పర్యాటకుల డిసెంబర్ డెస్టినేషన్ అయిన గోవాలో అత్యంత ఘోర, విషాదకర సంఘటన చోటుచేసుకుంది! అర్పోరాలోని ఓ రెస్టారెంట్-కమ్- నైట్క్లబ్లో శనివారం అర్థరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 23మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు.

మృతి చెందిన 23 మందిలో ముగ్గురు తీవ్రమైన కాలిన గాయాల కారణంగా చనిపోగా, మిగిలిన వారంతా ఊపిరాడక మరణించారు. మృతుల్లో చాలా మంది క్లబ్కి చెందిన కిచెన్ స్టాఫ్ ఉన్నారు. మరణించిన వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారని, కాగా మరో ముగ్గురు, నలుగురు పర్యాటకులు కూడా ఉన్నారు.
గోవాల అగ్నిప్రమాదానికి కారణం ఏంటి?
గోవా రాజధాని పణాజీకి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్పోరా గ్రామంలో ఈ క్లబ్ గత ఏడాదే ప్రారంభమైంది. అయితే, శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బిర్చ్ బై రోమియో లేన్ అనే ఈ ప్రముఖ పార్టీ వేదికలో మంటలు చెలరేగాయి.
అగ్నిమాపక సిబ్బంది, పోలీసు బృందాలు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ని కొనసాగించాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అధికారులు రాత్రంతా శ్రమించారు.
ఈ అగ్నిప్రమాదం సిలిండర్ పేలుడు కారణంగా జరిగిందని గోవా పోలీస్ చీఫ్ అలోక్ కుమార్ తెలిపారు.
"ఆర్పోరాలోని ఒక రెస్టారెంట్-కమ్-క్లబ్లో దురదృష్టకర సంఘటన జరిగింది. సరిగ్గా 12.04కు కంట్రోల్ రూమ్కి మంటల గురించి సమాచారం వచ్చింది. వెంటనే పోలీసులను, ఫైర్ బ్రిగేడ్, అంబులెన్స్లను సంఘటనా స్థలానికి పంపించాము," అని డీజీపీ వివరించారు.
గోవా సీఎం ఘటనాస్థలానికి వెళ్లి సహాయక చర్యలను పరిశీలించారు.
అగ్నిమాపక భద్రతా నిబంధనలను ఈ నైట్క్లబ్ పాటించలేదని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
"భద్రతా నిబంధనలు పాటించకపోయినా, ఈ క్లబ్ను నడపడానికి అనుమతి ఇచ్చిన అధికారులపైనా, అలాగే క్లబ్ యాజమాన్యంపైనా కఠిన చర్యలు తీసుకుంటాము," అని సావంత్ హెచ్చరించారు.
{{/usCountry}}"భద్రతా నిబంధనలు పాటించకపోయినా, ఈ క్లబ్ను నడపడానికి అనుమతి ఇచ్చిన అధికారులపైనా, అలాగే క్లబ్ యాజమాన్యంపైనా కఠిన చర్యలు తీసుకుంటాము," అని సావంత్ హెచ్చరించారు.
{{/usCountry}}"పర్యాటక ప్రాంతమైన గోవాలో పర్యాటక సీజన్ ఊపందుకున్న సమయంలో ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. మేము దీనిపై సమగ్ర విచారణ జరిపి, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటాం," అని ఆయన పునరుద్ఘాటించారు.
"23 మృతదేహాలను క్లబ్ ప్రాంగణం నుంచి వెలికితీసి, బంబోలిమ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలకు తరలించాము," అని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే మైఖేల్ లోబో వెల్లడించారు.
ఇకపై ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు, గోవాలోని అన్ని క్లబ్లలో అగ్నిమాపక భద్రతా ఆడిట్ నిర్వహిస్తామని ఎమ్మెల్యే లోబో తెలిపారు. అవసరమైతే అనుమతులు లేని క్లబ్ల లైసెన్సులు రద్దు చేస్తామని ఎమ్మెల్యే లోబో స్పష్టం చేశారు.
ఈ సోమవారం రోజున కలంగూట్ పంచాయితీ అన్ని నైట్క్లబ్లకు నోటీసులు జారీ చేయనుంది. అగ్నిమాపక భద్రతకు సంబంధించిన అనుమతులను సమర్పించాల్సిందిగా ఆ నోటీసులలో కోరనున్నారు.