నేటి (ఫిబ్రవరి 1) నుంచి దేశవ్యాప్తంగా ‘సిన్ గూడ్స్’ (Sin Goods) అంటే సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కా వంటి ఉత్పత్తుల ధరలు భారమవనున్నాయి. ఇప్పటివరకు ఉన్న 28 శాతం జీఎస్టీ, కాంపెన్సేషన్ సెస్ల స్థానంలో.. ఇప్పుడు అదనపు ఎక్సైజ్ సుంకం, హెల్త్ సెస్లను ప్రభుత్వం వర్తింపజేసింది. గరిష్టంగా ఉన్న 40 శాతం జీఎస్టీకి అదనంగా ఈ కొత్త పన్నులు ఉంటాయి.
సిగరెట్ల కొత్త ధరలు ఇలా..

కేంద్ర ఎక్సైజ్ చట్టంలో చేసిన సవరణల ప్రకారం, సిగరెట్ పొడవును బట్టి ఒక్కో స్టిక్పై రూ. 2.05 నుంచి రూ. 8.50 వరకు అదనపు భారం పడనుంది.
- 65 మి.మీ లోపు (నాన్-ఫిల్టర్): ఒక్కో స్టిక్పై సుమారు రూ. 2.05 అదనం.
- 65 మి.మీ లోపు (ఫిల్టర్): ఒక్కో స్టిక్పై రూ. 2.10 అదనం.
- మీడియం సైజ్ (65-70 మి.మీ): ఒక్కో స్టిక్పై రూ. 3.6 నుంచి రూ. 4 వరకు పెంపు.
- ప్రీమియం/లాంగ్ సిగరెట్లు (70-75 మి.మీ): ఒక్కో స్టిక్పై రూ. 5.4 వరకు అదనం.
- ప్రత్యేక డిజైన్లు: అరుదుగా ఉండే నాన్-స్టాండర్డ్ సిగరెట్లపై గరిష్టంగా రూ. 8.50 సుంకం విధిస్తారు.
పాన్ మసాలా, గుట్కా రేట్లు
పాన్ మసాలా తయారీ యూనిట్లపై ‘హెల్త్ అండ్ నేషనల్ సెక్యూరిటీ సెస్’ విధించారు. 40 శాతం జీఎస్టీతో కలిపి పాన్ మసాలాపై మొత్తం పన్ను భారం 88 శాతంగా ఉండనుంది. ఇక చూయింగ్ టొబాకో, జర్దా వంటి వాటిపై 82 శాతం, గుట్కాపై ఏకంగా 91 శాతం ఎక్సైజ్ సుంకం అమల్లోకి రానుంది.
తయారీదారులకు కఠిన నిబంధనలు
ధరల పెంపుతో పాటు పన్ను ఎగవేతను అరికట్టేందుకు ప్రభుత్వం కొత్త నిబంధనలు తెచ్చింది.
- MRP ఆధారిత పన్ను: ప్యాకెట్పై ముద్రించిన రిటైల్ ధర (MRP) ఆధారంగానే ఇకపై జీఎస్టీని లెక్కిస్తారు.
- CCTV నిఘా: ప్రతి తయారీ యూనిట్లో ప్యాకింగ్ మెషీన్ల వద్ద సీసీటీవీ కెమెరాలు తప్పనిసరి. ఆ ఫుటేజీని కనీసం 24 నెలల పాటు భద్రపరచాలి.
- కొత్త రిజిస్ట్రేషన్: ఫిబ్రవరి 1 నుంచి తయారీదారులు హెల్త్ సెస్ చట్టం కింద కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి.
ఎందుకు ఈ మార్పు?
జీఎస్టీ అమలు సమయంలో రాష్ట్రాలకు కలిగిన ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం సుమారు రూ. 2.69 లక్షల కోట్ల అప్పు తీసుకుంది. ఈ అప్పు తీర్చేందుకు ‘కాంపెన్సేషన్ సెస్’ వాడేవారు. జనవరి 31 నాటికి ఆ అప్పు తీరిపోవడంతో, సెప్టెంబర్ 2025లో జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం మేరకు పాత సెస్ స్థానంలో కొత్త ఎక్సైజ్ సుంకాలను ప్రవేశపెట్టారు. ఈ పన్ను ద్వారా వచ్చే ఆదాయంలో 41 శాతాన్ని కేంద్రం రాష్ట్రాలకు పంచుతుంది.
{{/usCountry}}జీఎస్టీ అమలు సమయంలో రాష్ట్రాలకు కలిగిన ఆదాయ నష్టాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం సుమారు రూ. 2.69 లక్షల కోట్ల అప్పు తీసుకుంది. ఈ అప్పు తీర్చేందుకు ‘కాంపెన్సేషన్ సెస్’ వాడేవారు. జనవరి 31 నాటికి ఆ అప్పు తీరిపోవడంతో, సెప్టెంబర్ 2025లో జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం మేరకు పాత సెస్ స్థానంలో కొత్త ఎక్సైజ్ సుంకాలను ప్రవేశపెట్టారు. ఈ పన్ను ద్వారా వచ్చే ఆదాయంలో 41 శాతాన్ని కేంద్రం రాష్ట్రాలకు పంచుతుంది.
{{/usCountry}}| సిగరెట్ కేటగిరీ | 40 శాతం జీఎస్టీపైన అదనపు సుంకం |
|---|---|
| షార్ట్ నాన్ ఫిల్టర్ సిగరెట్టు (up to 65 mm) | ఒక సిగరెట్పై ₹2.05 |
| చిన్న ఫిల్టర్ సిగరెట్టు (up to 65 mm) | ఒక సిగరెట్పై ₹2.10 |
| మధ్య రకం పొడువు గల సిగరెట్టు (65-70 mm) | ఒక సిగరెట్పై ₹3.6-4 |
| పొడవైన ప్రీమియం సిగరెట్టు (70-75 mm) | ఒక సిగరెట్పై ₹5.4 |
| ఇతర కేటగిరీలు | ఒక సిగరెట్పై ₹8.5 |