వాహనానికి పొల్యూషన్ సర్టిఫికేట్ లేకపోతే పెట్రోల్, డీజిల్ కట్

ఢిల్లీలో వాయు కాలుష్యం కోరలు చాస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది. చెల్లుబాటు అయ్యే పీయూసీ (PUC) సర్టిఫికేట్ లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోయకూడదని ఆదేశించింది.

Published on: Dec 16, 2025, 15:29:46 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ప్రమాదకర స్థాయికి చేరుకున్న కాలుష్యాన్ని అరికట్టేందుకు ఢిల్లీ యంత్రాంగం అత్యంత కఠినమైన అస్త్రాన్ని ప్రయోగించింది. ఇకపై ఢిల్లీలోని పెట్రోల్ బంకుల్లో వాహనాలకు ఇంధనం నింపాలంటే 'పొల్యూషన్ అండర్ కంట్రోల్' (PUCC) సర్టిఫికేట్ తప్పనిసరి. చెల్లుబాటు అయ్యే సర్టిఫికేట్ లేకపోతే చుక్క పెట్రోల్ కూడా పోయరని పర్యావరణ మంత్రి మంజీందర్ సింగ్ సిర్సా మంగళవారం ప్రకటించారు. ఈ కొత్త నిబంధన ఈ గురువారం నుంచే అమలు కానుంది.

మంజీందర్ సింగ్ సిర్సా (File photo)
మంజీందర్ సింగ్ సిర్సా (File photo)

ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యం ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ (AQI) వరుసగా మూడు రోజులుగా 'అత్యంత తీవ్రమైన' (Severe) కేటగిరీలో కొనసాగింది. మంగళవారం నాటికి ఇది స్వల్పంగా మెరుగుపడి 'చాలా పేలవమైన' (Very Poor) స్థితికి వచ్చినప్పటికీ, కాలుష్య ముప్పు ఇంకా తొలగలేదు. వాహనాల నుంచి వెలువడే పొగను నియంత్రించకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

నిబంధనలు ఉల్లంఘిస్తే అంతే సంగతులు!

కేవలం ఇంధనం నిలిపివేయడమే కాకుండా, నిబంధనలు అతిక్రమించే వారిపై ట్రాఫిక్ పోలీసులు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. సెప్టెంబర్ నెలలో జరిపిన తనిఖీల్లో పీయూసీ (PUCC) సర్టిఫికేట్ లేని 54,615 మంది వాహనదారులకు చలాన్లు జారీ చేశారు.

రోడ్డు పక్కన అడ్డదిడ్డంగా పార్కింగ్ చేసినందుకు గానూ అత్యధికంగా 1,37,348 మందికి జరిమానాలు పడ్డాయి. "కాలుష్యాన్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అందుకే సర్టిఫికేట్ ఉంటేనే ఇంధనం అనే నిబంధనను పక్కాగా అమలు చేస్తున్నాం" అని సిర్సా స్పష్టం చేశారు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More