కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) 2026 బోర్డు పరీక్షల షెడ్యూల్లో కీలక మార్పులు చేసింది. మార్చి 3న జరగాల్సిన 10వ తరగతికి చెందిన 13 సబ్జెక్టులు, 12వ తరగతికి చెందిన ఒక ప్రధాన సబ్జెక్టు పరీక్షలను రీషెడ్యూలు చేస్తున్నట్లు ప్రకటించింది. పరిపాలనా కారణాల దృష్ట్యా ఈ మార్పులు చేసినట్లు బోర్డు స్పష్టం చేసింది.
మార్పు చేసిన తేదీలు ఇవే..

స్కూల్ ప్రిన్సిపాల్లకు పంపిన తాజా సమాచారం ప్రకారం, మార్చి 3న జరగాల్సిన పరీక్షల కొత్త తేదీలు ఇలా ఉన్నాయి:
10వ తరగతి: టిబెటన్, జర్మన్, నేషనల్ క్యాడెట్ కోర్ (NCC), భోటి, బోడో, తంగ్ఖుల్, జపనీస్, భూటియా, స్పానిష్, కాశ్మీరీ, మిజో, బాసా మెెలాయు, ఎలిమెంట్స్ ఆఫ్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటెన్సీ.. ఈ 13 సబ్జెక్టుల పరీక్షలు ఇప్పుడు మార్చి 11న జరుగుతాయి.
12వ తరగతి: మార్చి 3న జరగాల్సిన 'లీగల్ స్టడీస్' పరీక్షను ఏప్రిల్ 10వ తేదీకి మార్చారు.
"మిగిలిన పరీక్షల షెడ్యూల్లో ఎటువంటి మార్పు లేదు. మార్చిన తేదీలను విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలియజేయాలని పాఠశాలలను కోరాము. సవరించిన తేదీలు విద్యార్థుల అడ్మిట్ కార్డ్లలో కూడా కనిపిస్తాయి" అని సీబీఎస్ఈ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సంయం భరద్వాజ్ వివరించారు.
2026 నుంచి రెండుసార్లు పరీక్షలు
జాతీయ విద్యా విధానం (NEP) 2020 సిఫార్సుల మేరకు, 2026 విద్యా సంవత్సరం నుండి సీబీఎస్ఈ ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలను (Biannual Exams) నిర్వహించనుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
మొదటి విడత పరీక్షలు ఫిబ్రవరి మధ్యలో ప్రారంభమవుతాయి. రెండో విడత పరీక్షలు మే 15 నుండి జూన్ 1 వరకు జరుగుతాయి. విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరచుకోవడానికి (Improvement) రెండోసారి పరీక్ష రాసే అవకాశం ఉంటుంది.
పరీక్షల టైమ్ టేబుల్
{{/usCountry}}మొదటి విడత పరీక్షలు ఫిబ్రవరి మధ్యలో ప్రారంభమవుతాయి. రెండో విడత పరీక్షలు మే 15 నుండి జూన్ 1 వరకు జరుగుతాయి. విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరచుకోవడానికి (Improvement) రెండోసారి పరీక్ష రాసే అవకాశం ఉంటుంది.
పరీక్షల టైమ్ టేబుల్
{{/usCountry}}అక్టోబర్ 30న ప్రకటించిన సీబీఎస్ఈ పరీక్షల షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 17 నుంచి ప్రధాన పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 10వ తరగతి పరీక్షలు మార్చి 10 వరకు, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 9 వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది దాదాపు 26 లక్షల మంది 10వ తరగతి విద్యార్థులు, 20 లక్షల మంది 12వ తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అంచనా.
సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్లో విద్యార్థులు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు.