ఉదయాన్నే లేవగానే పొగలు కక్కే వేడివేడి టీ లేదా ఫిల్టర్ కాఫీ తాగడం మన ఇళ్లలో ఒక దినచర్య. ఇరానీ చాయ్ అయినా, కాఫీ అయినా నోరు కాలేంత వేడిగా ఉంటేనే ఆ మజా అనుకుంటారు చాలామంది. అయితే బాగా వేడిగా ఉన్న పానీయాలు తాగడం వల్ల ప్రాణాంతకమైన ఫుడ్పైప్ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం దాదాపు మూడు రెట్లు పెరుగుతుందని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయ తాజా పరిశోధన హెచ్చరిస్తోంది.

యూకే బయోబ్యాంక్, మిలియన్ ఉమెన్ స్టడీ ఆధారంగా దాదాపు 9.8 లక్షల మందిపై 10 ఏళ్లకు పైగా నిర్వహించిన ఈ సుదీర్ఘ అధ్యయన వివరాలను ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్’ ప్రచురించింది. పానీయాలను గోరువెచ్చగా తాగేవారితో పోలిస్తే, బాగా వేడిగా తాగే అలవాటు ఉన్నవారికి 'ఒసోఫాగియల్ స్క్వామస్ సెల్ కార్సినోమా' (ఎస్సీసీ) అనే ఆహారనాళ క్యాన్సర్ వచ్చే ముప్పు మూడు రెట్లు ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు లెక్క తేల్చారు. సాధారణ వేడితో తాగేవారికి కూడా ఈ ప్రమాదం 1.7 రెట్లు పెరుగుతున్నట్లు గుర్తించారు.
రోజుకు ఆరు కప్పులు దాటితే మరింత ప్రమాదం!
కేవలం పానీయాల ఉష్ణోగ్రత మాత్రమే కాకుండా, రోజులో ఎన్నిసార్లు తాగుతున్నారనేది కూడా కీలకమేనని అధ్యయనం వెల్లడించింది. రోజుకు ఆరు లేదా అంతకంటే ఎక్కువ కప్పుల వేడి పానీయాలు తాగే వ్యక్తులకు ఈ క్యాన్సర్ ముప్పు 71 శాతం పెరుగుతోంది. అయితే ఎంత తరచుగా తాగుతున్నామనే దానికంటే పానీయాన్ని ఎంత వేడిగా తాగుతున్నామనేదే ప్రధాన ప్రమాదకారకమని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
టీ, కాఫీల తప్పు కాదు.. ఉష్ణోగ్రతే శాపం!
ఈ పరిశోధన ఫలితాలు టీ లేదా కాఫీ ఆరోగ్యానికి హానికరమని చెప్పడం లేదని పరిశోధకులు విస్పష్టంగా తెలిపారు. "ఫుడ్ పైప్ క్యాన్సర్ రావడానికి టీ, కాఫీలలో ఉండే కాంపౌండ్లు కారణం కాదు. వాటిని తాగే అధిక ఉష్ణోగ్రత మాత్రమే అసలు కారణం," అని పరిశోధన బృందం స్పష్టం చేసింది.
సాధారణంగా 65 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి ఉన్న పానీయాలను తరచుగా తాగినప్పుడు గొంతు నుంచి కడుపులోకి ఆహారాన్ని తీసుకెళ్లే ఆహారనాళం లోపలి సున్నితమైన కణాలు పదేపదే కాలుతాయి. ఈ దెబ్బతిన్న కణాలు కాలక్రమేణా మంటకు (ఇన్ఫ్లమేషన్) గురై, క్యాన్సర్ కణాలుగా మారే అవకాశం ఉంటుంది. గతంలో ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్సీ) కూడా 65 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న పానీయాలను "క్యాన్సర్ కారకాలు"గా వర్గీకరించడం గమనార్హం.
నిపుణుల సూచన..
{{/usCountry}}సాధారణంగా 65 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి ఉన్న పానీయాలను తరచుగా తాగినప్పుడు గొంతు నుంచి కడుపులోకి ఆహారాన్ని తీసుకెళ్లే ఆహారనాళం లోపలి సున్నితమైన కణాలు పదేపదే కాలుతాయి. ఈ దెబ్బతిన్న కణాలు కాలక్రమేణా మంటకు (ఇన్ఫ్లమేషన్) గురై, క్యాన్సర్ కణాలుగా మారే అవకాశం ఉంటుంది. గతంలో ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (ఐఏఆర్సీ) కూడా 65 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న పానీయాలను "క్యాన్సర్ కారకాలు"గా వర్గీకరించడం గమనార్హం.
నిపుణుల సూచన..
{{/usCountry}}హోటళ్లు, చాయ్ కొట్ల వద్ద పొయ్యి మీద నుంచి దించిన వెంటనే పొగలు కక్కే టీని తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. టీ, కాఫీలను కప్పులో పోసుకున్న తర్వాత కనీసం రెండు నుంచి మూడు నిమిషాల పాటు చల్లారనివ్వాలని, అది గోరువెచ్చగా మారిన తర్వాతే తాగాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దీనివల్ల టీ ఇచ్చే రిఫ్రెష్మెంట్ను ఆస్వాదించడంతో పాటు ఫుడ్ పైప్ క్యాన్సర్ ముప్పు నుంచి కాపాడుకోవచ్చు.