Toxic OTT: కేజీఎఫ్ ఛాప్టర్ 2తో ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన రాకింగ్ స్టార్ యశ్ లేటెస్ట్ ప్యాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' మేకర్స్కు కోలుకోలేని షాక్ తగిలింది. థియేటర్లలో బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచిన ఈ సినిమా.. డిజిటల్, శాటిలైట్ హక్కులు అమ్ముడుపోక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. విడుదలకి ముందు రూ. 200 కోట్లు డిమాండ్ చేసిన నిర్మాతలకు ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కేవలం రూ. 30 కోట్లు మాత్రమే ఆఫర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
150 కోట్ల ఆఫర్ను తిరస్కరించి కొంపముంచుకున్న మేకర్స్

థియేట్రికల్ రిలీజ్కి ముందు 'టాక్సిక్' సినిమాపై ఉన్న విపరీతమైన అంచనాల నేపథ్యంలో ఒక ప్రముఖ లీడింగ్ ఓటీటీ సంస్థ ఏకంగా రూ. 150 కోట్ల భారీ ఆఫర్తో ముందుకు వచ్చింది. అయితే తమ సినిమా కచ్చితంగా ఆల్-టైమ్ బ్లాక్బస్టర్ హిట్ అవుతుందని, రిలీజ్ తర్వాత రూ. 200 కోట్లకు పైగా డిజిటల్ డీల్ వర్కౌట్ చేయవచ్చని మేకర్స్ ఆ ఆఫర్ను నిర్దాక్షిణ్యంగా తిరస్కరించినట్లు బాలీవుడ్ మీడియా వర్గాలు వెల్లడించాయి.
తీరా సినిమా థియేటర్లలోకి వచ్చాక ఆడియన్స్ నుంచి తీవ్రమైన నెగటివ్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడింది. కేజీఎఫ్ సిరీస్తో సంపాదించుకున్న భారీ ఇమేజ్తో పాన్ ఇండియా మార్కెట్ను ఏలాలని చూసిన యశ్ కి ఈ ఘోర పరాజయం ఊహించని షాక్ ఇచ్చింది.
30 కోట్లకు పడిపోయిన డిజిటల్ వాల్యూ.. రేసులో జీ5?
సినిమా థియేట్రికల్ రిజల్ట్ తేడా కొట్టడంతో ఓటీటీ డిజిటల్ సంస్థలు తమ ఆఫర్లను దారుణంగా తగ్గించేశాయి. ప్రస్తుతం అత్యధికంగా 'జీ5' (Zee5) సంస్థ కేవలం రూ. 30 కోట్ల వరకు డిజిటల్ హక్కుల కోసం ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
చేసిన భారీ పెట్టుబడుల్లో కనీస నష్టాలను పూడ్చుకోవడానికి నిర్మాతలు ఇప్పుడు ఈ ఆఫర్కే అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు రూ. 200 కోట్ల రేంజ్ అనుకున్న డీల్.. ఇప్పుడు రూ. 30 కోట్లకు పడిపోవడం యశ్ అభిమానులను సైతం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
'A' సర్టిఫికేట్ వల్ల శాటిలైట్ హక్కులకు కూడా భారీ కోత
{{/usCountry}}చేసిన భారీ పెట్టుబడుల్లో కనీస నష్టాలను పూడ్చుకోవడానికి నిర్మాతలు ఇప్పుడు ఈ ఆఫర్కే అంగీకరించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు రూ. 200 కోట్ల రేంజ్ అనుకున్న డీల్.. ఇప్పుడు రూ. 30 కోట్లకు పడిపోవడం యశ్ అభిమానులను సైతం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
'A' సర్టిఫికేట్ వల్ల శాటిలైట్ హక్కులకు కూడా భారీ కోత
{{/usCountry}}ఓటీటీ డిజిటల్ రైట్స్ మాత్రమే కాదు, టీవీ శాటిలైట్ రైట్స్ విషయంలోనూ మేకర్స్కు పెద్ద చిక్కే వచ్చిపడింది. సినిమాలో మోతాదుకు మించిన వయొలెన్స్, అడల్ట్ కంటెంట్ ఉండటంతో సెన్సార్ బోర్డ్ 'A' (అడల్ట్) సర్టిఫికేట్ ఇచ్చింది.
దీంతో ప్రముఖ టీవీ ఛానెళ్లు ఈ సినిమా శాటిలైట్ హక్కులను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ టీవీల్లో చూసే అవకాశం లేకపోవడంతో శాటిలైట్ రైట్స్ నుంచి వచ్చే రాబడి కూడా చాలా పరిమితంగానే ఉండబోతోందని స్పష్టమవుతోంది.
అండర్గ్రౌండ్లోకి వెళ్లిన రాకింగ్ స్టార్ యవ్
'కేజీఎఫ్ 2' తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకుని గీతూ మోహన్దాస్ దర్శకత్వంలో యశ్ ప్లాన్ చేసిన ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇలా డిజాస్టర్గా మారడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా ప్రమోషన్ల సమయంలో ఎంతో కాన్ఫిడెంట్గా కనిపించిన యశ్.. ప్రస్తుతం ఎక్కడా పబ్లిక్గా కనిపించకుండా సైలెంట్గా ఉండిపోయారు.
సోషల్ మీడియాలో, బహిరంగ కార్యక్రమాల్లో ఆయన కనిపించకపోవడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. రాబోయే ప్రాజెక్టుల విషయంలోనైనా కథల ఎంపికలో యశ్ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు.