నీట్-యూజీ (NEET-UG) ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో గత కొన్నివారాలుగా దేశ రాజధానిలో సాగుతున్న విద్యార్థుల ఆందోళనలకు ఎట్టకేలకు తెరపడింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తన దేశవ్యాప్త ఉద్యమాన్ని తక్షణమే విరమిస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థుల ప్రధాన డిమాండ్లన్నింటికీ కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

శనివారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో కలసి CJP ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, ఉద్యమకారులపై కేంద్రం, ఎన్డీయే పాలిత రాష్ట్రాలు నమోదు చేసిన కేసులన్నింటినీ ఎత్తివేసేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది.
"నిరసనకారులపై నమోదైన ఎఫ్ఐఆర్ల ప్రతులను CJP ప్రతినిధులకు అందజేస్తాం. విద్యార్థులపై ఎలాంటి ప్రతికూల చట్టపరమైన చర్యలు ఉండవు, అని కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు.
ఒప్పందంలోని 3 ప్రధాన అంశాలు
కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన మూడు కీలక డిమాండ్ల వివరాలు:
కేసుల రద్దు: కేంద్ర ప్రభుత్వం, ఎన్డీయే పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు నిరసనకారులపై నమోదు చేసిన అన్ని ఎఫ్ఐఆర్లను రద్దు చేస్తాయి. భవిష్యత్తులోనూ ఎలాంటి విచారణలు ఉండవు.
కుటుంబాలకు పరిహారం: నీట్ పేపర్ లీకేజీ, రీ-టెస్ట్ ఒత్తిడి కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల ప్రకారం ఇవ్వగలిగే గరిష్ట పరిహారాన్ని అందజేస్తారు.
పరీక్షల సంస్కరణలు: పరీక్షల వ్యవస్థలో సంస్కరణల కోసం CJP సమర్పించిన 5 అంశాల చార్టర్పై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించి, వారి బృందంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటుంది.
"విద్యార్థుల అన్ని ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించింది. సద్భావనతో మా దేశవ్యాప్త ఆందోళనను తక్షణమే విరమిస్తున్నాం" అని CJP ప్రతినిధి సౌరవ్ దాస్ ప్రకటించారు.
{{/usCountry}}"విద్యార్థుల అన్ని ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం ఆమోదించింది. సద్భావనతో మా దేశవ్యాప్త ఆందోళనను తక్షణమే విరమిస్తున్నాం" అని CJP ప్రతినిధి సౌరవ్ దాస్ ప్రకటించారు.
{{/usCountry}}నీట్ వివాదం, దానికి తోడు విద్యార్థుల ఆత్మహత్యలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు దారితీశాయి. కేంద్రం దిగిరావడం, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం విద్యార్థుల ఐక్యతకు దక్కిన విజయంగా నిలిచింది.