యాపిల్ ఐఫోన్స్ అంటేనే చాలా ఖరీదైన వ్యవహారం! అందులోనూ ఇటీవలే లాంచ్ అయిన యాపిల్ ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్, యాపిల్ తొలి ఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయో ధరలు విన్న టెక్ ప్రియులు, భారతీయ వినియోగదారులు షాక్కి గురవుతున్నారు. ఇంకొందరు ముందడుగు వేసి, అమెరికాలో ఈ స్మార్ట్ఫోన్స్ ధరలను, ఇండియాలో రేట్లను పోల్చి చూస్తున్నారు. వీటి మధ్య ఉన్న భారీ తేడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
అమెరికా వర్సెస్ ఇండియా- రూ.లక్షకు పైగా వ్యత్యాసం!

అమెరికా మార్కెట్తో పోలిస్తే మన దేశంలో ఐఫోన్ల ధరలు విపరీతంగా పెరిగాయి. యాపిల్ ప్రకటించిన వివరాల ప్రకారం ఇండియాలో కొత్త ఫోల్డబుల్ 'ఐఫోన్ డ్యుయో' ప్రారంభ ధర ఏకంగా రూ. 2,99,900గా ఉంది. అదే సమయంలో ఐఫోన్ 18 ప్రో ప్రారంభ ధర రూ. 1,64,900 కాగా, ఐఫోన్ 18 ప్రో మాక్స్ మోడల్ ధర రూ. 1,79,900గా నిర్ణయించారు.
అయితే అమెరికాలో ఇవే మోడళ్ల ప్రారంభ ధరలు వరుసగా 1,999 డాలర్లు (సుమారు రూ. 1.9 లక్షలు), 1,199 డాలర్లు (సుమారు రూ. 1.14 లక్షలు), 1,299 డాలర్లు (సుమారు రూ. 1.24 లక్షలు)గా ఉన్నాయి.
అంటే ఒక్క ఐఫోన్ డ్యుయో మోడల్పైనే భారతీయ వినియోగదారులు అమెరికా కంటే ఏకంగా రూ. 1.30 లక్షలకు పైగా అదనంగా చెల్లించాల్సి వస్తోంది!
ధరల మోతకు కారణమేంటి?
భారత్లో ఐఫోన్ల ధరలు ఈ స్థాయిలో ఉండటానికి పన్నుల భారమే ప్రధాన కారణమని ప్రముఖ పరిశోధనా సంస్థ 'కౌంటర్పాయింట్ రీసెర్చ్' విశ్లేషించింది.
"భారత్లో విక్రయించే ఐఫోన్ డ్యుయో మొదటి విడత ఫోన్లు 'మేడ్ ఇన్ ఇండియా' కాకపోవడమే ఈ భారీ వ్యత్యాసానికి ప్రధాన కారణం," అని కౌంటర్పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ వెల్లడించారు.
"పూర్తిస్థాయిలో దిగుమతి చేసుకునే ఈ ఫోన్లపై 17-18 శాతం దిగుమతి సుంకం పడుతోంది. దీనికి తోడు 18 శాతం జీఎస్టీ, డాలర్తో పోలిస్తే రూపాయి విలువలో 5-6 శాతం క్షీణత అన్నీ కలిపి ఇండియాలో ధరలను విపరీతంగా పెంచేశాయి," అని ఆయన వివరించారు.
పాత మోడళ్లకూ తప్పని ధరల మంట!
{{/usCountry}}"పూర్తిస్థాయిలో దిగుమతి చేసుకునే ఈ ఫోన్లపై 17-18 శాతం దిగుమతి సుంకం పడుతోంది. దీనికి తోడు 18 శాతం జీఎస్టీ, డాలర్తో పోలిస్తే రూపాయి విలువలో 5-6 శాతం క్షీణత అన్నీ కలిపి ఇండియాలో ధరలను విపరీతంగా పెంచేశాయి," అని ఆయన వివరించారు.
పాత మోడళ్లకూ తప్పని ధరల మంట!
{{/usCountry}}సాధారణంగా కొత్త ఐఫోన్ రాగానే పాత మోడళ్లైన ఐఫోన్ 16, ఐఫోన్ 17 ధరలు తగ్గుతాయని భావించే వినియోగదారులకు యాపిల్ ఈసారి ఊహించని షాక్ ఇచ్చింది. పాత మోడళ్ల ధరలను సైతం సంస్థ పెంచేసింది. ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్ల కొరత ఏర్పడటమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు. ఈ మెమరీ సంక్షోభం మరో రెండేళ్ల పాటు కొనసాగే అవకాశం ఉందని, అంతేకాదు భవిష్యత్తులో ఐఫోన్లపై ఆఫర్లు లేదా డిస్కౌంట్లు కూడా లభించడం కష్టమేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
"ఉత్పత్తి వ్యయం పెరిగితే ఆ భారాన్ని వినియోగదారులపై వేయక తప్పదు," అని గతంలో యాపిల్ మాజీ సీఈఓ టిమ్ కుక్ ముందే హెచ్చరించిన విషయాన్ని ఈ సందర్భంగా టెక్ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు.
దుబాయ్, అమెరికా వైపే చూపులు!
భారత్లో ఐఫోన్ల ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో దుబాయ్, అమెరికా లేదా సింగపూర్ వంటి దేశాల్లో ఉన్న బంధువులు, మిత్రుల ద్వారా ఫోన్లను తెప్పించుకునే భారతీయుల సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని కౌంటర్పాయింట్ రీసెర్చ్ అంచనా వేసింది. రూ. 20,000 నుంచి రూ. 30,000 వరకు ధర పెరిగినా ప్రీమియం కొనుగోలుదారులు వెనకాడకపోవచ్చు. కానీ, సాధారణ ఐఫోన్ ప్రియులు మాత్రం తమ కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేసుకోవడమో లేదా విదేశాల నుంచి తెప్పించుకోవడమో చేస్తారని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.