మీ దంతాలు పాడవుతున్నాయా....? అయితే ఈ 7 అలవాట్లను మానుకోవాల్సిందే

దంతాల నలుపు, పుచ్చిపోవడానికి కేవలం పురుగులు మాత్రమే కారణం కాదు. మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని రోజువారీ అలవాట్లు దంతాల పైపొర అయిన ఎనామెల్‌ను నాశనం చేస్తున్నాయి. మీ దంతాలు పాడవుతున్నాయా....? అయితే ఈ 7 అలవాట్లను మానుకోవాల్సిందే

Published on: Jun 10, 2026, 12:07:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అందమైన చిరునవ్వుకు మిలమిలలాడే తెల్లటి దంతాలు ఎంతో ముఖ్యం. అయితే చాలా మందిలో ముందు దంతాలు నల్లగా మారడం, మురికి పట్టినట్లు అసహ్యకరమైన పసుపు రంగులోకి మారడం మనం చూస్తుంటాం. దంత క్షయానికి కేవలం పంటి పురుగులు లేదా క్యావిటీలు మాత్రమే కారణం అనుకుంటే పొరపాటే. దీని వెనుక మన దైనందిన జీవితంలో భాగమైన కొన్ని చెడు అలవాట్లు దాగి ఉన్నాయి.

దంతాలు పాడుచేసే ఆ 7 అలవాట్లు (image source Pixel)
దంతాలు పాడుచేసే ఆ 7 అలవాట్లు (image source Pixel)

సాధారణంగా పళ్లలో నొప్పి లేదా ఏదైనా తీవ్రమైన అసౌకర్యం కలగనంత వరకు చాలా మంది దంతాల ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తారు. కానీ, కొన్ని అలవాట్లు లోపలి నుండి దంతాలను క్రమక్రమంగా అరిగేలా చేస్తాయి. దీనివల్ల పళ్లు బలహీనపడి, ఊడిపోయే స్థితికి చేరుకుంటాయి. దంత వైద్యులు ఎల్లప్పుడూ హెచ్చరించే, వెంటనే మానుకోవాల్సిన ఆ 7 అలవాట్లు ఇవే…

గట్టిగా, ఎక్కువ సమయం బ్రష్ చేయడం

కొంతమంది దంతాలు తెల్లగా మెరవాలనే ఆరాటంతో బ్రష్‌ను పళ్లపై వేసి గట్టిగా రుద్దుతుంటారు. అలాగే ఎక్కువ సమయం పాటు బ్రష్ చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. ఇలా చేయడం వల్ల దంతాలను రక్షించే పైపొర అయిన 'ఎనామెల్' పూర్తిగా అరిగిపోతుంది. ఫలితంగా దంతాలలో సున్నితత్వం (Sensitivity) ఏర్పడి, చల్లటి లేదా వేడి పదార్థాలు తిన్నప్పుడు పళ్లు గుంజడం ప్రారంభమవుతుంది.

దంతాలను ఓపెనర్‌లా వాడటం

పళ్లను కేవలం ఆహారం నమలడానికి మాత్రమే ఉపయోగించాలి. కానీ చాలా మంది దంతాలను కత్తెరలానో, క్యాప్ ఓపెనర్ లానో భావిస్తుంటారు. దంతాలతో కూల్‌డ్రింక్ బాటిల్ మూతలు తీయడం, ప్లాస్టిక్ ప్యాకెట్లు లేదా చిప్స్ ప్యాకెట్లను చింపడం, టేపులను కత్తిరించడం వంటి పనులు చేస్తుంటారు. ఈ ఒత్తిడి వల్ల దంతాలపై మైక్రో ఫ్రాక్చర్స్ (చిన్న పగుళ్లు) ఏర్పడి పళ్లు ముక్కలయ్యే ప్రమాదం ఉంది.

రోజంతా స్నాక్స్, కాఫీ, టీలు తీసుకోవడం

రోజంతా ఏదో ఒకటి తింటూనే ఉండటం లేదా పదే పదే టీ, కాఫీలు తాగడం పళ్లకు అస్సలు మంచిది కాదు. మనం తిన్న ప్రతిసారీ నోటిలో యాసిడ్స్ (ఆమ్లాలు) విడుదలవుతాయి. నిరంతరం స్నాక్స్ తినడం వల్ల ఈ యాసిడ్ ఉత్పత్తి నిరంతరాయంగా సాగి, ఎనామెల్ పొరను కరిగించివేస్తుంది. దీనివల్ల దంతాలు లోపలి నుంచి గుల్లగా మారిపోతాయి.

ఆమ్ల పానీయాలు తాగడం

సోడాలు, కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ వంటి పానీయాలు తాగడం వల్ల శరీర ఆరోగ్యమే కాకుండా దంతాల ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. వీటిలో ఉండే అధిక ఆమ్ల గుణాలు దంతాల ఎనామెల్‌ను క్షీణింపజేసి, పిప్పిపళ్లు లేదా క్యావిటీలు వచ్చే ప్రమాదాన్ని వంద శాతం పెంచుతాయి.

నిద్రలో పళ్లు కొరకడం

చాలా మందికి తెలియకుండానే రాత్రి నిద్రలో పళ్లు గట్టిగా కొరికే లేదా రుద్దే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు వల్ల దంతాల పైభాగం అరిగిపోవడమే కాకుండా, చిగుళ్లు తీవ్రంగా గాయపడతాయి. ఇది దవడల కీళ్లపై విపరీతమైన ఒత్తిడిని పెంచి, దీర్ఘకాలిక దవడ నొప్పులకు (Jaw Pain) దారితీస్తుంది.

తిన్న వెంటనే బ్రష్ చేయడం

ఆమ్ల గుణాలు కలిగిన భోజనం లేదా ఏదైనా ఆహారం తిన్న వెంటనే బ్రష్ చేయడం అత్యంత ప్రమాదకరం. మనం తిన్న వెంటనే దంతాల ఎనామెల్ పొర కాస్త మెత్తబడుతుంది. ఆ సమయంలో బ్రష్ చేస్తే ఎనామెల్ సులభంగా ఊడిపోతుంది. కాబట్టి ఏదైనా తిన్న తర్వాత కనీసం 30 నిమిషాలు ఆగి బ్రష్ చేయడం లేదా కేవలం నీటితో నోరు పుక్కిలించడం మంచిది.

ఫ్లాసింగ్ చేయకపోవడం

కేవలం బ్రష్ చేయడంతోనే దంతాల శుభ్రత పూర్తి కాదు. రెండు దంతాల మధ్య ఇరుక్కుపోయిన ఆహార కణాలను బ్రష్ తొలగించలేదు. ఇందుకోసం డెంటల్ ఫ్లాస్ (దారంతో శుభ్రం చేయడం) వాడాలి. ఫ్లాసింగ్ చేయకపోతే ఆ ఆహార కణాలు అక్కడే కుళ్లిపోయి బ్యాక్టీరియా చేరి 'ప్లేక్' లా మారుతుంది. ఇది చిగుళ్ల వ్యాధులకు, దంతాల కుళ్లుడుకు ప్రధాన కారణం అవుతుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More