ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసనల ఉధృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంతో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధుల రెండో విడత చర్చలు ముగిశాయి. నీట్-యుజి (NEET-UG) పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్పై తుది నిర్ణయం తెలిపేందుకు కేంద్రం శనివారం మధ్యాహ్నం వరకు గడువు కోరిందని సీజేపీ నాయకులు వెల్లడించారు.
రెండు ప్రధాన డిమాండ్లకు కేంద్రం అంగీకారం

శుక్రవారం కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో సీజేపీ ప్రతినిధులు ఆశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆశుతోష్ రాంకా మీడియాతో మాట్లాడారు. తమ రెండు కీలక డిమాండ్లకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిందని ఆయన తెలిపారు.
"నీట్ పేపర్ లీకేజీల వల్ల తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఆర్థిక పరిహారం అందించడానికి, నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి చట్టపరమైన కేసులు నమోదు చేయకపోవడానికి కేంద్రం సమ్మతించింది" అని ఆశుతోష్ రాంకా చెప్పారు.
రాజీనామా చేయకుంటే ఆందోళన తీవ్రతరం
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని లేదా ఆయనను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని సీజేపీ పట్టుబడుతోంది. ఈ అంశంపై ప్రభుత్వంతో లోతుగా చర్చించామని, శనివారం మధ్యాహ్నంలోగా కేంద్రం స్పందిస్తుందని ఆశిస్తున్నామని రాంకా తెలిపారు. మంత్రిని పదవి నుంచి తొలగించడంలో ఆలస్యం జరిగితే ఈ ఆందోళనను దేశవ్యాప్తంగా మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణ
మరోవైపు జూలై 20న 'సంసద్ చలో' పిలుపులో భాగంగా విద్యార్థులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో, కేంద్రం నుంచి రాతపూర్వక హామీ లభించడంతో ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్చుక్ తన 26 రోజుల నిరాహార దీక్షను విరమించారు.
"జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసనలు తెలిపిన వారిపై, జూలై 20న పార్లమెంట్ మార్చ్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు పెట్టబోమని కేంద్రం రాతపూర్వక హామీ ఇచ్చింది" అని సోనమ్ వాంగ్చుక్ తెలిపారు.
{{/usCountry}}"జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసనలు తెలిపిన వారిపై, జూలై 20న పార్లమెంట్ మార్చ్లో పాల్గొన్న విద్యార్థులపై కేసులు పెట్టబోమని కేంద్రం రాతపూర్వక హామీ ఇచ్చింది" అని సోనమ్ వాంగ్చుక్ తెలిపారు.
{{/usCountry}}నీట్ అక్రమాల వల్ల ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకుంటామని ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వడంతోనే తాను దీక్ష విరమించినట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే విద్యావ్యవస్థలో సమగ్ర సంస్కరణలు వచ్చే వరకు విద్యార్థుల పోరాటం ఆగేది లేదని తేల్చి చెప్పారు.