కేంద్ర బడ్జెట్ 2026 సమీపిస్తున్న తరుణంలో దేశంలోని కీలకమైన రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగం భారీ అంచనాలతో ఉంది. ముఖ్యంగా గృహ నిర్మాణ రంగంలో అత్యాధునిక జీవనశైలిని, సుస్థిర అభివృద్ధిని కాంక్షిస్తున్న డెవలపర్లు ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీల అధినేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
మౌలిక సదుపాయాలే రియల్ ఎస్టేట్ చోదక శక్తులు: కార్తీష్ రెడ్డి (GHR Infra సీఈవో)

ప్రీమియం, జీవనశైలి ఆధారిత నిర్మాణాలకు మౌలిక సదుపాయాలే అసలైన విలువను చేకూరుస్తాయని జీహెచ్ఆర్ ఇన్ఫ్రా (GHR Infra) సీఈవో కార్తీష్ రెడ్డి పేర్కొన్నారు.
"జీవన ప్రమాణాలను పెంచేలా నాణ్యమైన రవాణా వ్యవస్థ, సామాజిక మౌలిక సదుపాయాలు, పర్యావరణ అనుకూల ప్రమాణాల కోసం ఈ బడ్జెట్లో పెట్టుబడులను పెంచాల్సిన అవసరం ఉంది. సుస్థిర నిర్మాణ పద్ధతులు, ఇంధన పొదుపు డిజైన్లకు ప్రభుత్వం నుంచి గట్టి మద్దతు లభిస్తే.. తక్కువ కార్బన్ ఉద్గారాలను వెలువరించే మెటీరియల్స్, స్మార్ట్ హోమ్ టెక్నాలజీ, నీటి సంరక్షణ వంటి అంశాలను మేము మరింత వేగంగా అమలు చేస్తాం. విలాసవంతమైన జీవనానికి ఎలాంటి లోటు లేకుండానే పర్యావరణాన్ని కాపాడటం మా లక్ష్యం" అని ఆయన వివరించారు.
నగర శివార్లలో కనెక్టివిటీ పెరుగుతున్న ప్రాంతాలకు బడ్జెట్లో మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. మెట్రో విస్తరణ కోసం 'వయబిలిటీ గ్యాప్ ఫండింగ్', ఇంధన పొదుపు భవనాలకు పన్ను రాయితీలు ఇస్తే.. అది రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త ఊపిరి పోస్తుందని కార్తీష్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
కనెక్టివిటీ, సుస్థిరతే కీలకం: అజితేష్ కోరుపోలు (ASBL వ్యవస్థాపకులు & సీఈవో)
నూతన తరం ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్ డెవలపర్గా.. బడ్జెట్ 2026 ప్రధానంగా కనెక్టివిటీ, జీవన నాణ్యత, సుస్థిరతపై దృష్టి సారించాలని ఏఎస్బీఎల్ (ASBL) వ్యవస్థాపకులు, సీఈవో అజితేష్ కోరుపోలు ఆకాంక్షించారు.
{{/usCountry}}నూతన తరం ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్ డెవలపర్గా.. బడ్జెట్ 2026 ప్రధానంగా కనెక్టివిటీ, జీవన నాణ్యత, సుస్థిరతపై దృష్టి సారించాలని ఏఎస్బీఎల్ (ASBL) వ్యవస్థాపకులు, సీఈవో అజితేష్ కోరుపోలు ఆకాంక్షించారు.
{{/usCountry}}"నగర స్థాయి మౌలిక సదుపాయాలైన రహదారులు, మెట్రో కారిడార్లు, పౌర వసతులు, నీటి నిర్వహణపై నిరంతర పెట్టుబడులు అవసరం. ఇవి నేరుగా ప్రజల జీవన ప్రమాణాలను ప్రభావితం చేస్తాయి. భూమి కేటాయింపులు, పన్నులు, సింగిల్ విండో క్లియరెన్స్ల విషయంలో స్పష్టమైన, ఊహించదగ్గ విధానాలు ఉంటే.. మేము భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా కమ్యూనిటీలను నిర్మించగలం" అని అజితేష్ పేర్కొన్నారు.
స్మార్ట్ సిటీ జోన్లలో స్టాంప్ డ్యూటీ రాయితీలు, గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్లకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆయన కోరారు. రవాణా ఆధారిత అభివృద్ధి (Transit-oriented development) కి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించవచ్చని, తద్వారా ఉద్యోగ కల్పన, ఆర్థిక వృద్ధి సాధ్యమవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.