నీట్-యూజీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని వారాలుగా నిరసనలు ఉధృతం చేసిన కాక్రోచ్ జనతా పార్టీకి ఈ వార్త ఉపశమనం కలిగించింది. శనివారం నిరసన ప్రదేశంలో ఉన్న CJP అధినేత అభిజీత్ దిప్కేకి ప్రధాన్ రాజీనామాకు సంబంధించిన ఫోన్ కాల్ రాగానే, ఆ వార్తను అక్కడ ఉన్న వేలాది మంది నిరసనకారులతో పంచుకున్నారు.

"మనం అనుకున్నది సాధించాం. ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. భయపడకుండా పోరాడితే విజయం సాధించవచ్చని ఈ పరిణామం నిరూపించింది" అని అభిజీత్ దిప్కే వేదికపై ప్రకటించగానే జంతర్ మంతర్ పరిసరాలు నినాదాలతో హోరెత్తాయి.
అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, దేశం ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తోదనడానికి ఈ రాజీనామా నిదర్శనమని, తమ సుదీర్ఘ పోరాటంలో ఇది కేవలం మొదటి విజయం మాత్రమేనని వ్యాఖ్యానించారు.
ఇంకా రెండు డిమాండ్లు మిగిలే ఉన్నాయి
కేంద్ర మంత్రి రాజీనామాతో తమ ప్రాథమిక డిమాండ్ నెరవేరినప్పటికీ, పోరాటాన్ని అప్పుడే ముగించేది లేదని CJP స్పష్టం చేసింది. తమ డిమాండ్ల జాబితాలో ప్రధాన్ రాజీనామా అంశాన్ని టిక్ చేసిన పార్టీ, మిగిలిన రెండు ప్రధాన డిమాండ్లను గుర్తుచేసింది.
- ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం చెల్లించాలి.
- శాంతియుతంగా నిరసన తెలిపిన విద్యార్థులు, ఉద్యమకారులపై ఎలాంటి కేసులు పెట్టకూడదు.
"మా దగ్గర మరో రెండు డిమాండ్లు ఉన్నాయి. అవి నెరవేరకుండా మేము ఇక్కడి నుంచి ఖాళీ చేసేది లేదు. మేం బొద్దింకల లాంటివాళ్లం, ఒక్కసారి లోపలికి ప్రవేశిస్తే అంత సులభంగా బయటకు పోం" అని అభిజీత్ దీప్కే గట్టిగా వ్యాఖ్యానించారు.
లిఖితపూర్వక హామీ వచ్చే వరకు కదిలేది లేదు
ప్రభుత్వం నుంచి రాజీనామాకు సంబంధించి అధికారిక లిఖితపూర్వక ధృవీకరణ వచ్చే వరకు తమ నిరసన వేదికను వీడబోమని CJP నేత సౌరవ్ దాస్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు పూర్తి రక్షణ లభించే వరకు జంతర్ మంతర్ వద్దే ఉంటామని స్పష్టం చేశారు.
{{/usCountry}}ప్రభుత్వం నుంచి రాజీనామాకు సంబంధించి అధికారిక లిఖితపూర్వక ధృవీకరణ వచ్చే వరకు తమ నిరసన వేదికను వీడబోమని CJP నేత సౌరవ్ దాస్ తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుకు పూర్తి రక్షణ లభించే వరకు జంతర్ మంతర్ వద్దే ఉంటామని స్పష్టం చేశారు.
{{/usCountry}}మరోవైపు, ప్రధాన్ రాజీనామాపై ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఇది దేశ ప్రజాస్వామ్యానికి లభించిన అతిపెద్ద విజయమని, ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ అభినందనలు తెలుపుతున్నానని పేర్కొన్నారు.