Meditation For Stress Relief : ఒత్తిడి, ఆందోళనకు చెక్ - 'ధ్యానం'తో మీ మనసును ప్రశాంతంగా మార్చుకోండిలా!
Meditation For Stress Relief : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి, ఆందోళన సర్వసాధారణమయ్యాయి. వీటికి మందులతో కాకుండా సహజ సిద్ధమైన ధ్యాన ప్రక్రియ ద్వారా చెక్ పెట్టొచ్చు.
Meditation For Stress Relief : నేటి ఆధునిక కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న ప్రధాన సమస్య ఒత్తిడి...! ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత ప్రయత్నించినా ఏదో ఒక రూపంలో ఆందోళన మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే మనసు అశాంతికి లోనవుతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారా…? అయితే మీ మనసు కోరుకునే అసలైన ప్రశాంతతను అందించడానికి 'ధ్యానం' (Meditation) ఒక గొప్ప మార్గదర్శిలా పనిచేస్తుంది.

ఒత్తిడి అనేది మన దైనందిన జీవితంలో ఒక భాగమైపోయిందని, అయితే మనసు నిలకడగా, ప్రశాంతంగా ఉన్నప్పుడే నిజమైన ఉపశమనం లభిస్తుందని ఆత్మన్ అవేర్నెస్ సెంటర్ వ్యవస్థాపకులు హెచ్.హెచ్. గురూజీ సుందర్ వివరించారు. నేటి కాలంలో చాలామంది ఒత్తిడికి తక్షణ పరిష్కారాల కోసం వెతుకుతుంటారని గుర్తు చేశారు.
"ఔషధాల వల్ల తాత్కాలికంగా ఉపశమనం లభించవచ్చు కానీ, అవి సమస్య మూలాలను నయం చేయలేవు. భయం, అతిగా ఆలోచించడం, అంతర్గత స్థిరత్వం లేకపోవడం వల్లే అధిక శాతం ఒత్తిడి పెరుగుతుంది" అని ఆయన పేర్కొన్నారు. బయట ఉన్న పరిస్థితులను నియంత్రించడానికి ప్రయత్నించే కంటే, మన లోపల ఏం జరుగుతుందో గమనించి దాన్ని సరిదిద్దుకోవడానికి ధ్యానం సహాయపడుతుంది.
శక్తినిచ్చే ధ్యాన సాధన…
క్రమం తప్పకుండా ధ్యానం చేయడం వల్ల కష్టమైన పరిస్థితుల నుండి పారిపోవాలనే ఆలోచన రాదు. బదులుగా, ప్రశాంతమైన మనసుతో ఆ సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం పెరుగుతుంది. ఇది కేవలం మనసును శాంతపరచడమే కాకుండా, స్పష్టంగా ఆలోచించే శక్తిని ఇస్తుంది. ఫలితం ఏదైనా సరే కుంగిపోకుండా స్వీకరించే మనస్తత్వాన్ని అలవరుస్తుంది. కాలక్రమేణా ఇది వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తుంది.
ఆజ్ఞా చక్రం…. ఏకాగ్రతకు చిరునామా
ధ్యానంలో అనేక పద్ధతులు ఉన్నప్పటికీ, ‘ఆజ్ఞా చక్రం’పై దృష్టి పెట్టడం అత్యంత ప్రభావవంతమైనది. దీనినే మనం 'మూడో కన్ను' అని కూడా పిలుస్తాం. రెండు కనుబొమ్మల మధ్య ఉండే ఈ కేంద్రంపై ఏకాగ్రత నిలపడం ద్వారా మనసులోని అశాంతి తొలగిపోతుంది. ఇది ఆందోళనను తగ్గించి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అంతర్గత అవగాహన పెరగడం వల్ల మన ఆలోచనలపై, భావోద్వేగాలపై మనకు పట్టు లభిస్తుంది.
శరీరం ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం ఎంత అవసరమో, మనసు దృఢంగా ఉండటానికి నిశ్శబ్దం కూడా అంతే అవసరం. ధ్యానం ఒక అంతర్గత మార్గదర్శిలా పనిచేసి…. మన తప్పులను మనం తెలుసుకునేలా చేస్తుంది. ఇతరులను నిందించకుండా మనల్ని మనం మార్చుకుంటూ ఎదగడానికి ఇది తోడ్పడుతుంది. జీవితంలో సవాళ్లు ఎదురైనప్పుడు బ్యాలెన్స్ తప్పకుండా ముందుకు సాగడానికి ధ్యానం ఒక దివ్యౌషధంలా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

