, బాలీవుడ్ మేకర్స్ తీరుపై అతడు గుర్రుగా ఉన్నాడని 'వెరైటీ ఇండియా' రిపోర్టు వెల్లడించింది.
యష్ ఎందుకు సీరియస్ అయ్యాడంటే?

సినీ వర్గాల సమాచారం ప్రకారం.. యష్ తన సినిమా కంటెంట్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాడు. 'ధురంధర్ 2' పోటీకి వచ్చినా అతడు భయపడటం లేదు, అందుకే వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. కానీ అతని అసహనానికి అసలు కారణం వేరే ఉంది.
'టాక్సిక్' సినిమా విడుదల తేదీని మూడు సంవత్సరాల కిందటే (డిసెంబర్ 2023లో) ప్రకటించారు. కానీ 'ధురంధర్' మేకర్స్ ఇప్పుడు అదే తేదీని ఎంచుకున్నారు. కనీసం మర్యాదపూర్వకంగానైనా యష్ టీమ్కు ఫోన్ చేసి చెప్పలేదని సమాచారం.
దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో ఒకే తేదీన సినిమాలు విడుదల చేయాల్సి వస్తే, నిర్మాతలు ఒకరితో ఒకరు మాట్లాడుకుని సర్దుబాటు చేసుకుంటారు. కానీ బాలీవుడ్లో అలాంటి సంస్కృతి లేదని, కమ్యూనికేషన్ లోపించిందని యష్ టీమ్ భావిస్తోంది. తన ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారని, వారిని నిరాశపరచకూడదనే యష్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
'టాక్సిక్' విశేషాలు..
గీతూ మోహన్దాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియడ్ గ్యాంగ్స్టర్ డ్రామాలో భారీ తారాగణమే ఉంది. యష్తో పాటు కియారా అద్వానీ, నయనతార, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
ఇటీవల విడుదలైన టీజర్లోని ఒక ఇంటిమేట్ సీన్ వివాదానికి దారితీసింది. ఇది క్రైస్తవ మత మనోభావాలను దెబ్బతీసిందంటూ ఒక క్రిస్టియన్ గ్రూప్ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. 'కేజీఎఫ్ 2' తర్వాత యష్ నటిస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ మాత్రం భారీ అంచనాలతో ఉన్నారు.
'ధురంధర్ 2' విశేషాలు..
{{/usCountry}}ఇటీవల విడుదలైన టీజర్లోని ఒక ఇంటిమేట్ సీన్ వివాదానికి దారితీసింది. ఇది క్రైస్తవ మత మనోభావాలను దెబ్బతీసిందంటూ ఒక క్రిస్టియన్ గ్రూప్ సెన్సార్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. 'కేజీఎఫ్ 2' తర్వాత యష్ నటిస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ మాత్రం భారీ అంచనాలతో ఉన్నారు.
'ధురంధర్ 2' విశేషాలు..
{{/usCountry}}2025లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ 'ధురంధర్'కు ఇది సీక్వెల్. ఆదిత్య ధర్ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్లో రణవీర్ సింగ్ హమ్జా అనే పాత్రలో కనిపిస్తాడు. పాకిస్థాన్లోని ఒక క్రిమినల్ సిండికేట్ను టేకోవర్ చేయడం, అర్జలన్ రాంపాల్ పాత్రతో తలపడటం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
ఇందులో రణవీర్ సింగ్తో పాటు అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, రాకేష్ బేడి, సారా అర్జున్ తమ పాత్రలను తిరిగి పోషిస్తున్నారు. యామీ గౌతమ్ అతిథి పాత్రలో మెరవనుంది. మరి ఈ రెండు సినిమాల పోటీలో ఎవరు పైచేయి సాధిస్తారు? యష్ టాక్సిక్ విజేతగా నిలుస్తుందా లేక ధురంధర్ కు వచ్చిన క్రేజ్ తో సీక్వెల్ అంచనాలను అందుకొని మరోసారి బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తుందా అనేది చూడాలి.