పౌరులకు అలర్ట్.. మే 20వ తేదీన దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్

Medical Shops Bundh : దేశంలో మే 20వ తేదీన మెడికల్ షాపులు బంద్ కానున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణపై కూడా బంద్ ప్రభావం ఉంటుంది. అత్యవసరమైన మెడిసిన్‌ను పౌరులు ముందుగానే తెచ్చుకోవడం ఉత్తమం.

Published on: May 15, 2026, 17:48:11 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశంలో మే 20వ తేదీన మెడికల్ షాపులు బంద్ ఉంటాయి. సుమారు 12.40 లక్షలకుపైగా కెమిస్టులు, ఫార్మాస్యూటికల్ డిస్ట్రిబ్యూటర్లు పాల్గొంటారని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ (AIOCD) ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలు, ఫార్మాస్యూటికల్ వ్యాపారానికి సంబంధించిన ఇతర సమస్యలపై 2026 మే 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్‌కు పిలుపునిచ్చారు.

మెడికల్ షాపులు బంద్
మెడికల్ షాపులు బంద్

మధుమేహం, అధిక రక్తపోటు, ఆస్తమా, గుండె జబ్బులు, మూర్ఛ, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న రోగులు అవసరమైన మందులను ముందుగానే కొనుగోలు చేసి, తగినంత నిల్వ ఉంచుకోవాలని సంఘం సూచించింది. అత్యవసర మందులు, ఇన్సులిన్, ఇన్హేలర్లు, పిల్లల మందులు, ఇతర ప్రాణరక్షణ మందులను అందుబాటులో ఉంచుకోవాలని పౌరులకు అఖిల భారత ఔషధ వ్యాపారుల సంఘం విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో భయాందోళనలతో మందులను కొనడం లేదా అనవసరంగా నిల్వ చేయడం వంటివి చేయవద్దని కోరింది.

బంద్ సమయంలో రోగులు నిర్దేశిత మందుల కోసం చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్‌లను వెంట ఉంచుకోవాలని, ఫార్మసీ సిబ్బందికి, అధికారులకు సహకరించాలని సంఘం సభ్యులు సూచించారు. వైద్య అత్యవసర పరిస్థితుల్లో, ప్రజలు తక్షణమే సమీపంలోని ఆసుపత్రులను, అత్యవసర వైద్య సేవలను లేదా ప్రభుత్వ ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను సంప్రదించాలని కోరారు.

బంద్‌లో పాల్గొంటున్న కెమిస్టులు, డ్రగ్గిస్టులు అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలిగించకుండా శాంతియుతంగా, చట్టబద్ధంగా నిరసనలు చేపట్టాలని DCOIWA కోరింది. ప్రజా సంక్షేమం దృష్ట్యా, నిజమైన అత్యవసర పరిస్థితులలో ప్రాణరక్షక మందులను సరఫరా చేయవచ్చని సంఘం పేర్కొంది. రోగులు, అధికారులు లేదా అమలు చేసే ఏజెన్సీలతో ఘర్షణలకు దూరంగా ఉండాలని, అలాగే సోషల్ మీడియా వేదికల ద్వారా పుకార్లు లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని మెడికల్ షాపు యజమానులకు కూడా తెలిపింది.

బంద్ సమయంలో అత్యవసర, ప్రాణరక్షక మందులు సరిపడేంద ఉన్నాయో లేదో.. రాష్ట్రాల వ్యాప్తంగా ఉన్న డ్రగ్స్ కంట్రోల్ అధికారులు నిశితంగా పర్యవేక్షించాలని సంఘం కోరింది. కీలకమైన మందుల కొరతను నివారించడానికి ఆసుపత్రులు, అత్యవసర మందుల దుకాణాలు, టోకు వ్యాపారులు, జిల్లా యంత్రాంగాలతో సమన్వయం చేసుకోవాలని కోరింది. అక్రమ అమ్మకాలు, బ్లాక్ మార్కెటింగ్, నకిలీ మందులు, అనధికార ఆన్‌లైన్ మందుల పంపిణీపై కూడా కఠిన నిఘా ఉంచాలని తెలిపింది.

బంద్ సమయంలో శాంతిభద్రతలను కాపాడాలని, ఫార్మసీలు, ఆసుపత్రులు, అత్యవసర ఆరోగ్య సంరక్షణ సేవలకు రక్షణ కల్పించాలని పోలీసు విభాగాన్ని సంఘం కోరింది. బలవంతపు మూసివేతలు, బెదిరింపులు, చట్టవిరుద్ధ కార్యకలాపాలు, లేదా అంబులెన్స్ సేవలకు, అత్యవసర వైద్య రవాణాకు అంతరాయం కలగకుండా నిరోధించాలని సూచించింది.

ఆన్‌లైన్ ఫార్మసీ నియంత్రించాలని డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఆన్‌లైన్ కంపెనీలు తక్కువ ధరలకు మందులు అమ్మడం వల్ల స్థానిక వ్యాపారులు నష్టపోతున్నారని ఆరోపిస్తోంది. అంతేకాకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌లు మిస్‌యూజ్ అవుతున్నాయని, డ్రగ్స్ కూడా విచ్చవిలవిడిగా ఆన్‌లైన్‌లో విక్రయాలు అవుతున్నట్టుగా తెలిపింది.

మరోవైపు కార్పొరేట్ సెక్టార్లు ఇస్తున్న డిస్కౌంట్లు నియంత్రించాలని, ధరల నియంత్రణ విషయంలో నిబంధనలు పాటించకుండా నేషనల్ ప్రైజ్ అథారిటీ ప్రకారం విక్రయాలు చేయాలని సంఘం డిమాండ్‌ చేస్తోంది. ఈ అంశల మీద పలుమార్లు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదని డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ ఇండియా వెల్ఫేర్ అసోసియేషన్ పేర్కొంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More