'బెంగళూరు ట్రాఫిక్ కన్నా అంతరిక్ష ప్రయాణం ఈజీ!' : శుభాన్షు శుక్లా
బెంగళూరు ట్రాఫిక్పై వ్యోమగామి శుభాన్షు శుక్లా చమత్కారం విసిరారు. అంతరిక్షం నుంచి రావడం సులువు కానీ బెంగళూరు ట్రాఫిక్ని తట్టుకోవడం కష్టం అన్నట్టు వ్యాఖ్యానించారు.
“అంతరిక్ష ప్రయాణం కన్నా బెంగళూరు ట్రాఫిక్ కష్టమైన జర్నీ” అని చమత్కరించారు వ్యోమగామి- ఐఏఎఫ్ గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా. ఈ మేరకు గురువారంతో ముగిసిన బెంగళూరు టెక్ సమిట్ 2025లో ఈ వ్యాఖ్యలు చేశారు.

“అంతరిక్ష ప్రయాణమే ఈజీ!”
సమ్మిట్లో తన సెషన్ను ప్రారంభించినప్పుడు, సరదాగా ఒక వ్యాఖ్య చేశారు శుక్లా.
"అంతరిక్షం నుంచి తిరిగి రావడం కంటే, బెంగళూరులో ప్రయాణించడమే చాలా కష్టమైన పని," అని చమత్కరించారు.
శుక్లా మాట్లాడుతూ.. తాను మారాఠాహళ్లి నుంచి బయలుదేరానని, అయితే సమ్మిట్ వేదికకు చేరుకోవడానికి “నా ఈ ప్రెజెంటేషన్ సమయం కంటే మూడు రెట్లు ఎక్కువ” పట్టిందని చెప్పారు. "నా నిబద్ధతను మీరు అభినందించాలి" అని ఆయన జోక్ చేయగా, ప్రేక్షకులందరూ నవ్వుకున్నారు.
శుక్లా చేసిన ఈ వ్యాఖ్య ఆ తర్వాత, మరో వేదికపై కూడా వినిపించింది. ఫ్యూచర్ మేకర్స్ కాన్క్లేవ్లో తన ప్రసంగం సందర్భంగా ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే.. శుక్లా వ్యాఖ్యను నగరంలో ఉన్న ట్రాఫిక్ సమస్యలపై ఒక చమత్కారంగా మార్చారు.
"శుభాన్షు శుక్లా చెప్పినట్లు, ఆయనకు అంతరిక్షం నుంచి బెంగళూరు రావడం సులువు, కానీ మారాఠాహళ్లి నుంచి బీఐఈసీ వేదికకు రావడం కొంచెం కష్టం," అని ఖర్గే నవ్వుతూ అన్నారు. అయితే, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చూసుకుంటుందని హామీ ఇచ్చారు.
బెంగళూరు టెక్ సమ్మిట్: అద్భుతమైన స్పందన
సమ్మిట్ ముగింపు రోజున నిర్వాహకులు బెంగళూరు టెక్ సమ్మిట్ 2025 గొప్పతనాన్ని వివరించారు.
మూడు రోజుల పాటు సాగిన కార్యక్రమంలో 57 దేశాల నుంచి 20,680 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.
వీరితో పాటు 46,389 మందికి పైగా వ్యాపార సందర్శకులు హాజరయ్యారు. దీనితో ఈవెంట్ మొత్తం హాజరు సంఖ్య దాదాపు 92,500కు చేరుకుంది.
100 లైవ్ సెషన్ల్లో 630 మందికి పైగా వక్తలు పాల్గొని ప్రసంగించారు. వీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డీప్ టెక్, బయోటెక్, ఏరోస్పేస్, స్టార్టప్లు, అనేక కొత్త టెక్నాలజీల గురించి చర్చించారు.
ఈ వేదికలో 1,015 మంది ఎగ్జిబిటర్లు తమ కొత్త ఉత్పత్తులు, ఆవిష్కరణలు, పరిష్కారాలను ప్రదర్శించారు.
స్టార్టప్లకు ప్రోత్సాహం..
డీప్-టెక్ స్టార్టప్లకు గణనీయమైన ప్రోత్సాహం లభించింది. ఫ్యూచర్ మేకర్స్ కాన్క్లేవ్లో ప్రభుత్వం, వెంచర్ క్యాపిటల్ సంస్థలు సుమారు రూ. 400 కోట్లను విడుదల చేశాయి.
ఈ వేదిక 36 మంది పెట్టుబడిదారులతో కూడిన 146 క్రాస్-పిచ్లను సులభతరం చేసింది. బీటీఎస్ బ్యానర్ కింద వచ్చే వారం మరో 162 పిచ్ సెషన్లను నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సమ్మిట్ సమయంలో 107 మెంటర్-మెంటి సమావేశాలు కూడా జరిగాయి.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్పీరియెన్స్తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్లో కంటెంట్ రైటర్గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


