ఐపీఎల్ 2026 ట్రోఫీని ముద్దాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు కష్టం కేవలం రెండు నెలలు కాదు.. దాని వెనుక 19 ఏళ్ల నిరీక్షణ, గుండెకోత, ఎగతాళి, అవమానాల మధ్య ఒక సామ్రాజ్యాన్ని నిర్మించాలనే పట్టుదల ఉన్నాయి. 2008లో ప్రారంభమైన ఐపీఎల్ ప్రయాణంలో మొదటి 17 ఏళ్లు ఒక్క ట్రోఫీ కూడా లేకపోయినా.. నిన్న రాత్రి గుజరాత్ టైటాన్స్ను మట్టికరిపించి వరుసగా రెండోసారి ట్రోఫీని నిలబెట్టుకునే వరకు ఆర్సీబీ ప్రయాణం స్పోర్ట్స్ హిస్టరీలోనే అత్యంత అద్భుతమైన 'రిడెంప్షన్' (తిరిగి పుంజుకోవడం) స్టోరీగా నిలిచిపోతుంది.
2008 – 2023: చీకటి రోజులు.. బాధలు, అవమానాలు

క్రికెట్ ప్రపంచంలో గెలిచే జట్టును ప్రేమించడం చాలా సులభం.. ఎందుకంటే ఆ జట్టు పర్ఫార్మెన్స్ గురించి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని చెప్పుకోవచ్చు కాబట్టి! కానీ, ఒక జట్టు వరుసగా ఓడిపోతున్నా, ఫైనల్స్ వరకు వచ్చి చేజార్చుకుంటున్నా, పాయింట్ల పట్టికలో అడుగున పడి ఏడుస్తున్నా.. ప్రతి ఏటా కోట్లాది మంది తమ గుండెలకు హత్తుకుని ఆరాధించారంటే, ఆ జట్టు పేరు 'రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు'.
2008లో ఐపీఎల్ ప్రయాణం ప్రారంభమైంది. 2009లో అనిల్ కుంబ్లే సారథ్యంలో ఫైనల్ ఓటమి.. 2011లో డానియల్ వెట్టోరి నాయకత్వంలో చేజారిన కప్పు.. 2016లో విరాట్ కోహ్లీ విశ్వరూపం చూపించినా చేతికి చిక్కని ట్రోఫీ! ఒకవైపు 263 పరుగుల ప్రపంచ రికార్డు.. మరోవైపు 49 పరుగులకే ఆలౌట్ అయిన ఘోర అవమానం. "ఈసాల కప్ నమ్దే" అనే నినాదాన్ని సోషల్ మీడియాలో ట్రోలర్లు ఒక జోక్లా మార్చేశారు. మ్యాచ్ ఓడిపోయిన ప్రతిసారీ ఆర్సీబీ అభిమానులు తలదించుకోవాల్సి వచ్చింది. 'వీళ్లు ఎప్పటికీ గెలవలేరు' అని ప్రపంచం తీర్పు ఇచ్చేసింది. కానీ ఆ విమర్శలన్నింటినీ నవ్వుతూ భరిస్తూ, ఆ నవ్వుల వెనుక ఉన్న కన్నీళ్లను దాచుకుంటూ.. ఆర్సీబీ కేవలం ఒక ఆశతో బతికింది. ఆ ఆశే గత రెండు సీజన్లుగా చరిత్రను సృష్టిస్తోంది.
విరాట్ కోహ్లీ – విధేయతకు, ఒంటరి పోరాటానికి నిలువెత్తు రూపం!
ఈ 19 ఏళ్ల ప్రయాణంలో ఆర్సీబీకి ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ పేరు 'విరాట్ కోహ్లీ'. 2008లో ఒక 19 ఏళ్ల కుర్రాడిగా ఈ జట్టులోకి వచ్చిన కోహ్లీ.. ఈరోజు 37 ఏళ్ల పరిణతి చెందిన సింహంలా నిలిచేవరకు ఆర్సీబీ జెర్సీని ఒక్క క్షణం కూడా వీడలేదు. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్క ఫ్రాంచైజీకి వరుసగా 19 ఏళ్ల పాటు ఆడిన ఏకైక ఆటగాడు మన విరాట్ కోహ్లీ!
{{/usCountry}}ఈ 19 ఏళ్ల ప్రయాణంలో ఆర్సీబీకి ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మ పేరు 'విరాట్ కోహ్లీ'. 2008లో ఒక 19 ఏళ్ల కుర్రాడిగా ఈ జట్టులోకి వచ్చిన కోహ్లీ.. ఈరోజు 37 ఏళ్ల పరిణతి చెందిన సింహంలా నిలిచేవరకు ఆర్సీబీ జెర్సీని ఒక్క క్షణం కూడా వీడలేదు. ఐపీఎల్ చరిత్రలో ఒకే ఒక్క ఫ్రాంచైజీకి వరుసగా 19 ఏళ్ల పాటు ఆడిన ఏకైక ఆటగాడు మన విరాట్ కోహ్లీ!
