...
...
Next Story

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల తేదీలు మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే

2026 మార్చి 3న జరగాల్సిన సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలను బోర్డు రీషెడ్యూల్ చేసింది. పరిపాలనా కారణాల వల్ల తేదీలను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చిన తేదీలు, సబ్జెక్టుల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Published on: Dec 30, 2025 06:06 PM IST
Advertisement

కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) 2026 బోర్డు పరీక్షల షెడ్యూల్‌లో కీలక మార్పులు చేసింది. మార్చి 3న జరగాల్సిన 10వ తరగతికి చెందిన 13 సబ్జెక్టులు, 12వ తరగతికి చెందిన ఒక ప్రధాన సబ్జెక్టు పరీక్షలను రీషెడ్యూలు చేస్తున్నట్లు ప్రకటించింది. పరిపాలనా కారణాల దృష్ట్యా ఈ మార్పులు చేసినట్లు బోర్డు స్పష్టం చేసింది.

మార్పు చేసిన తేదీలు ఇవే..

సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల తేదీలు మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే
సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల తేదీలు మార్పు.. కొత్త షెడ్యూల్ ఇదే

స్కూల్ ప్రిన్సిపాల్‌లకు పంపిన తాజా సమాచారం ప్రకారం, మార్చి 3న జరగాల్సిన పరీక్షల కొత్త తేదీలు ఇలా ఉన్నాయి:

10వ తరగతి: టిబెటన్, జర్మన్, నేషనల్ క్యాడెట్ కోర్ (NCC), భోటి, బోడో, తంగ్ఖుల్, జపనీస్, భూటియా, స్పానిష్, కాశ్మీరీ, మిజో, బాసా మెెలాయు, ఎలిమెంట్స్ ఆఫ్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటెన్సీ.. ఈ 13 సబ్జెక్టుల పరీక్షలు ఇప్పుడు మార్చి 11న జరుగుతాయి.

12వ తరగతి: మార్చి 3న జరగాల్సిన 'లీగల్ స్టడీస్' పరీక్షను ఏప్రిల్ 10వ తేదీకి మార్చారు.

"మిగిలిన పరీక్షల షెడ్యూల్‌లో ఎటువంటి మార్పు లేదు. మార్చిన తేదీలను విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలియజేయాలని పాఠశాలలను కోరాము. సవరించిన తేదీలు విద్యార్థుల అడ్మిట్ కార్డ్‌లలో కూడా కనిపిస్తాయి" అని సీబీఎస్‌ఈ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ సంయం భరద్వాజ్ వివరించారు.

2026 నుంచి రెండుసార్లు పరీక్షలు

జాతీయ విద్యా విధానం (NEP) 2020 సిఫార్సుల మేరకు, 2026 విద్యా సంవత్సరం నుండి సీబీఎస్‌ఈ ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలను (Biannual Exams) నిర్వహించనుంది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అక్టోబర్ 30న ప్రకటించిన సీబీఎస్‌ఈ పరీక్షల షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 17 నుంచి ప్రధాన పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 10వ తరగతి పరీక్షలు మార్చి 10 వరకు, 12వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 9 వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది దాదాపు 26 లక్షల మంది 10వ తరగతి విద్యార్థులు, 20 లక్షల మంది 12వ తరగతి విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని అంచనా.

సీబీఎస్‌ఈ అధికారిక వెబ్‌సైట్‌లో విద్యార్థులు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని తనిఖీ చేసుకోవాలని అధికారులు సూచించారు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe