Aye Finance IPO : రేపటి నుంచి కొత్త ఐపీఓ సబ్​స్క్రిప్షన్​- జీఎంపీ ఎంత? 10 ముఖ్యాంశాలు..

ఎంఎస్​ఎంఈలకు రుణాలందించే ఎన్​బీఎఫ్​సీ సంస్థ 'అయే ఫైనాన్స్' తన ఐపీఓను సోమవారం ప్రారంభించనుంది. రూ. 122 నుంచి రూ. 129 ప్రైజ్​ బ్యాండ్‌తో వస్తున్న ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 1010 కోట్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఐపీఓకి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Feb 08, 2026 11:25 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రైమరీ మార్కెట్‌లో కొద్దిపాటి విరామం తర్వాత మళ్లీ వేగం పుంజుకుంటోంది. 'అయే ఫైనాన్స్' ఐపీఓ రేపు, ఫిబ్రవరి 9న సబ్​స్క్రిప్షన్​కి ఓపెన్​కానుంది ఈ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఎన్​బీఎఫ్​సీ), తన షేర్ల విక్రయం కోసం ఒక్కో షేరుకు రూ. 122 నుంచి రూ. 129 ధరను ప్రైజ్​ బ్యాండ్​గా నిర్ణయించింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా ఉన్న సూక్ష్మ స్థాయి ఎంఎస్​ఎంఈలకు వారి వర్కింగ్ క్యాపిటల్, వ్యాపార విస్తరణ అవసరాల కోసం రుణాలను అందిస్తుంది. తయారీ, వాణిజ్యం, సర్వీస్, వ్యవసాయ అనుబంధ రంగాల్లోని వినియోగదారులకు ఇది చిన్న తరహా వ్యాపార రుణాలను అందిస్తుంది.

అయే ఫైనాన్స్​ ఐపీఓ..
అయే ఫైనాన్స్​ ఐపీఓ..

ఈ నేపథ్యంలో ఈ అయే ఫైనాన్స్​ ఐపీఓకి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

అయే ఫైనాన్స్ ఐపీఓ- 10 ముఖ్య విషయాలు..

ఐపీఓ తేదీలు: అయే ఫైనాన్స్ ఐపీఓ ఫిబ్రవరి 9న ప్రారంభమై, ఫిబ్రవరి 11న ముగుస్తుంది. యాంకర్ బుక్ ఫిబ్రవరి 6న ప్రారంభమైంది. షేర్ల కేటాయింపు ఫిబ్రవరి 12న జరుగుతుంది, ఫిబ్రవరి 16న బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈలో లిస్టింగ్ అయ్యే అవకాశం ఉంది.

ఐపీఓ పరిమాణం: ఇది రూ. 710 కోట్ల విలువైన కొత్త షేర్ల విక్రయం, రూ. 300 కోట్ల విలువైన ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్​ఎస్​) కలయిక. అప్పర్ ప్రైస్ బ్యాండ్ వద్ద కంపెనీ మొత్తం రూ. 1010 కోట్లు సేకరించాలని చూస్తోంది.

వాటాలను విక్రయిస్తున్న వారు: ఆల్ఫా వేవ్ ఇండియా, ఎంఏజే ఇన్వెస్ట్ ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్ ఫండ్, ఎల్జీటీ క్యాపిటల్, కాపిటా జీఎల్‌పీ, విక్రమ్ జెట్లీ వంటి కార్పొరేట్, వ్యక్తిగత వాటాదారులు తమ వాటాలను విక్రయిస్తున్నారు.

ఐపీఓ టార్గెట్​​: అయే ఫైనాన్స్​ ఐపీఓ ద్వారా కొత్త షేర్లను విక్రయించి, ఆ వచ్చే నిధులను సంస్థ మూలధన పునాదిని బలోపేతం చేయడానికి, భవిష్యత్తు వ్యాపార విస్తరణ అవసరాల కోసం వినియోగించనున్నారు.

లాట్ సైజ్: రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 116 షేర్లకు (ఒక లాట్) దరఖాస్తు చేసుకోవాలి. అప్పర్ ప్రైస్ బ్యాండ్ వద్ద కనీస పెట్టుబడి రూ. 14,964 అవుతుంది.

కేటాయింపులు: ఈ ఐపీఓలో క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ కోసం 75శాతం, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ (ఎన్​ఐఐ) కోసం 15శాతం, రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 10శాతం కేటాయించారు.

జీఎంపీ: అయే ఫైనాన్స్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం ఫిబ్రవరి 8న సున్నాగా ఉంది. అంటే ఎలాంటి లాభాలు, నష్టాలు లేవని అర్థం. అయితే గత కొన్ని రోజులుగా ఈ ఐపీఓ జీఎంపీ భారీగా తగ్గింది. గతంలో రూ. 5గా ఉండగా, శుక్రవారం రూ. 1కి పడిపోయింది. ఇప్పుడు 0కి చేరింది.

అయితే.. కేవలం జీఎంపీ చూసి ఐపీఓలో ఇన్వెస్ట్​ చేయడం సరికాదని స్టాక్​ మార్కెట్​ నిపుణులు చెబుతుంటారు.

పోటీ సంస్థలు: కంపెనీ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (ఆర్​హెచ్​పీ) ప్రకారం.. ఎస్​బీఎఫ్​సీ ఫైనాన్స్, ఫైవ్-స్టార్ బిజినెస్ ఫైనాన్స్ ఈ అయే ఫైనాన్స్​కి ప్రధాన లిస్టెడ్ పోటీదారులు.

ఆర్థిక వివరాలు: 2025 ఆర్థిక సంవత్సరంలో అయే ఫైనాన్స్ రూ. 175.3 కోట్ల లాభాన్ని నమోదు చేసింది (క్రితం ఏడాది రూ. 171.7 కోట్లు). నికర వడ్డీ ఆదాయం (ఎన్​ఐఐ) ఏడాది ప్రాతిపదికన 37.9% వృద్ధితో రూ. 858 కోట్లకు చేరుకుంది.

లీడ్​ మేనేజర్లు: యాక్సిస్ క్యాపిటల్, ఐఐఎఫ్​ఎల్​ క్యాపిటల్, జేఎం ఫైనాన్షియల్, నువామా వెల్త్ మేనేజ్‌మెంట్ బుక్-రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా ఉండగా, కేఫిన్ టెక్నాలజీస్ రిజిస్ట్రార్‌గా ఉంది.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఐపీఓలో ఇన్వెస్ట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More