{{/usCountry}}2016లో చేతికి కుట్లు పడి రక్తం వస్తున్నా సెంచరీ కొట్టిన కోహ్లీని చూశాం.. టీమ్ ఓడిపోతుంటే డగౌట్లో ఒంటరిగా కూర్చుని కళ్లు తుడుచుకున్న కోహ్లీనీ చూశాం. ‘నీకు దండం పెడతాము ఆర్సీబీని వదిలేసి వెళ్లిపో,’ అన్న మాటలూ విన్నాము. వాస్తవానికి ప్రపంచంలో ఏ లీగ్ జట్టు అయినా అతడికి వందల కోట్లు ఇచ్చి కొనుక్కోవడానికి సిద్ధంగా ఉంది. కానీ కోహ్లీ ఒకటే అన్నాడు.. "నా కెరీర్ ముగిసేవరకు నేను ఆర్సీబీ కోసమే ఆడతాను. గెలిచినా ఓడినా నేను ఇక్కడే ఉంటాను."
ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ కోహ్లీ కెరీర్లోనే అత్యంత గొప్ప రాత్రి అని చెప్పుకోవాలి. 37 ఏళ్ల వయసులో, మైదానంలో కండరాలు పట్టిస్తూ తీవ్రమైన నొప్పి వేధిస్తున్నా, రన్నింగ్ చేయలేక ఇబ్బందిపడుతున్నా.. కోహ్లీ క్రీజును వదల్లేదు. కాగిసో రబడా లాంటి ప్రపంచ స్థాయి బౌలర్ వేసిన ఒకే ఓవర్లో 20కిపైగా పరుగులు రాబట్టి, కేవలం 25 బంతుల్లోనే తన కెరీర్ బెస్ట్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించాడు. 75 పరుగులతో అజేయంగా నిలిచి విన్నింగ్ షాట్ కొట్టిన క్షణాలు.. ఆర్సీబీ పట్ల అతని సుదీర్ఘ నమ్మకానికి దక్కిన పరమార్థం!
2025 – 2026: ద గ్రేట్ రెడెంప్షన్.. సామ్రాజ్యం మనదే!
17ఏళ్ల శాపం 2025లో తొలి కప్పుతో చెరిగిపోయింది. కానీ, 'అది ఏదో అదృష్టం కొద్దీ వచ్చింది' అని కొందరు విమర్శించారు. దానికి సమాధానమే నిన్న రాత్రి నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన విధ్వంసం! డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగిన ఆర్సీబీ.. ఈ 2026 సీజన్ అంతటా భయం లేని క్రికెట్ ఆడింది. డిఫెండింగ్ ఛాంపియన్ పేరును కాస్తా అటాకింగ్ ఛాంపియన్గా మార్చేసింది.
రజత్ పటిదార్ అద్భుతమైన కెప్టెన్సీ, రాసిఖ్ సలామ్ దార్ పదునైన బౌలింగ్, వెంకటేష్ అయ్యర్ పవర్ప్లే విధ్వంసం.. అన్నింటికీ మించి కింగ్ కోహ్లీ క్లాస్! గుజరాత్ టైటాన్స్ విసిరిన సవాలును చిత్తు చేస్తూ వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ముంబై, చెన్నైల సరసన నిలిచి బ్యాక్-టు-బ్యాక్ టైటిల్స్ గెలిచిన మహోన్నత శక్తిగా అవతరించింది. ఒకప్పుడు ఎగతాళి చేసిన నోళ్లే.. ఈరోజు ఆర్సీబీ ఆటను చూసి సలాం కొడుతున్నాయి.
ఆర్సీబీ ప్రయాణం.. మన జీవితానికి అమూల్యమైన పాఠం!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రయాణం కేవలం ఒక ఆట కాదు.. అది ప్రతి ఒక్కరి జీవితానికి ఒక గైడ్! మన జీవితంలో కూడా ఎన్నోసార్లు ఓడిపోతుంటాం, పక్కన ఉన్నవాళ్లు చూసి నవ్వుతుంటారు, 'నీ వల్ల కాదు' అని అవమానిస్తుంటారు.
కానీ ఆర్సీబీ మనకు నేర్పిన పాఠం ఒక్కటే:
ఓటమి తాత్కాలికం.. ప్రయత్నం శాశ్వతం: మీరు ఎన్నిసార్లు పడ్డారన్నది ముఖ్యం కాదు.. ఎంత వేగంగా లేచారన్నదే ముఖ్యం. 17 ఏళ్లు ఓడినా 18, 19వసారి కప్పు కొట్టి, ఐపీఎల్ సామ్రాజ్యాన్ని ఏలవచ్చు అని ఆర్సీబీ నిరూపించింది.
కష్టకాలంలో వెనకడుగు వేయకండి: విరాట్ కోహ్లీలాగా పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నా.. మీరు నమ్మిన సిద్ధాంతానికి, మీ జట్టుకు, మీ కలలకు కట్టుబడి ఉండండి. విజయం ఆలస్యమవచ్చేమో కానీ.. రావడం మాత్రం ఖాయం.
ఆర్సీబీ ఫ్యాన్స్... ఇక కాలర్ ఎగరేసి గర్వంగా చెప్పండి.. "ఈసాల కప్ నమ్దే కాదు.. నెక్ట్స్ సాల కూడా మనదే!"