సోషల్ మీడియాలో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై చర్చలు జరగడం కొత్తేమీ కాదు. గతేడాది నటుడు జాయెద్ ఖాన్ తల్లి, మాజీ నటి జరీన్ ఖాన్ ముంబైలో కన్నుమూశారు. అయితే, ఆమె అంత్యక్రియలను జాయెద్ ఖాన్ హిందూ సంప్రదాయం ప్రకారం నిర్వహించడం అప్పట్లో పెద్ద దుమారం రేపింది.

పార్సీ మూలాలు ఉండి, ముస్లిం కుటుంబంలోకి కోడలిగా వచ్చిన ఆమెకు హిందూ పద్ధతిలో వీడ్కోలు పలకడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. తాజాగా ఈ విమర్శలపై జాయెద్ ఖాన్ పెదవి విప్పారు.
అమ్మ స్వేచ్ఛను కోరుకుంది!
ఒక ఇంటర్వ్యూలో జాయేద్ ఖాన్ మాట్లాడుతూ తన తల్లి చివరి కోరిక గురించి గుర్తుచేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. "ఒకసారి అమ్మ ఒక అందమైన నది ఒడ్డున కూర్చుని ఉన్నప్పుడు.. ఒక ఆలోచన ఆమె మెదడులోకి వచ్చింది. 'నేను ఒకవేళ చనిపోతే, నా అస్థికలు ఈ నదిలో కలిసిపోవాలి.. నేను స్వేచ్ఛగా ఉండాలి' అని జరీన్ ఖాన్ తన మనసులో మాటను బయటపెట్టారు. ఒక బిడ్డగా తల్లి చివరి కోరికను నెరవేర్చడం నా బాధ్యత. మిగతా ప్రపంచం ఏమనుకుంటుంది, ఎంత ద్వేషాన్ని చిమ్ముతుంది అనేది నాకు అనవసరం" అని జాయెద్ స్పష్టం చేశారు.
మా ఇంట్లో మతం కంటే 'మానవత్వానికే' ప్రాధాన్యం
తమ కుటుంబం గురించి ప్రస్తావిస్తూ.. మతం అనేది చాలా వ్యక్తిగతమైన విషయమని జాయెద్ పేర్కొన్నారు. "మా ఇంట్లో 'ఇన్సానియత్' (మానవత్వం) కన్నా గొప్ప మతం ఏదీ లేదు. మేమంతా లౌకికవాదాన్ని నమ్ముతాము. మా దగ్గర పనిచేసే సిబ్బంది కూడా భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చినవారే. మతం అనేది ఒకరు మరొకరి కంటే గొప్ప అని చెప్పుకోవడానికి కాదు. ప్రస్తుత పరిస్థితుల వల్ల కొందరు విమర్శలు చేస్తున్నారు, ఆ పరిస్థితులు మారడానికి సమయం పడుతుంది" అని జాయేద్ ఖాన్ వివరించారు.
జరీన్ ఖాన్ ప్రస్థానం
గతేడాది నవంబర్ 7న జరీన్ ఖాన్ (81) వయోభారంతో ముంబైలో తుదిశ్వాస విడిచారు. 1963లో దేవ్ ఆనంద్ సరసన 'తేరే ఘర్ కే సామ్నే' చిత్రంలో నటించిన జరీన్ ఖాన్ 1966లో నటుడు సంజయ్ ఖాన్ను వివాహం చేసుకున్నారు. వీరికి జాయెద్ ఖాన్తో పాటు సుసానే ఖాన్, ఫరా ఖాన్, సీమోన్ అరోరా అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
{{/usCountry}}గతేడాది నవంబర్ 7న జరీన్ ఖాన్ (81) వయోభారంతో ముంబైలో తుదిశ్వాస విడిచారు. 1963లో దేవ్ ఆనంద్ సరసన 'తేరే ఘర్ కే సామ్నే' చిత్రంలో నటించిన జరీన్ ఖాన్ 1966లో నటుడు సంజయ్ ఖాన్ను వివాహం చేసుకున్నారు. వీరికి జాయెద్ ఖాన్తో పాటు సుసానే ఖాన్, ఫరా ఖాన్, సీమోన్ అరోరా అనే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
{{/usCountry}}మరణానికి కొన్ని నెలల ముందే సంజయ్, జరీన్ దంపతులు తమ 59వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోవడం గమనార్హం. మతం కంటే మనిషి కోరికకే విలువనిచ్చిన జాయెద్ ఖాన్ నిర్ణయాన్ని ఇప్పుడు చాలామంది అభినందిస్తున్నారు.