...
...
Next Story

తగ్గిన బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో రేట్లు ఇవే

అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధరలు క్షీణించడంతో దేశీయంగా బంగారం, వెండి రేట్లు తగ్గాయి. సెప్టెంబరు 11న హైదరాబాద్, న్యూఢిల్లీ సహా వివిధ నగరాల్లో 24K, 22K పసిడి, వెండి లభించే వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Sep 11, 2026, 10:23:53 IST
Advertisement

శుక్రవారం (సెప్టెంబరు 11) దేశీయ రిటైల్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాల నేపధ్యంలో బులియన్ మార్కెట్‌లో ధరలు దిగొచ్చాయి.

గ్లోబల్ మార్కెట్‌లో పసిడి పతనానికి కారణాలివే..

తగ్గిన బంగారం, వెండి ధరలు
తగ్గిన బంగారం, వెండి ధరలు

అమెరికాలో ద్రవ్యోల్బణ గణాంకాలు ఊహించిన దానికంటే ఎక్కువగా నమోదు కావడం, క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం అంతర్జాతీయ మార్కెట్‌ను ప్రభావితం చేశాయి. వచ్చేవారం ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాలు బలపడ్డాయి. మరోవైపు యూఎస్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

"ఇరాన్‌పై ఆర్థిక ఒత్తిడి పెంచడం, యుద్ధం ప్రారంభించడం వల్ల మధ్యంతర ఎన్నికల ఫలితాలపై ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ ఆ నిర్ణయానికే కట్టుబడి ఉండేవాడిని," అని ఫాక్స్ న్యూస్ యాంకర్ లారా ఇంగ్రాహమ్‌తో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించినట్లు సీఎన్‌బీసీ యూఎస్ నివేదించింది.

ఈ పరిణామాల ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర 0.9 శాతం తగ్గి ఔన్సుకు 4,359.19 డాలర్ల వద్దకు చేరుకుంది. యూఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ 1.3 శాతం క్షీణించి 4,402.5 డాలర్ల వద్ద ముగిసింది.

ఎంసీఎక్స్ మార్కెట్ అప్‌డేట్స్

దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లోనూ బంగారం, వెండి ఫ్యూచర్స్ ధరలు క్షీణించాయి. సెప్టెంబరు 11 ఉదయం 9:13 గంటల ప్రాంతంలో ఎంసీఎక్స్ గోల్డ్ ధర 0.76 శాతం తగ్గి 10 గ్రాములకు రూ.1,51,610 వద్ద ట్రేడయింది. ఇక ఎంసీఎక్స్ సిల్వర్ ఫ్యూచర్స్ 1.25 శాతం తగ్గి కిలో రూ.2,30,670 వద్ద నమోదైంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం, వెండి ధరలు

24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,51,650

22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,39,013

999 స్వచ్ఛత గల వెండి (1 కిలో): రూ.2,30,700

న్యూఢిల్లీ:

24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,51,150

22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,38,554

999 స్వచ్ఛత గల వెండి (1 కిలో): రూ.2,30,020

ముంబై:

24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,51,410

22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,38,793

999 స్వచ్ఛత గల వెండి (1 కిలో): రూ.2,30,420

బెంగళూరు:

24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,51,530

22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,38,903

999 స్వచ్ఛత గల వెండి (1 కిలో): రూ.2,30,600

కోల్‌కతా:

24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,51,210

22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,38,609

999 స్వచ్ఛత గల వెండి (1 కిలో): రూ.2,30,030

చెన్నై:

24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,51,850

22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,39,196

999 స్వచ్ఛత గల వెండి (1 కిలో): రూ.2,30,904

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON