Airtel Plan: ఎయిర్‌టెల్ కస్టమర్లకు షాక్: పాపులర్ ప్లాన్ ధర పెంపు.. ఇక అదనపు భారం తప్పదు

టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ తన 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధరను రూ. 859 నుండి రూ. 899కి పెంచింది. దీనితో పాటు రూ. 799 ప్లాన్‌ను పూర్తిగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు తక్షణమే అమలులోకి వచ్చాయి.

Published on: Apr 20, 2026, 12:30:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ టెలికాం రంగంలో పోటీ పెరుగుతున్నప్పటికీ, కంపెనీలు తమ ఆదాయాన్ని (ARPU) పెంచుకోవడమే లక్ష్యంగా రీఛార్జ్ ధరలను పెంచుకుంటూ పోతున్నాయి. తాజాగా భారతీ ఎయిర్‌టెల్ తన వినియోగదారులకు చడీచప్పుడు లేకుండా షాకిచ్చింది. మధ్యతరగతి వినియోగదారులు ఎక్కువగా ఎంచుకునే 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధరను పెంచడంతో పాటు, ఒక పాపులర్ ప్లాన్‌ను మార్కెట్ నుండి తొలగించింది.

ఎయిర్‌టెల్ లోగో
ఎయిర్‌టెల్ లోగో

పెరిగిన భారం: రూ. 859 ప్లాన్ ఇప్పుడు రూ. 899!

ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ యూజర్లకు అందించే 84 రోజుల ప్లాన్ ధరను పెంచింది. గతంలో ఈ ప్లాన్ రూ. 859 కి లభించేది, కానీ ఇప్పుడు దీని కోసం వినియోగదారులు రూ. 899 చెల్లించాల్సి ఉంటుంది. అంటే నేరుగా రూ. 40 భారం పెరిగింది.

ఈ ప్లాన్ ద్వారా లభించే ప్రయోజనాలు ఇవే:

  • డేటా: ప్రతిరోజూ 1.5GB హై-స్పీడ్ డేటా.
  • కాలింగ్: దేశవ్యాప్తంగా అపరిమిత ఉచిత కాల్స్.
  • SMS: రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు.
  • అదనపు ప్రయోజనాలు: 12 నెలల అడోబ్ ఎక్స్‌ప్రెస్ (Adobe Express) ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, ఉచిత హలో ట్యూన్స్, స్పామ్ అలర్ట్స్.

గమనిక: గతంలో ఈ ప్లాన్‌తో లభించిన 'రివార్డ్స్ మినీ' (RewardsMini) సబ్‌స్క్రిప్షన్‌ను కంపెనీ ఇప్పుడు తొలగించింది.

రూ. 799 ప్లాన్‌కు మంగళం

ధరల పెంపుతో పాటు, ఎయిర్‌టెల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 77 రోజుల వ్యాలిడిటీతో లభించే రూ. 799 ప్లాన్‌ను కంపెనీ పూర్తిగా నిలిపివేసింది. తక్కువ ధరలో ఎక్కువ రోజులు వ్యాలిడిటీ కోరుకునే వారికి ఇది పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పాలి.

జియో, వీ (Vi) లతో పోలిస్తే ఎలా ఉంది?

ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను గమనిస్తే, 84 రోజుల వ్యాలిడిటీతో 1.5GB డేటా ప్లాన్లను జియో, వోడాఫోన్ ఐడియా (Vi) ఇప్పటికీ రూ. 859 కే అందిస్తున్నాయి.

ఫీచర్ఎయిర్‌టెల్రిలయన్స్ జియోవోడాఫోన్ ఐడియా (Vi)
ధరరూ. 899రూ. 859రూ. 859
వ్యాలిడిటీ84 రోజులు84 రోజులు84 రోజులు
డేటా1.5GB / రోజుకు1.5GB / రోజుకు1.5GB / రోజుకు
ప్రత్యేకతలుఅడోబ్ ఎక్స్‌ప్రెస్గూగుల్ AI ప్రో (18 నెలలు), 5TB స్టోరేజ్బింజ్ ఆల్ నైట్ (12AM-6AM), డేటా రోల్‌ఓవర్

రిలయన్స్ జియో తన వినియోగదారులను ఆకర్షించేందుకు 'గూగుల్ ఏఐ ప్రో' (జెమిని ఏఐ) సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందిస్తుండటం గమనార్హం. మరోవైపు, వోడాఫోన్ ఐడియా అర్ధరాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు అపరిమిత ఉచిత డేటాను అందిస్తోంది.

టెలికాం రంగంలో ఏఆర్పీయూ (ARPU - Average Revenue Per User) పెంచుకోవడమే లక్ష్యంగా ఎయిర్‌టెల్ ఈ పెంపును చేపట్టింది. అయితే, పోటీ కంపెనీలు తక్కువ ధరకు అదే ప్రయోజనాలను అందిస్తుండటంతో, ఎయిర్‌టెల్ కస్టమర్లు ఇతర నెట్‌వర్క్‌ల వైపు చూసే అవకాశం లేకపోలేదు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More