Mahindra cars discounts : మహీంద్రా కార్లపై డిస్కౌంట్ల జాతర! ఈ మోడల్స్​పై అదిరే ఆఫర్లు..

మే 2026 నెలలో మహీంద్రా తన పాపులర్ ఎస్‌యూవీలపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు థార్ రాక్స్, స్కార్పియో వంటి మోడళ్లపై నగదు డిస్కౌంట్లు, యాక్సెసరీస్ ప్రయోజనాలను అందిస్తోంది.

Published on: May 15, 2026, 10:44:13 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మే 2026లో కస్టమర్స్​ని ఆకర్షించేందుకు, సేల్స్​ని పెంచుకునేందుకు వివిధ ఆటోమొబైల్​ సంస్థ తమ పోర్ట్​ఫోలియోలోని వాహనాలపై భారీ డిస్కౌంట్లను ప్రకటిస్తున్నాయి. ఈ జాబితాలో మహీంద్రా అండ్​ మహీంద్రా సంస్థ తాజాగా చేరింది. ఈ ఆఫర్లలో ఎలక్ట్రిక్ వాహనాలు (ఈవీ) ముందంజలో ఉన్నాయి. ముఖ్యంగా కొత్తగా మార్కెట్​లోకి వచ్చిన బోర్న్ ఎలక్ట్రిక్ (బీఈ) సిరీస్, పాత మోడళ్లపై కంపెనీ భారీగా రాయితీలు ఇస్తోంది. వాటి వివరాలను ఇక్కడ చూసేయండి..

మహీంద్రా బీఈ 6..
మహీంద్రా బీఈ 6..

ఎలక్ట్రిక్ వాహనాలపై ‘ఎలక్ట్రిఫైయింగ్’ ఆఫర్లు!

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుదారులకు ఈ నెల పండుగే అని చెప్పాలి!

ఎక్స్​యూవీ 400 ఈవీ : కంపెనీ ఈ మోడల్‌లోని ఈసీ ప్రో, ఈఎల్​ ప్రో వేరియంట్లపై గరిష్టంగా రూ. 2.5 లక్షల నగదు తగ్గింపును ఇస్తోంది. INGLO ప్లాట్‌ఫారమ్ ఆధారిత కొత్త ఎలక్ట్రిక్ కార్ల రాకతో దీనిపై పోటీ పెరగడమే ఈ భారీ డిస్కౌంట్‌కు ప్రధాన కారణం.

బీఈ 6, ఎక్స్​ఈవీ 9ఈ: గత ఏడాది (ఎంవై2025) స్టాక్‌ను క్లియర్ చేసేందుకు గానూ బీఈ 6 పై రూ. 2 లక్షలు, ఎక్స్​ఈవీ 9ఈపై రూ. 1.4 లక్షల మేర క్యాష్ డిస్కౌంట్​ని మహీంద్రా అందిస్తోంది. ప్రస్తుతం ఇవి దేశంలోనే టాప్ సెల్లింగ్ ఈవీలుగా ఉన్నందున, ఈ ఆఫర్లు పరిమిత కాలం మాత్రమే అందుబాటులో ఉంటాయి.

ఐసీఈ (పెట్రోల్/డీజిల్) వాహనాలపై ఆఫర్లు..

సాధారణ ఇంధన కార్లపై కూడా మహీంద్రా ఆకర్షణీయమైన ప్రయోజనాలను ప్రకటించింది:

థార్ రాక్స్ : ఈ ఆఫ్ రోడ్ ఎస్‌యూవీపై మొత్తంగా రూ. 1,10,000 వరకు ప్రయోజనం పొందవచ్చు. ఇందులో రూ. 85,000 నగదు తగ్గింపు కాగా, రూ. 25,000 విలువైన యాక్సెసరీస్ లభిస్తాయి.

ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ : ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీపై రూ. 40,000 నగదు, రూ. 20,000 యాక్సెసరీలతో కలిపి మొత్తం రూ. 60,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి.

స్కార్పియో సిరీస్: స్కార్పియో క్లాసిక్ కొంటే రూ. 50,000 (రూ. 20 వేల నగదు + రూ. 30 వేల యాక్సెసరీస్) వరకు లబ్ధి చేకూరుతుంది. స్కార్పియో-ఎన్ మోడల్‌లో జెడ్4 వేరియంట్‌పై రూ. 30,000, జెడ్8 వేరియంట్‌పై రూ. 20,000 తగ్గింపు ఉంది.

బొలెరో నియో: దీనిపై రూ. 25,000 నగదు తగ్గింపుతో పాటు ఎక్స్​ఛేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది.

అయితే, బొలెరో సిరీస్, త్రీ-డోర్ థార్, ఎక్స్​యూవీ 7ఎక్స్​ఓ మోడళ్లపై ఈ నెల ఎటువంటి ఆఫర్లు లేవు.

ఇక ఈ డిస్కౌంట్లు కేవలం ఎంపిక చేసిన నగరాల్లో, స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే వర్తిస్తాయి. పూర్తి వివరాల కోసం సమీపంలోని మహీంద్రా డీలర్‌ను సంప్రదించడం ఉత్తమం.

తరచూ అడిగే ప్రశ్నలు-

ప్రశ్న 1: ఈ నెలలో ఏ మహీంద్రా కారుపై అత్యధికంగా డిస్కౌంట్ లభిస్తోంది?

సమాధానం: మహీంద్రా XUV 400 EV మోడల్‌పై గరిష్టంగా రూ. 2.5 లక్షల వరకు భారీ నగదు తగ్గింపు లభిస్తోంది. అలాగే BE 6, XEV 9e వంటి కొత్త తరం ఎలక్ట్రిక్ కార్ల 2025 మోడల్ స్టాక్‌పై కూడా రూ. 2 లక్షల వరకు రాయితీలు ఉన్నాయి.

ప్రశ్న 2: థార్ రాక్స్, స్కార్పియో మోడళ్లపై లభించే ప్రయోజనాలు ఏంటి?

సమాధానం: థార్ రాక్స్‌పై నగదు, యాక్సెసరీస్ కలిపి రూ. 1.10 లక్షల వరకు ప్రయోజనం లభిస్తుండగా, స్కార్పియో క్లాసిక్‌పై రూ. 50,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. స్కార్పియో-ఎన్ మోడల్‌లోని జెడ్4, జెడ్8 వేరియంట్లపై రూ. 30,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More